అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :- చిత్రంతేది:- 09/02/2026శీర్షిక:- నా మనసు రాణి… ప్రియమైన నా మనసు రాణి… ఈ రోజు నీ రూపాన్ని ఈ చిత్రంలో చూసిన క్షణం నుంచీ నా మనసు మాటలు వినడం మానేసింది. పచ్చని అడవిలో నడుచుకుంటూ వస్తున్న నీ నడకలో ఏదో మాయ ఉంది. నీ చిరునవ్వు చూస్తే, ఉదయపు తొలికిరణం తాకిన తామరపువ్వు గుర్తొస్తోంది. ఈ చిత్రం నా హృదయంలో ఎన్నో భావాలను ఒక్కసారిగా మేల్కొల్పింది. అందుకే నీకు ఈ ప్రేమలేఖ రాయకుండా ఉండలేకపోతున్నాను. నీ కళ్లలో కనిపిస్తున్న ప్రశాంతత, ముఖంలో మెరిసే సౌమ్యత ఇవన్నీ కలిసి నన్ను ఒక కలల లోకంలోకి తీసుకెళ్తున్నాయి. ఆ అడవిలోని పచ్చదనం కన్నా నీ అందమే ఎక్కువగా ప్రకాశిస్తోంది. నీపై పడుతున్న వెలుగు కూడా నిన్ను మరింత అందంగా చూపించేందుకు మాత్రమే పుట్టినట్టుంది. నువ్వు నడుస్తున్న తీరు చూస్తే, ప్రకృతి కూడా నిన్ను చూసి మురిసిపోతుందేమో అనిపించింది.…
డబ్బు ఉంటుందిఆకలి తీరదు….ఆదాయం వుంటుందిఆనందంకనిపించదు,దరిచేరదు….అన్నీ ఉంటాయిఇరువురిమధ్యఆత్మీయత వుండదు….తిండి,నీడ సరిపడావుంటే చాలుబంధంపెనవేసుక ఉంటే…….!పూరిగుడిసెలోపచ్చడి మెతుకులు తిన్నాచాలుబంధంఅనుబంధంగాకౌగిలించుకుంటే……!!🩷🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి
టాల్స్టాయితో కలుపుకుని రష్యన్ సాహిత్య స్వర్ణయుగం నాటి ప్రముఖ రచయితగా పేరు గాంచిన దాస్తొయెవ్స్కీ (Fyodor Dostoyevsky) చెకోవ్, హెమింగ్వే లాంటి రచయితలను నీషే, సార్త్రే లాంటి తత్వవేత్తలను విశేషంగా ప్రభావితం చేసారు. (1821 నవంబరు 11మాస్కో - 1881 ఫిబ్రవరి 9 (వయసు: 59)Saint Petersburg, Russian Empire) 19 వ శతాబ్దపు రష్యన్ సామాజిక, రాజకీయ, నైతిక సంఘర్షణల నేపథ్యంలో మానవ సంబంధాలు, మనస్తత్వాలు, మానసిక విశ్లేషణలతో కూడిన రచనలు చేసిన దస్తయేవస్కీ “క్రైమ్ అండ్ పనిష్మెంట్” ( Crime and Punishment ) “బ్రదర్స్ కరమొజొవ్” ( The Brothers Karamazov ) లతో ప్రపంచ ప్రసిద్ధి గాంచారు. “బ్రదర్స్ కరమొజొవ్” నవల అత్యంత విశిష్టమైన రచన అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చే ప్రశింసబడింది. దస్తయేవస్కీ “Notes From Underground” ( అజ్ఞాతవాసపు యాదస్తు చీటీలు ) నవల అస్థిత్వవాద సాహిత్యపు ( Existentialist literature )…
ప్రేమ లేఖ పోటి కొరకు రాస్తున్న లేఖ: హాయ్ అమ్మాయ్.,సాధారణంగా నిన్ను పేరు పెట్టి పిలవాలి కాని.. నేను ఇలా అమ్మాయ్ అని పిలుస్తానని, నువ్వు అలవాటు పడాలి., “ఏంటి ఆర్డర్ వేస్తున్నావు?” అనాలని ఉంది కదా నీకు., మరి రాబోయే రోజుల్లో నీ ఆర్డర్ల ముందు ఇది చక్కెర సైజుకి సగమే కదా!! సర్లే విషయానికి వస్తే, నువ్వు నాకు నచ్చావ్., కాని వెంకటేష్ పైన ఆర్తి అగర్వాల్ సాంబార్ పోసినట్టు, నువ్వు ప్లాన్ చేయకు., ఇది ప్రేమో, సినిమాల ఆశీస్సులో తెలియదు కాని నా జీవితాంతం, నువ్వే నా హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను., ఎందుకంటే ఉత్తరం రాసే ధైర్యాన్ని ఇచ్చిన నీ మాటలు, అప్పుడప్పుడు నువ్వు హం చేసే పాటలు, చప్పుడు చేయకుండా వేసే నీ అడుగులు, కపటం తెలియని నీ చూపులు - నాకు ఈ ఫీలింగ్ ని కలిగించాయి!! ఇంతకంటే గొప్పగా చెప్పినా, “బాగా ఓవర్…
అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :- చిత్రంతేది:- 08/02/2026శీర్షిక:- నీ ప్రియమైన మనసు… ప్రియమైన నా హృదయస్పందనకు… ఈ లేఖను నీకు రాస్తున్న వేళ నా మనసు మాటలకంటే ముందే నీ దగ్గరకు పరుగులు తీస్తోంది. ఈ రోజు నిన్ను ఇలా చూడగానే… చేతిలో ఎర్రగులాబీతో, కళ్లలో మౌనభాషతో నిలబడి ఉన్న నీ రూపం నా మనసులో చెరిగిపోని చిత్రంలా ముద్రపడిపోయింది. నువ్వు అలా నిలబడి ఉన్న ఆ ఒక్క క్షణమే నా జీవితంలో ఎన్నో కవితల్ని రాయించింది. నీ చూపులో ఏదో తెలియని మాయ ఉంది? ఆ చూపు నన్ను ప్రశాంతంగా పలకరిస్తుంది, ప్రేమగా దగ్గరకు పిలుస్తుంది. నీ చేతిలో ఉన్న ఆ ఎర్రగులాబీని చూసినప్పుడు నాకు అనిపించింది. అది నువ్వే అన్నట్లు. సున్నితత్వం, అందం, పరిమళం అన్నీ కలగలిసిన ఒక రూపంలా నువ్వు కనిపించావు. ఆ పువ్వు కన్నా అందంగా, మృదువుగా నా కళ్ల ముందు నువ్వు మెరిశావు. నీ…
జె.బాపురెడ్డి, (1936, జూలై 21 - 2023, ఫిబ్రవరి 8) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి, కవి, రచయిత. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చేరి మెదక్, వరంగల్లు జిల్లాలకు కలెక్టర్గా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రత్యేక సహాయకుడుగా ఉన్నాడు. భారత పొగాకు బోర్డుకు ఎక్జిక్యూటివ్ డైరెక్టర్గా, ధర్మాదాయశాఖకు కమీషనర్గా, పరిశ్రమల శాఖ కమీషనర్గా, చిన్నమొత్తాల పొదుపు సంస్థ కమీషనర్గా, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఇతడు 37 దేశాలలో పర్యటించి పలు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకున్నాడు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో 38కి పైగా గ్రంథాలను వెలువరించాడు. బాపురెడ్డి 1936, జూలై 21న కృష్ణారెడ్డి - రామలక్ష్మి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం, సిరికొండ గ్రామంలో జన్మించాడు. సిరిసిల్ల, హైదరాబాద్లలో విద్యాభ్యాసం చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం…
ఆండ్ర శేషగిరిరావు (ఫిబ్రవరి 8, 1903 - 2001) సుప్రసిద్ధ కవి, నాటకకర్త, పత్రికా సంపాదకులు.వీరు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంతాలూకా కొడమంచిలి గ్రామంలో 1903 సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన జన్మించారు. నరసాపురం టైలర్ ఉన్నత పాఠశాలలో చదివారు. వీరు కొంతకాలంఆనందవాణి వారపత్రికకు అసోసియేట్ ఎడిటర్గా ఉన్నారు. ఆంధ్రభూమి మాసపత్రికకు సంపాదకత్వం వహించారు. సాహితీ తపస్విగా ప్రసిద్ధులైన వీరు 2001 ప్రాంతంలో పరమపదించారు. అతను కుమార్తె కోలవెన్ను మలయవాసిని తెలుగు రచయిత్రి, అధ్యాపకురాలు, ఉపన్యాసకురాలు. రచించిన నాటకాలుభక్త నందనార్,దుర్గావతి లేదా గడామండల వినాశము,చిత్తూరు ముట్టడిసాయిబాబాత్యాగరాజుభారతిపుత్రివధిన. రచించిన కావ్యాలురామలింగేశ్వర శతకముశంకరస్తవము (శివానందలహరి అనువాదము)లలితా సుప్రభాతముఆత్మపుష్పాంజలి. ఇతర గ్రంధాలుసేవాసదనమురెడ్డిరాజులుతెలుగు బిడ్డలువాణిజ్య పూజ్యులువీర వనితలుఆంధ్ర విదుషీమణులువేమన పద్యాలకు వేదాంతార్ధాలుపండుగలు - పరమార్థములుకేయూరబాహుచరిత్ర - వచనానువాదము.ఆంధ్ర కవుల అధ్భుత మహిమల కథలు. మాధవి కాళ్లసేకరణ