ఎం.ఎల్.నరసింహారావు(స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సాహితీవేత్త)
డా. కె. ఎల్. నరసింహారావు ఒక స్వాతంత్ర్యసమరయోధులు.ఈయన 1900 లో జన్మించారు. అతను సెకండరీ విద్యను పూర్తిచేసిన తరువాత విజయనగరం మెడికల్ పాఠశాలలో 1918 లో చేరారు.భారత స్వాతంత్ర్య సంగ్రామంలో సహాయనిరాకరణోద్యమంలో ఆయన విద్యను వదులుకున్నాడు. ఆయన సత్యాగ్రహకారుల సైన్యంలో చేరాడు. ఆయన స్వచ్ఛంద కేంప్ ప్రారంభం, పికెటింగ్ నిర్వహణ చేశారు. అతను పంజాబ్ దురాగతాల వర్ణించటం కోసం నాటకాలు నిర్వహించారు. ఆయన ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించినందుకు గానూ 144 సెక్షన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఉద్యమం సస్పెండ్ అయిన తర్వాత ఆయన కలకత్తా వెళ్ళి మెడికల్ కోర్సును పూర్తి చేశారు. తర్వాత ఆయన మద్రాసులో డిగ్రీని పొంది రాజమండ్రికి వచ్చి మెడికల్ ప్రాక్టీసు ప్రారంభించారు. ఇతని భార్య కాశీభట్ల వేంకట రమణమ్మ కూడా స్వాతంత్ర్య సంగ్రామంలో, సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొనింది. జైలు శిక్షను అనుభవించింది. ఉప్పు సత్యాగ్రహ కాలంలో ఆయన రెండు…