శీర్షికఅభివృద్ధి దిశగా మహిళా మణులు నిజంగా చెప్పాలంటేస్త్రీ శక్తి స్వరూపిణి.పురాణ కాలం నుండి కూడా ఎందరో మహిళలు తమ యొక్క శక్తిని ప్రపంచానికితెలియపరుస్తూ ఉన్నారు.నేటి సమాజంలో కూడామహిళామణులు తమశక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూఉన్నారు. అభివృద్ధి పధంలోదూసుకు వెళ్తూనే ఉన్నారు.ప్రతి పురుషుడి విజయంవెనకాల ఒక స్త్రీ సహకారంఉంటుంది. ఆ విషయం కూడా అనేక సార్లు ఋజువుఅయ్యింది. అయితే స్త్రీలుమరింతగా అభివృద్ధి చెందాలి అంటే ముచ్చటగామూడు విషయాల మీదతమ దృష్టిని కేంద్రీకరించాలి.తమలోని ఆత్మన్యూనతా భావాన్ని తొలగించుకోవాలి.తాము ఏ పనీ చెయ్యలేముఅనే భావాన్ని మనసు నుండితొలగించుకోవాలి.ఇంక రెండవ విషయం ఏమిటంటే మహిళలలోఐక్యత ఉండాలి. ఐక్యంగాఉంటే ఎంత కష్టమైన పనినైనా సులభంగాపూర్తి చెయ్యగలరుమహాళామణులు.ముఖ్యంగా మూడోవిషయం ఏమిటంటేధైర్యాన్ని కోల్పోకూడదు.ధైర్యమే ఆయుధంగాజీవన సమరాన్నికొనసాగిస్తూ ఉండాలి.ఈ మూడు విషయాలనుఆకళింపు చేసుకునినేటి సమాజంలోమహిళలు అభివృద్ధిదిశగా అడుగులు వెయ్యగలరు. ఈ రచన నా స్వీయ రచన. -వెంకట భాను ప్రసాద్ చలసాని.
**వేద గాయత్రి ** వేదమాత గాయత్రి నమస్తుభ్యం,వేద వేదాంతముల మూల శక్తి నమస్తుభ్యం… పంచ భూతమ్ము ల సమ్మిళిత రూపిణీ,పంచ ముఖమ్ము ల అలరారు మాతా,పంచ ప్రాణముల తేజరిల్లు గాయత్రి,పంచేంద్రియముల జ్ఞాన ప్రదాతా… నాలుగు వేదముల సారమే నీ రూపం,నాలుగు దిక్కుల వెలుగులు నీతేజమే,నాలుగు పాదముల ధర్మము నిలుపగాను,నాలుగు యుగముల పూజ లందుకోవమ్మా… త్రి మూర్తుల శక్తి సమ్మిళితమే గాయత్రి,త్రి దేవేరుల జ్ఞాన సంపద ఆ రూపమే,త్రిలోకముల నిత్య పూజితము నీ మంత్రం,త్రి కాల సంధ్యలందు జపిం ప బడు మంత్రమీయే … చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి
దాహం,,,,,, దాహం అంటే దాహం తీర్చేది మహిళఆకలి,,,,,,, ఆకలి అంటే అన్నం పెట్టేది అమ్మ మహిళనీ కామకోర్కెలను తీర్చేది ఇల్లాలనే మహిళపురిటి నొప్పులతో బిడ్డకు జన్మనిచ్చేది ఓ తల్లి అని మరువకు!!ఈ పురుషస్వామ్య వ్యవస్థలో మహిళ చదరంగంలో పావు అయిందిపెళ్ళితో మహిళ కోరుకునే భవిష్యత్తుపై ఆశలు అడియాశలైమగాడి చేతుల్లో బంధీయై సర్వస్వము కోల్పోయేది మహిళమగాడికి పట్టిన ధన పిశాచి వరకట్నం!మగాడు శ్రమించి సంపాదించే తత్వం లేక తన ఆధిక్యత కోసంఅబలలను కట్నం కోసం పీల్చి పిప్పి చేసే మృగం మగాడు,,,,,!తన మెడలోని తాళి ఎగతాళియై బుసకొడుతుంటేతన తల్లిదండ్రులు కట్నం ఇచ్చుకునే స్థితి లేక కన్నీరు మున్నీరవుతుంటేతాముకూడా ఆడవాళ్ళమని మరచిన అత్తా ఆడబిడ్డలు చూపించే నరకం ఓ అగ్నికుటీరం తన అత్తారిల్లు !అదే మహిళ చదువుకుని ఉన్నత ఉద్యోగం చేస్తేఆమె జీతం రాళ్లన్నీ వాడి చేతుల్లో పడాలిమహిళ ఒక బంగారు గుడ్లు పెట్టే బాతు వాడికి!ఈ సృష్టికి మూలమైన స్త్రీమూర్తికి పడరాని పాట్లువాడు…
భారత వైమానిక దళ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న నిర్వహించబడుతుంది. భారతీయ వైమానిక దళం (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) 1932, అక్టోబరు 8వ తేదీన స్థాపించబడి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వైమానిక దళంగా పేరుపొందింది. అంతటి శక్తివంతమైన వైమానిక దళం యొక్క సేవలను గుర్తిస్తూ ప్రతిఏటా అక్టోబర్ 8న భారత వైమానిక దళ దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. 1932, అక్టోబర్ 8న ఏర్పడిన భారత వైమానిక దళం బ్రిటీష్ తరపున రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నది. దానికి గుర్తుగా 1945లో రాయల్ భారత వైమానిక దళంగా మార్చబడింది.1950లో గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన తరువాత భారత వైమానిక దళంగా రూపాంతరం చెందింది. 1933 ఏప్రిల్ 1న భారత వైమానిక దళానికి తొలి ఎయిర్క్రాఫ్ట్ వచ్చింది. తొలినాళ్ళలో కేవలం ఐదు మంది పైలట్స్, ఒక ఆర్ఏఎఫ్ మాత్రమే ఉండేవారు. 1.70 లక్షల మంది సిబ్బందితో, 1300 విమానాలతో భారత వైమానిక దళం ప్రపంచంలోనే…
1891 : నవలా రచయిత, నాటక కర్త భోగరాజు నారాయణమూర్తి జననం (మ.1940). 1895 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు అడివి బాపిరాజు జననం (మ.1952). 1902 : ఆర్ధిక శాస్త్రవేత్త, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి, వాసిరెడ్డి శ్రీకృష్ణ జననం (మ.1961). 1918 : తెలుగు సినిమా నటుడు పేకేటి శివరాం జననం (మ.2006). 1932 : భారతీయ వైమానిక దళం ఏర్పాటయింది. 1935 : భారత క్రీడాకారుడు మిల్ఖా సింగ్ జననం. 1963 : తెలుగు నటుడు చిలకలపూడి సీతారామాంజనేయులు మరణం (జ.1907). 1976 : తెలుగు రచయిత, కవి, అనువాదకుడు కందుకూరి రామభద్రరావు మరణం (జ.1905). 1979 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మరణం (జ.1902). మాధవి కాళ్లసేకరణ
ఆలయంలో దేవతఉన్నాడంటే నమ్మనుఆకలి చావులతోమూత కళేబరాలతోఅనాధ బిడ్డలుకూడు లేకగూడు లేకధరించు చక్కని వస్త్రంబు లేకఅలమటించు పోతుంటేముక్తకంఠముతోబోరు బోరు నాప్రసంగాలతో నడవడం వల్లవారి ఆకలి తీరదువారి బాధలు తొలగవుదీన మనస్కుడైన అమ్మదీనురాలిగా మలిచానుసేవ చేయదలిచావుసాటి వారికి సాయపడనితోటి వారిని గౌరవించనివింత లోకం విడ్డూరంఅసువులు బాసి ఆలయాన కన్నీరు విడిచికెవ్వుమంటూ కేక వేస్తే అది మనసా చేతకానితనముదీపారాధన కుంకుమార్చన ఉపవాస కూడికనఒరిగినది ఏమి సాటి వారికినీ వల్ల కలుగు లాభం ఏమిప్రాణం ఉన్నంతవరకుగుడి గుండె దీప వెలిగే వరకుగొంతి లో గాలి ఉన్నంతవరకునిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుముఅన్న బైబిల్ సూక్తి లాగాఅంకితమైపోయావు మా మదర్ దేరిసా అమ్మ హామీ పత్రం ఈ కవిత నా యొక్క సొంత రచనఇట్లుయడ్ల శ్రీనివాసరావు విజయనగరం