కోడలు తో తంటా
కోడలు తో తంటా ఒక ఊరిలో రంగమ్మ అనే ఆవిడ కూరగాయలు అమ్ముకుంటు జీవించేది.ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు వాల్లు చిన్నగా ఉన్నప్పుడే భర్త చనిపోవడంతో కూరగాయల వ్యాపారంసాగిస్తుంది. పిల్లలు పెరిగి పెద్దవాల్లు కావడంతో కూతురుకు మంచిసంబంధం చూసి పెళ్లి చేసింది. కొడుకుకు కూడ సంబంధాలు చూస్తుంది ఇంకా ఎక్కడాకుదరడం లేదు. వయసు పై పడడంతో కొంచం చెవుడు కూడ వచ్చిందికంటి చూపు కూడ మందగిస్తున్నట్టు అనిపిస్తుంది. దాంతో మంచి కోడలన్నా వస్తె బాగుండునని చాలాసంబంధాలు వెతుకుతుంది. కూతురు తరపు బంధువులలో ఒకమ్మాయి బాగుందనికూతురు ఫోన్ చేసి చెప్పింది. ఆ సంబంధం చూద్దామని కొడుకును మంచిగా తయారుచేసుకుని తీసుకుని వెళ్లింది రంగమ్మ. పెెళ్లి వారికి రంగమ్మ కూతురు ఫోన్ చేసి చెప్పడంతోవాల్లు అన్ని రడీ చేసుకుని ఉన్నారు. వీళ్లు వెళ్లగానె కాళ్లు కడుక్కోమని చెంబుతో నీళ్లు ఇచ్చారు రంగమ్మకి. కాళ్లు కడుక్కోమన్నది సరిగావినపడక తాగడానికి ఇచ్చారేమెానని తాగబోయింది. అయ్యెా!!కాళ్లు కడుక్కోండత్తయ్యా…