సాయి చరితము భ్రమలు తొలగించేది సాయీ మా బతుకు పండించేది సాయీ సాయి నామము తోటి మేము ఆనందమే పొందుతాము చరణం నడిసంద్రమున మేము సాయి కష్టాల సంద్రమున ఉంటే ఊరడిస్తావు/గా మమ్ము సాయి ధైర్యమిస్తావు/గా మాకు సాయి చరణం ఎంత వేడెదమయ్య నిన్ను ఎన్ని జన్మల భాగ్యమయ్యా సద్గురువు నీవనుచు మేము పూజలే చేసెదము నీకు చరణం దీనులను దీవించుతావు వారికో మార్గమే చూపేది నీవు సకల జీవులయందు ఉండి వారిని కాపాడు దైవమే నీవు చరణం ఆడంబరము లేదు నీకు భిక్షా పాత్రయే ఆస్తిగా లోకాలు చుట్టెదవు నీవు లోకులను మార్చే దైవమై సి.యస్.రాంబాబు
శివతత్త్వం శివుడు నిర్గుణుడు. లయకారుడు. నిరాడంబరుడు. విలక్షణమైన వ్యక్తిత్వం, వేషధారణ, వేదాంతతత్త్వం ఉన్నవాడు. అందరూ అందంగా కనిపించాలనుకుంటారు, కాని అందుకు భిన్నంగా శివుడు స్వయంగా నిరాడంబరజీవితాన్ని గడుపుతూ, ఎవ్వరూ ధరించలేని, చూడటానికి భీతిని కలిగించే అలంకారాలతో సాక్షాత్కరిస్తాడు. అందువల్లే శివతత్త్వం అనేది స్థిరపడింది. అందరూ పట్టువస్త్రాలు ధరిస్తే శివుడు దిక్కులు అనే వస్త్రాలను ధరించి, దిగంబరుడయ్యాడు. అందరూ బంగారు మేడలలో నివసిస్తుంటే ఆయన శ్మశానంలో నివసిస్తాడు. అంతిమంగా ప్రతి ప్రాణి చేరేది శ్మశానానికేనని తెలియచెప్పడానికే ఆయన శ్మశాన వాసి అయ్యాడు. శివుడు లయకారుడు అంటే అన్నింటినీ లయం చేసేవాడు. అయితే ఆయన లయం చేసేది మనుషులలో దాగి ఉన్న చెడు, పాపం, అజ్ఞానం, కోరికలు, బంధాలు, శారీరక, మానసిక దోషాలు, దుష్కర్మలు, ఇంద్రియాలు, భౌతికాలను, మంచి చెడుల విచక్షణ పోయినప్పుడు శివుడు ఈ ప్రపంచాన్ని లయం చేస్తాడు. అప్పుడే నూతన సృష్టి జరుగుతుంది. అత్యంత రహితమైన లింగతత్త్వమే ఆత్మ. ప్రతి దేహంలోనూ…
జననేత సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు అప్పటి ప్రజలు "సైమన్, గో బ్యాక్" అనే నినాదంతో ఆ కమిషన్ ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. దానికి కారణం కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడమే. ప్రజలంతా కమిషన్ ఎక్కడికి వెళ్లినా నల్లజెండాలు ప్రదర్శించి స్వాగతం పలికారు. కమిషన్ 3 ఫిబ్రవరి 1928న మద్రాసును సందర్శించినప్పుడు, ప్రకాశం పంతులు " సైమన్ కమిషన్,గో బ్యాక్" అనే నినాదాన్ని ఇచ్చారు. ప్రకాశం నేతృత్వంలోని ప్రజలను ఆంగ్ల పోలీసులు హెచ్చరించారు. ఆ సమయంలో పార్ధ సారధి అనే వ్యక్తిని బ్రిటీషు పోలీసులు కాల్చారు. పార్ధ సారధి నొప్పితో విలవిలలాడాడు." దాహం దాహం" అని దీనంగా రోదించాడు. అప్పుడు ప్రకాశం అతనికి నీళ్ళు అందించేందుకుముందడుగు వేసాడు. బ్రిటీష్ పోలీసులు ఒక అడుగు ముందుకు కదిలినా కాల్చేస్తాంఅని ప్రకాశంను హెచ్చరించారు. అప్పుడు ప్రకాశం పంతులు వారి తుపాకుల ముందు నిలబడి తన ఛాతీని చూపెట్టి" దమ్ముంటే కాల్చండిరా" అని సింహనాదం…
మా తల్లి అంబికా కరుణించవే ఈరోజు మంగళవారం రాత్రి 10:00 లకు రోజిగారు ఇంటి వద్ద ఆవుకి అప్పుడు నొప్పి మొదలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకుపోదాం అనుకుంటే రిక్షాలు లేవు , సైకిల్ లేవు , రోడ్డుమీద జనం లేరు. నాకు భయమేసింది.ఈ రోజు నాకేదో మూడింది .అని కానీ నాకు ఒక భయం లేదు .నాకు దేవుడు కాపాడుతాడు.ధైర్యం వచ్చింది .ఎందుకంటే నేను అవును ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బయలుదేరుతున్నాను.మాది పల్లెటూరు మాది మంగళ వీధి ఈరోజు ఆసుపత్రికి వెళుతూ ఉండగా దారిలో డాక్టర్ గారి వద్దకు వెళ్లి వస్తున్నాను.ఇంతలో అర్ధరాత్రి సమయం ఒక ఆడ ఆమె తలపై అగ్ని కొంపటి తో పరుగులేసి నడుస్తుంది. అడుగులు చాలా పెద్దవి ,ఆపాదం చాలా పెద్దది.నేను చూసి భయపడ్డాను .నాతో ఒక మాట వెనకనుంచి మాట్లాడింది.నన్ను చూసినట్లు నేను కనిపించినట్లు నీవు మరొక్కరితో గాని ,వేరే వాళ్ళతో గాని, మీ ఇంటి…
సాయిచరితము-183 పల్లవి నీ పదమే మా శరణము నీ చూపే మా ప్రాణము నీ తలపే మా స్వర్గము సాయిమహాదేవా.. సాయిమహాదేవా.. చరణం ఆపదలు ఎన్నున్నా నిన్ను తలచుతామయ్యా కష్టాలు ఎదురైతే నీకు మొక్కుతామయ్యా షిరిడీలో ఉన్ననేమి మా గుండెన ఉంటావు మా కంటిపాపవై మార్గమునే చూపుతావు చరణం నీ నీడన మేముంటే జన్మ ధన్యమేనయ్యా మా అందరి గురువువై జ్ఞాన బోధ చేస్తావు నీ చరితను చదివితిమా బతుకు విలువ తెలియునుగా కష్టసుఖాలన్నింటా వెంట నీవు ఉండవయా -సి.యస్.రాంబాబు
సాయిచరితము పల్లవి నీ దివ్య రూపమ్ము కలలోన గాంచితే కలతలే ఉండవు కాంక్షలే తీరును కనిపించరావా సాయిమహదేవా చరణం బాధలన్నియు మావి తెలియనిది కాదా తెరతీసి రావయ్యా తెరిపి మాకియ్యగా అదుపు తప్పిన మనసు అర్థించె నిన్ను కుదుపులతో కాలమే భయపెడుతు ఉన్నది చరణం కూరిమి ఓరిమి మాకియ్యవయ్యా మా బతుకులోన మార్పు తేవయ్యా మమతనే పంచుతూ కష్టాలు తీర్చుతూ కదిలి రావయ్యా ఓ షిరిడీవాసా నిను నమ్మినాము నిను కొలిచినాము మా అండనీవనుచు మాస్వామి నీవనుచు చరణం నీ నామ స్మరణయే నిత్యమూ చేసి తృప్తినే మేము పొందినామయ్యా నీ చరితమే చదివి నేర్చినామయ్యా నీ తత్వమే మాకు తెలిసినది సాయీ నీ శరణు కోరితే ఆపదలు రావని నీ ప్రేమ పంచితే బతుకే మారునని తెలిసింది సాయి.. మనసు మురిసింది సాయి -సి.యస్.రాంబాబు