Motivational Stories

కాకాని చక్రపాణి (కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు)

కాకాని చక్రపాణి (కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు)

కాకాని చక్రపాణి (కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు) కాకాని చక్రపాణి తెలుగు కథా రచయిత. మానవ జీవన సంఘర్షణలను, అక్రోశాలను, అత్మీయతానుబంధాలను హృద్యమైన శైలిలో రుపుదిద్దగల శిల్పి అయన. వీరు దాదాపు పన్నెండు నవలలు, ఎన్నో కథలు లెక్కకు మించిన అనువాదాలు, వ్యాసాలు ప్రకటించారు. కాకాని చక్రపాణి గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో 1942, ఏప్రిల్ 26వ తేదీన శ్రీరాములు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరు మంగళగిరి సి.కె.ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం ముగించి, ఉన్నత విద్యను గుంటూరులో కొనసాగించారు. 1966లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇరువురు కుమారులు. 1993లో భార్య మరణించగా 1999లో పునర్వివాహం చేసుకున్నారు. 1970లో ఇంటి నుండి తిరుపతికి 600 కి.మీ.ల దూరం కాలినడకన ప్రయాణం చేయడం వీరి జీవితంలో ముఖ్య ఘట్టం. వీరు హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో 1974 నుండి 2000 వరకు 37 సంవత్సరాలు ఆంగ్లభాషా బోధకుకులుగా పనిచేసి…
Read More
పిలకా గణపతిశాస్త్రి (కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు)

పిలకా గణపతిశాస్త్రి (కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు)

పిలకా గణపతిశాస్త్రి (కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు) పిలకా గణపతి శాస్త్రి ( జ:ఫిబ్రవరి 24, 1911 - మ:జనవరి 2, 1983) కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. 1911 ఫిబ్రవరి 24న తూర్పు గోదావరి జిల్లా కట్టుంగ గ్రామంలో జన్మించాడు. విజయనగరం సంస్కృత కళాశాలలో సాహితీ విద్యా ప్రవీణ పట్టా పొందాడు. ఆయన రాజమహేంద్రవరం ఆంధ్ర యువతీ సంస్కృత పాఠశాలలోను, వీరేశలింగం పాఠశాలలోను తెలుగు పండితుడుగా పనిచేశాడు. కవిగా, వ్యాఖ్యాతగా, నవలా రచయితగా, అనువాదకునిగా, ఆర్ష విద్వాంసుడుగా పత్రికా సంపాదకుడుగా విశేష ఖ్యాతి పొందాడు. పిలకా గణపతి శాస్త్రి ఆంధ్ర శిల్పి, ఆంధ్రభారతి, ఆంధ్రప్రభ వంటి పత్రికలకు సహాయ సంపాదకుడుగా పనిచేశాడు. గణపతి శాస్త్రిగారు జనవరి 2, 1983లో మరణించారు. రచనలు నవలలు విశాల నేత్రాలు (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి)హేమపాత్ర - విప్రనారాయణ కథ…
Read More

ఓగేటి అచ్యుతరామశాస్త్రి (పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త)

ఓగేటి అచ్యుతరామశాస్త్రి (పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త) ఓగేటి అచ్యుతరామశాస్త్రి పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త. ఇతడు 1932, జనవరి 2న జన్మించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలోను, హైదరాబాదు విమోచన ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం చేశాడు. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత, హిందీ భాషలలో ఇతడికి విస్తృతమైన పరిచయం ఉంది. 1970లో సంస్కృత థియేటర్ అనే సంస్కృత నాటక ప్రయోగ సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఇతడు నాటక ప్రయోక్త, నటుడు, దర్శకుడు, గాయకుడు కూడా. రంగస్థలం మీద, ఆకాశవాణిలో ప్రసారమైన అనేక నాటకాలలో ఇతడు నాయక, ఉపనాయక పాత్రలను పోషించాడు. 1974లో ఇతడు సంస్కృత భారతీ అనే సంస్కృత పత్రికను స్థాపించి సంపాదకునిగా వ్యవహరించాడు. ఇది హైదరాబాదు నుండి వెలువడిన తొలి సంస్కృత పత్రిక. 1978లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రప్రభుత్వ పురస్కారం స్వీకరించాడు. రచనలు శంకరాచార్య (1958) - పద్యకృతిబంధాబైరాగి (1959) - చారిత్రక…
Read More
మల్లవరపు జాన్ (తెలుగు కవి)

మల్లవరపు జాన్ (తెలుగు కవి)

మల్లవరపు జాన్ (తెలుగు కవి) మల్లవరపు జాన్ ప్రసిద్ధకవి. జాను కవి గారు 2 జనవరి 1927లో జన్మించారు. మల్లవరపు దావీదు, శ్రీమతి రత్నమ్మ గార్లు వీరి తల్లి తండ్రులు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి వీరి జన్మ స్థలం. వీరి కుటుంబానికో ప్రత్యేకత ఉంది. వీరి కుమారుడు మల్లవరపు రాజేశ్వరరావు, కుమార్తె కోటి రత్నమ్మ, మనవడు ప్రభాకరరావులు మంచి కవులు. ఒక మనవడు మంచి చిత్రకారుడు. జాను కవి గారు ది:12 ఆగష్టు, 2006 న మరణించారు. ఆయన కుమారుడు మల్లవరపు రాజేశ్వరరావు తన తండ్రిపేరుతో తెలుగు సాహిత్యంలో విశేషమైన సేవచేసిన వారికి ప్రతియేడాది ఒక పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పురస్కార కమిటీకి మల్లవరపు సుధాకరరావు, మల్లవరపు ప్రభాకరరావులు ట్రస్టీలుగా ఉన్నారు. వీరిద్దరూ ప్రవృత్తి రీత్యాకవులు, వృత్తి రీత్యా కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్నారు. ఈ పురస్కారాన్ని 2016 నుండి ప్రారంభించారు. తొలిపురస్కారాన్ని ప్రముఖకవి, పరిశోధకుడు,…
Read More
జాతీయ గణిత దినోత్సవం

జాతీయ గణిత దినోత్సవం

జాతీయ గణిత దినోత్సవం జాతీయ గణిత దినోత్సవం డిసెంబరు 22న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు. 2012 ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. డిసెంబరు 22న దేశవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో విద్యా కార్యక్రమాలతో జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటారు. సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం నాడు స్మారక తపాలా బిళ్ళను విడుదల చేయడమేకాకుండా 125వ జయంతి సందర్భంగా 2012ను జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది. 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా లోని కుప్పంలో రామానుజన్ మఠ్ పార్క్ ప్రారంభించబడింది. గణితం అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది. గణిత శాస్త్రం…
Read More
సామాజిక రుగ్మతలకు దారేది?! స్కెచ్

సామాజిక రుగ్మతలకు దారేది?! స్కెచ్

సామాజిక రుగ్మతలకు దారేది?! స్కెచ్ ఒకప్పుడు జనాభ తక్కువగా ఉండి, మీడియా,రవాణా సౌకర్యాలు, జనసంచారం ఇంతగా లేవు.కాని ఇప్పుడు విద్య,వైద్యం విరివిగా అందుబాటులోకి వచ్చాయి.మీడియా విస్తరణ, జనాభా పెరుగుదల విచ్చలవిడిగా దుర్వ్యసనాలకు బానిసలయ్యేందుకు మూలమయ్యాయి.మనుష్యుల ఆలోచనలు క్రమేనా పెడదారులలో తక్కువ శ్రమతో వెంటవెంటనే ఆదాయం సమకూర్చుకునే మార్గాలు తొక్కుతున్నారు.జనాభా పెరిగింది కాని విద్య చాలా వరకు అందుబాటులోకి వచ్చినా, పెచ్చరిల్లుతోన్న నిరుద్యోగ సమస్య, ఉపాధి కల్పనలు ప్రభుత్వాలకు తీర్చలేని పరిస్థితి.వైద్యంలో విప్లవాత్మక మార్పులు వచ్చినా వింతవింత అంటువ్యాధులు, క్యాన్సర్ ,షుగర్,ఒబేసిటీ,గుండెపోట్లు లాంటి మహమ్మారీలు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి ముఖ్యంగా నిరుపేదల పాలిట శాపంగా మారాయి.ఇది ఇలావుంటే చదువులు అబ్బని యువతరం తల్లిదండ్రులపై ఆధారపడుతూ దూర్వ్యసనాలకు బానిసలై తిక్కతిక్క సినిమాలు,స్మార్ట్ఫోన్లలో చూపించే బూతులు అదేపనిగా చూస్తూ అదేజీవితం అనుకుంటూ మనస్సు చెదిరి సామాజిక విద్రోహులవుతున్నారు.వీటన్నింనీ దారిలోకి తేవడం ఏ ప్రభుత్వాలకు సాధ్యపడట్లేదు.అందుకే ఒక్కో టర్మ్ ఒక్కో సమస్యను ఎన్నుకుని పరిష్కరికిస్తేనే గాని చాలావరకు…
Read More

మాటే మంత్రము

మాటే మంత్రము ప్రపంచంలో మాటలతో పరిష్కరించలేని సమస్య అంటూ లేదు. ప్రపంచ యుద్ధాలు కూడా మంచి మాటలతో కూడిన చర్చల వల్ల నివారించవచ్చు. మరికొన్ని సందర్భాలలో దేశాల మధ్య మన్నన లేని మాటల వల్ల యుద్ధాలు సంభవించవచ్చు. మాట తీరు అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దానిని ఉపయోగించే విధానాన్ని బట్టి దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తి అంతరంగాన్ని తెలుసుకొని వారి ఆలోచన విధానాన్ని బట్టి మాట్లాడితే పెద్ద సమస్యలకు కూడా గొప్ప పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు. ఉదాహరణకు ఎప్పుడో చదివిన ఒక చిన్న కథ చెబుతాను. ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకోవడం కోసం ఊరి చివర ఉన్న బావి వైపు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తోంది. ఆమెను ఆ ప్రయత్నం నుంచి విరమించడానికి దారిన వెళ్లే వాళ్ళందరూ ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక సాధువు ఆమెతో ఇలా అన్నాడు.. "అమ్మాయి జీవితం ఎంతో విలువైనది అది…
Read More

మజిలీ

మజిలీ గతుకులతో ఉన్న మట్టి రోడ్డు మీద దుమ్ము రేపుకుంటూ వెళుతోంది బస్సు. అసలే వేసవి కాలం, అందులో మిట్టమధ్యాహ్నం కావడంతో ఎండ అదిరిపోతోంది. బస్సులో క్రిక్కిరిసి ఉన్న జనం వడగాల్పులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతూ బస్సు ఆగిన ప్రతిసారీ గాలి ఆడక తొందరగా స్టార్ట్ చేయమని డ్రైవర్ పై విసుక్కుంటున్నారు. తొందరగా తమ గమ్యం చేరుకోవడం కోసం అసహనంగా ఎదురుచూస్తున్నారు. బస్సులో కిటికీ పక్కన దూరంగా చూపులు సారించి, బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్లు కూర్చునివున్న తులసి "టికెట్ ఎక్కడి వరకు ఇవ్వాలి? " అంటూ కండక్టర్ రెట్టించి అడిగితేగానీ వర్తమానంలోకి రాలేదు. "ఈ బస్సు ఎక్కడ వరకు వెళ్తుందండి?" అడిగింది. "దేవపురం వరకు" అసహనంగా చూస్తూ చెప్పాడు. "అక్కడికే ఒక టికెట్ ఇవ్వండి". టికెట్ తో పాటు చిల్లర ఇచ్చిన కండక్టర్ "టికెట్.. టికెట్" అంటూ ముందుకు సాగిపోయాడు. బస్సు వేగం పుంజుకుంది. దగ్గరగా వచ్చినట్లే వచ్చి స్థిరంగా…
Read More

కవల సహోదరులు

కవల సహోదరులు అనగనగా వీరాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. అచ్చట చంద్రయ్య అనే రైతు తన కుటుంబంతో నివసిస్తుండేవాడు. ఆయనుకు ఇద్దరు అబ్బాయిలు. బాగా చదువుకుంటారు. ఇద్దరు కవల సహోదరులు. వారి పేర్లు సదానందం మరియు చిదానందం. పక్క ఊరు నర్సాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుకుంటున్నారు. దసరా పండుగ సెలవలు వచ్చాయి. పదిహేను రోజులు ఆనందంగా గడపటానికి ఇంటికి వచ్చారు. తల్లితండ్రులు చాల ఆనంద పడ్డారు. ఎందుకు పడరు? కవల పిల్లలంటేనే ఇంటికొక అందం! అమ్మ శాంతమ్మ రకరకాల పిండివంటలు చేసారు పిల్లల కోసం. ఈ సంవత్సరం వర్షాలు బాగానే పడ్డాయి. పొలం పనిలో చంద్రయ్య ఇంటినుండి బయటకి వెళ్ళటం మొదలు పెట్టారు. వారికి పొలంలో ఒక నుయ్యి ఉన్నది. నీరు కోసం బావి నుండి చోదకయంత్రం (మోటారు) పెట్టి, గొట్టం ద్వారా నీరు తీసి పొలానికి పంపిణి చేస్తారు. వీరాపురం గ్రామం నుండి…
Read More

కష్టే ఫలి

కష్టే ఫలి రాము మరియు లోకేష్ ఇద్దరు మంచి స్నేహితులు వాళ్ళు ఒకే గ్రామంలో నివసిస్తున్నారు. రాము మతపరమైన వ్యక్తి మరియు దేవుడిని చాలా బలంగా నమ్మేవాడు. లోకేష్ చాలా కష్టపడి పనిచేస్తాడు. ఒకసారి ఇద్దరూ కలిసి ఒక పెద్ద భూమిని కొన్నారు. ఆ భూమిలో వారు పంటను పండించి ఫలితం వచ్చాక సొంత ఇంటిని కట్టుకోవాలి అని అనుకున్నారు. లోకేష్ పొలంలో చాలా కష్టపడ్డాడు కాని, రాము ఏమీ చేయలేదు. కాని అతడు దేవుని గుడికి వెళ్లి పంట మంచిగ పండటానికి దేవుడిని ప్రార్థించాడు. అదేవిధంగా, సమయం గడిచిపోయింది. కొంత సమయం తరువాత, పొలంలో పంట పండి, అమ్మడానికి సిద్ధంగా ఉంది. రెండింటినీ మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మిన తరువాత వారికి మంచి డబ్బు వచ్చింది. ఇంటికి వచ్చారు, లోకేష్ రాముతో మాట్లాడుతూ, "నేను ఇందులో ఎక్కువ కష్టపడ్డాను, కాబట్టి ఈ డబ్బును నేను ఎక్కువగా పొందుతాను". అని అంటాడు. ఇది…
Read More