Motivational Stories

ఇచ్ఛాపురపు రామచంద్రం

ఇచ్ఛాపురపు రామచంద్రం

ఇచ్ఛాపురపు రామచంద్రం ఇచ్ఛాపురపు రామచంద్రం ప్రముఖ కథారచయిత. బాలసాహిత్యరచయిత. ఆయన సావిత్రి బాయిపూలే ట్రస్ట్‌ సలహాదారు, ఆంధ్రప్రదేశ్‌ అవయవ దాతల సంఘం ముఖ్య కార్యకర్త.ఈయన విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నంలో సత్యవతి, వైద్యనాథం దంపతులకు 1940, జూన్ 16న జన్మించాడు. బి.ఎ. (ఎకనామిక్స్‌) చదివాడు. వృత్తిరీత్యా 1968 నుండి జీవితభీమా సంస్థలో పనిచేసి 2000 సంవత్సరంలో అనకాపల్లి బ్రాంచి ఆఫీసులో పదవీవిరమణ చేశాడు. తరువాత విశాఖపట్నంలో స్థిరపడ్డాడు. ఈయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఇచ్ఛాపురపు రామచంద్రం 500లకు పైగా కథలు, కథానికలు, రేడియో నాటికలు రాసి ప్రజాదరణ పొందాడు. కాశీమజిలీ కథలను అనువాదం చేశాడు. బాలసాహిత్యంలో 40నుంచి 50 వరకూ పుస్తకాలు రాసిన ఆయన ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక పత్రికల్లో ఆయన కథలు వందకుపైగా ప్రచురితమయ్యాయి.దారి పక్క దీపాలు (కథా సంపుటం)సిద్ధార్థ (కథా సంపుటం)సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి : సరళ సుందర పౌరాణిక ఉత్కంఠ కథా సంగ్రహముభట్టి…
Read More
మల్లాది రామకృష్ణశాస్త్రి

మల్లాది రామకృష్ణశాస్త్రి

మల్లాది రామకృష్ణశాస్త్రి మల్లాది రామకృష్ణ శాస్త్రి (1905- 1965) తెలుగు రచయిత.వచన రచనకు మేస్త్రీ - మల్లాది రామకృష్ణ శాస్త్రి. ఆయన విశ్వమానవుడు. వసుధైక కుటుంబకం అనే భావన మదినిండా బలీయంగా కలిగిన మహనీయులు. మల్లాది రామకృష్ణశాస్త్రి 1905, జూన్ 17న కృష్ణా జిల్లా, చిట్టిగూడూరు గ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో కనకవల్లి, నరసింహశాస్త్రి దంపతులకు జన్మించారు. మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివారు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. యడవల్లి సుబ్బావధాన్లుగారి దగ్గర వేదవిద్యను, నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి గారి దగ్గర మహాభాష్యాన్ని, శిష్ట్యా నరసింహశాస్త్రి గారి దగ్గర బ్రహ్మసూత్రాలను అభ్యసించారు. నాట్యకళలో, చిత్రలేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది. మొదట మచిలీపట్నంలోనే స్థిర నివాసం. తర్వాత కొంతకాలంపాటు గుంటూరులో కాపురం. 15వ ఏట పురాణం సూరిశాస్త్రి గారి కుమార్తె వెంకటరమణతో వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కొడుకులిద్దరికీ ఒకరికి తండ్రిపేరు…
Read More
మణివన్నన్ (తమిళ, తెలుగు, సినిమా నటుడు,దర్శకుడు, రచయత)

మణివన్నన్ (తమిళ, తెలుగు, సినిమా నటుడు,దర్శకుడు, రచయత)

మణివన్నన్ (తమిళ, తెలుగు, సినిమా నటుడు,దర్శకుడు, రచయత) ఎస్. మణివన్నన్ రాజగోపాల్ (1953 జూలై 31 - 2013 జూన్ 15 ) మణివణ్ణన్ గా గుర్తింపు పొందాడు. అతను భారతీయ సినీ నటుడు, దర్శకుడు, తమిళ ఉద్యమకారుడు. మూడు దశాబ్దాల సినీ జీవితంలో నటుడిగా మారడానికి ముందు అతను 1980 నుండి 82 వరకు దర్శకుడు భారతీరాజాకు కథ, సంభాషణ రచయితగా పనిచేసి, తరువాత విభిన్న ప్రక్రియలతో ప్రయోగాలు చేయడంలో అభివృద్ధి చెందిన విజయవంతమైన దర్శకుడిగా మారాడు. అతని పేరుతో 400 సినిమాలలో మణివణ్ణన్ ఈ రంగంలో అత్యంత అనుభవంతులైన నటులలో ఒకనిగా గుర్తింపు పొందాడు. అతను 50 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. మణివణ్ణణ్ ప్రధానంగా చిత్రాలలో సహాయక నటుడు, తరచూ హాస్యనటుడు, విలన్ పాత్రను పోషించాడు. తన జీవితకాలంలో ద్రావిడ మున్నేట్ర కజగం, మరుమలార్చి ద్రావిడ మున్నేట కజగం సహా వివిధ రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చాడు. తరువాత…
Read More
మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము

మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము

మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము (కవి, రచయిత, చిత్రకారుడు) మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యం (ఆగస్టు 25, 1926 - జూన్ 15, 2010) వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అజ్ఞాత రచయిత.ఇతడు వైఎస్ఆర్ కడప జిల్లా, రాజంపేట తాలూకా, బుడుగుంటపల్లెలో వేంకటసుబ్రహ్మణ్యం, అన్నపూర్ణమ్మ దంపతులకు 1926వ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన జన్మించాడు. ఇతడు ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. యజుశ్శాఖాధ్యాయి. భారద్వాజ గోత్రీయుడు. ఇతని వంశము (మైనంపాటి వంశము) చారిత్రక- సంగీత - సాహిత్య విశేషం కలది. మైనంపాడులోని వేణుగోపాలస్వామి ఇతని కులదైవము. ఇతడు బుడుగుంటపల్లెలో ప్రాథమిక విద్య ముగించుకుని కోడూరులోని హైయ్యర్ ఎలిమెంటరీ పాఠశాలలో 8వ తరగతి వరకు చదువుకున్నాడు. తరువాత గ్రామాధికారుల పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణుడై 1949వరకు గ్రామాధికారిగా పనిచేశాడు. లోకన రాఘవయ్య వద్ద సంస్కృతాంధ్రాలు చదువుకుని మద్రాసు విశ్వవిద్యాలయం వారి విద్వాన్ పరీక్షలకు కట్టి ఉత్తీర్ణుడై విద్వాన్ పట్టాను పొందాడు. తరువాత ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేశాడు. కొన్నాళ్లు…
Read More
చక్రి (తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, నటుడు)

చక్రి (తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, నటుడు)

చక్రి (తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, నటుడు) చక్రి అలియాస్ చక్రధర్ జిల్లా (1974 జూన్ 15 - 2014 డిసెంబర్ 15) తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, నటుడు.ఇతడు జూన్ 15, 1974న వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో జన్మించాడు. ఇతను సంగీతం సమకూర్చిన సినిమాల్లో అత్యంత ప్రజాధారణ పొందినవి.. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం. తెలుగులోనే కాక తమిళం, కన్నడంలో కూడా చక్రి సంగీతం సమకూర్చాడు. చక్రధర్ జిల్లా సంగీతం అందించిన చివ‌రి చిత్రం విష్ణు మంచు, కేథరీన్ థెరీసా హీరోహీరోయిన్లుగా నటించిన ఎర్ర‌బస్సు. స్వయంకృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి సంగీత దర్శకుడు చక్రి జీవితం ఒక ఉదాహరణ. చక్రి అసలు పేరు చక్రధర్ జిల్లా. వరంగల్ జిల్లా మహబూబాబాద్ సమీపంలోని కంబాలపల్లి చక్రి స్వస్థలం. ఉపాధ్యాయుడైన చక్రి తండ్రి వెంకటనారాయణ కళాకారుడు కూడా. బుర్రకథలు…
Read More
నాగబైరవ కోటేశ్వరరావు

నాగబైరవ కోటేశ్వరరావు

నాగబైరవ కోటేశ్వరరావు నాగబైరవ కోటేశ్వరరావు ‎(కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత) నాగభైరవ కోటేశ్వరరావు (ఆగష్టు 15, 1931 - జూన్ 14, 2008) ప్రముఖ కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత. సంప్రదాయ ఛందో కవితా రచనలలోనూ, ఇతర విధానాలలోనూ అందె వేసిన చేయి. సమాజం శ్రేయస్సు, అణగారిన వర్గాల పట్ల కరుణ ఇతని రచనలలో కనిపించే ప్రధానాంశాలు. నాగభైరవ కోటేశ్వరరావు ఆగష్టు 15, 1931వ సంవత్సరంలో ప్రకాశం జిల్లా, రావినూతల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రావినూతల హైస్కూలులో సెకండరీ గ్రేడ్ టీచరుగా తమ ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. తరువాత స్వయంకృషితో పై చదువులు చదివి స్నాతకోత్తర పట్టాను పొందారు. 3 దశాబ్దాలకు పైగా ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశారు.కొంత కాలం అస్వస్థతతో బాధపడిన నాగభైరవ కోటేశ్వరరరావు 2008, జూన్ 14న మరణించారు. నాగభైరవ కోటేశ్వరరావు పెక్కు రచనలు చేశారు. రెండు పుస్తకాలు కాలేజీ…
Read More
బుచ్చిబాబు

బుచ్చిబాబు

బుచ్చిబాబు బుచ్చిబాబు (జూన్ 14, 1916 - సెప్టెంబర్ 20, 1967) గా పేరుపడిన ఈయన అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. ఈయన ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త, కథకుడు. ఈయన తెలుగు రచనలలో 'బుచ్చిబాబు' అన్న కలంపేరుతోనూ, ఆంగ్ల రచనలలో 'సంతోష్ కుమార్' అన్న పేరుతోనూ రచనలు చేశారు. ఆయన ఏలూరులో శివరాజుసూర్య ప్రకాశరావు, వెంకాయమ్మ దంపతులకు జూన్ 14, 1916 న జన్మించాడు. అక్షరాభ్యాసం కంకిపాడులో జరిగింది. పాలకొల్లులో ఎస్.ఎస్.ఎల్.సి.లో ఉత్తీర్ణులై, ఇంటర్మీడియట్, బి.ఏ. పట్టాలు గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదివారు. 1937 చివరలో డిసెంబరు, మార్గశిర మాసంలో తూర్పుగోదావరి జిల్లా ఇప్పనపాడు గ్రామానికి చెందిన ద్రోణంరాజు సూర్య ప్రకాశరావు గారి రెండవ కుమార్తె సుబ్బలక్ష్మితో ఆయన వివాహం జరిగింది. తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ. ఆనర్సులో ఉత్తీర్ణులై, నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి 1941లో ఎం.ఏ. పట్టా పొందారు. ఈయన కొన్నాళ్ళు అనంతపురం, విశాఖపట్నంలలో ఆంగ్ల…
Read More
రమణ గోగుల

రమణ గోగుల

రమణ గోగుల రమణ గోగుల తెలుగు సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత, సంగీతకారుడు, ప్రపంచ సంగీత దర్శకుడు, రచయిత. 1996 లో అతని బృందం మిస్టి రిథమ్స్ ఇండీ పాప్‌ను స్టూడియో ఆల్బమ్ "అయే లైలా" తో పాటు, మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. ఇది భారతదేశంలోని MTV, ఛానల్ [V] వంటి ప్రధాన సంగీత ఛానెళ్లలో చార్ట్ బస్టర్‌గా మారింది. ఆ తర్వాత, తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టి, మూడు దక్షిణ భారత భాషలలో సుమారు 25 చిత్రాలకు పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశాడు. తమ్ముడు, ప్రేమంటే ఇదేరా, బద్రి, యువరాజు వంటి చిత్రాలు ఈయన యొక్క అత్యంత ముఖ్యమైన విజయాలలో ఉన్నాయి. ఈయన, ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో ఎం.టెక్ తో పాటు బాటన్ రూజ్‌లోని లూసియానా స్టేట్ యూనివర్శిటీ (LSU) నుండి కంప్యూటర్ సైన్సులో ఎం.ఎస్…
Read More
సింగిరెడ్డి నారాయణరెడ్డి

సింగిరెడ్డి నారాయణరెడ్డి

సింగిరెడ్డి నారాయణరెడ్డి సింగిరెడ్డి నారాయణరెడ్డి (గేయరచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత) సి.నా.రె. గా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 - జూన్ 12, 2017) తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను అతనికి 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా పనిచేసాడు. తెలుగు చలన చిత్ర రంగంలో అతను రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. సి.నారాయణరెడ్డి 1931, జూలై 29 (అనగా ప్రజోత్పత్తి సంవత్సరం నిజ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు) న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీపేట్లో జన్మించాడు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల…
Read More
చలసాని ప్రసాదరావు

చలసాని ప్రసాదరావు

చలసాని ప్రసాదరావు చలసాని ప్రసాదరావు ప్రముఖ రచయిత, చిత్రకారుడు, సంపాదకుడు.చలసాని ప్రసాదరావు (అక్టోబరు 27, 1939 - జూన్ 12, 2002 ) ప్రముఖ రచయిత,చిత్రకారుడు.కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్ల పెనుమర్రు గ్రామంలో అక్టోబరు 27 1939 న ఒక సామాన్య రైతుకుటుంబంలో జన్మించాడు. 1949-50 మధ్యకాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో చదువుకున్నాడు. చిన్నతనంలో ఇతన్ని టైఫాయిడ్‌ వేధించింది. దాంతో వినికిడి కోల్పోయాడు. ఆ సమయంలో ఇతడి మామ వెల్లంకి సుగుణభూషణరావు పుస్తకపఠనంపై ఆసక్తి కల్పించాడు. ఆయన ప్రోత్సాహంతో చలసాని ప్రజాశక్తి, విశాలాంధ్ర పత్రికల్లో చిన్న ఉద్యోగంలో చేరాడు. 1951-56 సంవత్సరాల మధ్య సాగిన ఆ ఉద్యోగ జీవితం తర్వాత ఇతడు 1956 నాటికి వరంగల్లు చేరుకున్నాడు. కాకతీయ పత్రిక అనే వారపత్రికలో అసోసియేట్‌ ఎడిటర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఫైనార్ట్స్‌ కళాశాలలో కమర్షియల్‌ ఆర్ట్‌లో అయిదుసంవత్సరాల డిప్లొమా కోర్సు, పెయింటింగ్‌లో ఒక సంవత్సరం సాగే కోర్సు…
Read More