నవతరం
నవతరం గబుక్కున మెలకువ వచ్చింది సుధకు , అమ్మో తెల్లారిపోయిందా అనుకుంటూ అరచేతులు చేసుకుని ,రామా పరంధామ , నువ్వే దిక్కయ్య అంటూ లేచి మంచం సర్దేసి , బయటకు వచ్చింది, పిల్లలు ఇంకా లేవనట్టు ఉన్నారు, కొడుకూ, కొడలూ ఇంకా లేచినట్టు లేదు. హమ్మయ్య సరే ముందు నా పనులు చేసుకుంటాను అనుకుంటూ తానూ కాలకృత్యాలు తీర్చుకుని, ఇల్లు సర్దేసి, తుడిచేసింది సుధ. ఒక కాఫీ పెట్టుకుని తాగుతున్నప్పుడు మెల్లిగా పిల్లలూ, కొడుకు, కోడలు లేచారు. అందరూ తమ ఫోన్లు పట్టుకుని సోఫాల్లో కూర్చున్నారు. ఈ లోపు సుధ పూజగది సిద్దం చేసుకుంది. కాసేపు అలా చూస్తూ కూర్చుంది. పిల్లలు గాని, కొడుకు, కోడలు కాని ఏమైనా అంటారు ఏమో అని, కాని వాళ్ళు ఎంతకు కదలడం లేదు,అసలు మొహాలు, స్నానాలు ఏవి చేయడం లేదు. ఇక ఓపిక పట్టలేని సుధ ఏరా పిల్లలు లెండి, లెండి లేచి…