స్వార్థం పెరిగితే…
స్వార్థం పెరిగితే… రాత్రి పదకొండు గంటలు దాటింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామయ్యను కుటుంబ సభ్యులు హడావిడిగా ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాణం కాపాడాలని అందరి కళ్లలో ఒక్కటే ఆశ. డాక్టర్లు పరీక్షలు చేసి,"ముందుగా ఐదు లక్షలు డిపాజిట్ చేయండి. ఆ తర్వాత చికిత్స ప్రారంభిస్తాం" అన్నారు."సార్! మా దగ్గర అంత డబ్బు లేదు. ముందుగా ఆయన ప్రాణం కాపాడండి. డబ్బు ఎలాగైనా తెస్తాం?" అని రామయ్య భార్య వేడుకుంది.కానీ , వారి మాటలకు విలువ లేకపోయింది. డబ్బు లేకపోతే… చికిత్స లేదని స్పష్టంగా చెప్పారు. కుటుంబ సభ్యులు అప్పుల కోసం పరుగులు తీశారు. బంగారు నగలు తాకట్టు పెట్టారు. భూమి అమ్మాలని ప్రయత్నించారు. అప్పటికే రామయ్య పరిస్థితి విషమించింది.చివరకు డబ్బు చెల్లించిన తర్వాతే… చికిత్స మొదలైంది. కానీ , అప్పటికే ఆలస్యమైపోయింది. రామయ్య ప్రాణాలు దక్కలేదు. భార్య గుండెలవిసేలా ఏడుస్తూ,"మేము ఆసుపత్రికి వచ్చాం , ప్రాణాలు కాపాడతారని.…