తిరుమల గీతావళి
పల్లవి
అండగ నిలిచేవాడిని
ఏమని మే కోరెదెము
కొండలపై ఉన్నవాడిని
ఎంతని మే వేడెదెము
చరణం
దారే తెలియని వారము
నిను చేరాలని వేచెదము
నీవుంటే మాకు వేడుక
అనుమానము లేనే లేదిక
చరణం
లేనివారికి నీవేగా
ఉన్నవారికీ నీవేగా
నీకృపనే కోరేవారికి
ఇంకెవరు లేరుగా
చరణం
మాలోనే నీవుంటే
ఏ భయము చేరదుగా
గోవిందా అని పలికితిమా
నీవే మమ్ము వెతికేవు
చరణం
నీ తలపే సాక్షిగా
నిను చూసే భాగ్యానికి
కన్నులు కాయలు కాచినవి
కాలము పరిగెడుచున్నది
-సి.యస్.రాంబాబు
Related posts:
గురు పౌర్ణమిJuly 5, 2023
Family Stories
సీతమ్మ జడలు,పట్టుకుచ్చు పూలు అంటారుNovember 24, 2023
Trending Now
ఓ కృష్ణా! సత్యభామతో కలిసి..November 27, 2023
Trending Now
ఒక్కరి మనసు మారినా-కోటేశ్వరరావు ఉప్పాలNovember 17, 2023
Trending Now
కనువిప్పు తథ్యం!!May 7, 2022
Aksharalipi Poems
పేరు లేని బంధంJanuary 16, 2023
Aksharalipi Poems