మేము ఒకసారి కురువా పురం వెళ్లాము అది దత్తాత్రేయుల వారి గుడి అయితే ఆ గుడికి వెళ్లడానికి ఒక నది ఉంటుంది ఆ నదికి ముందు ఒక పెద్ద గుడి
ఆ గుడిలో అందరూ దేవతలు ఉన్నారు అక్కడ చాలా మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి ఆ నది వెనుక బాగంలో దత్తాత్రేయుని గుడి ఉంది ఇక ఆ గుడికి వెళ్లడానికి పడవ ప్రయాణం చేయాలి..
ముందు గుడి లో నే అన్నదాన సత్ర ముంటుంది అక్కడ స్వామి వారిని దర్శించుకుని మళ్లీ ఇటు వచ్చి
భోజనం చేయాలి..

పడవలో వెళ్తుంటే చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం అక్కడ గుడి కూడా చాలా బాగుంటుంది
అక్కడి నుండి కొంచం లోపలికి వెళ్లాక స్వామి వారు
తపస్సు చేసిన గుహ ఉంటుంది అది సొరంగంలా ఉంటుంది దాంట్లోకి వంగి వెళ్లడం చాలా కష్టం వెళ్ల లేని వారు బయట నుండి వంగి చూసినా కనపడుతుంది స్వామి వారి విగ్రహం..
మళ్లీ పడవ లోనే తిరిగి రావాలి..
భోజనం చేసాక అక్కడి నుండి మంత్రాలయం వెళ్లాం! అక్కడ తుంగభధ్రా నదిలో కూడా పడవ ప్రయాణం చేసాం!! దీపాలు ముట్టించుకున్నాం!!
చాలా చాలా చాలా బాగుండె ఆ పడవ ప్రయాణం!!