స్వప్నకు పుస్తకాలంటే తెగ పిచ్చి ఎప్పుడు చూసినా పుల్తకాలు చదువుతూ కూర్చునేది..
స్వప్న తల్లి రమణమ్మకు కోపం ఎప్పుడూ ఆ పుస్తకాలు చదువుతూ కూర్చోక పోతే కాస్త పని చేయెుచ్చు కదా! ఆడపిల్లకు పనే ముద్దు అని కోప్పడుతూ ఉండేది..
ఇంతకీ స్వప్న చదివే పుస్తకాలేంటో తెలుసా? కథలు,నవలలు ,డిటెక్టివ్ లు మరి అవే చదవగలదు ఎందుకంటే ఆడపిల్లని ఏడో తరగతికే చదువు మానిపించేసారు దాంతో టైం పాస్ కి ఇలాంటి బుక్స్ చదవడం అలవాటు చేసుకుంది కానీ అదే లోకమైంది..
ఇలా పుస్తకాల పురుగైతే ఎలా? దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడని రమణమ్మకు చాలా బెంగగా ఉండేది..
ఇక చూడగా చూడగా ఒక తలకు మాసినతడు దొరికాడు
హమ్మయ్య ఈ బకరా అయితే దొరికాడని సంతోషించి పెళ్లి చేసి పంపింది..
అప్పటి నుండి ఇక తల్లిగారింటికి రానేలేదు..
ఒకరోజు పేపర్లో పెద్ద ఫోటోతో స్వప్నకు బహుమానం వచ్చిందని వేసారు..
పక్కింటావిడ పేపర్లో స్వప్న ఫోటో చూపించింది..
దేనికా? అనుకుంటున్నారు కదూ!
స్వప్న పెద్ద రచయిత్రి అయ్యింది మరి..
పుస్తకాలు చదివీ చదివీ ఒకసారి ఏదో నవలల పోటీ పెడితే దానికి రాసి అలా పేరు తెచ్చుకుంది..
బకరా అనుకున్న భర్త పూర్తి సపోర్ట్ తో!
ఏ పుస్తకాలు చదివినా ఏదో ఒక లాభం ఖచ్చితంగా ఉంటుందని ఇలాంటి చదువు రాని రమణమ్మ లాంటి వాల్లకు కూడా అర్థమైందోచ్!!
ఇ వ్వాల పుస్తక దినోత్సవం సందర్బంగా నా ఈ చిన్న కథ..