హైదరాబాద్ నగర చరిత్ర
హైదరాబాద్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని మరియు ఒక ముఖ్యమైన చారిత్రక నగరం. ఇది దక్షిణ భారతదేశంలో మూసీ నదీ తీరాన నెలకొనివుంది. హైదరాబాద్ను 1591 లో కుతుబ్ షాహీ వంశానికి చెందిన మొహమ్మద్ కులీ కుతుబ్ షా స్థాపించారు.
హైదరాబాద్ స్థాపనకు ముందు గోల్కొండ రాజధానిగా ఉండేది. గోల్కొండ కోటను కుతుబ్ షాహీలు నిర్మించారు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా తన ప్రేమికురాలు భాగమతి పేరిట భాగ్యనగరం అని పిలవబడే నగరాన్ని నిర్మించాడు. ఆ తర్వాత ఆమెకు ఇస్లాం మతం ప్రకారం హయ్యత్ బఖ్ష్ అనే పేరు ఇవ్వడంతో, నగరాన్ని హైదరాబాద్గా మార్చారు.
హైదరాబాద్ నగర చరిత్రను ప్రతిబింబించే ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అందులో
చార్మినార్ ఒకటి. ఈ కట్టడం 1591లో నిర్మింప
బడింది. ఈ కట్టడం నగరానికి చిహ్నంగా నిలిచింది. ఇది ఇస్లామిక్ శైలిలో నిర్మించబడిన అద్భుత శిల్పం. అలాగే
గోల్కొండ కోట నగరానికి దగ్గరలో ఉన్న ఒక పురాతన కోట.దీనిని కాకతీయులు మొదటగా నిర్మించగా, కుతుబ్ షాహీలు అభివృద్ధి చేశారు. అలాగే
మక్కా మసీదు భారతదేశంలోనే పెద్ద మసీదులలో ఒకటి.
చౌమహల్లా ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్ వంటి రాజభవనాలు నిజాం వంశం వారు
నిర్మించారు.
నిజాం పాలన
1724 లో ఆసఫ్ జాహీ వంశ స్థాపకుడు నిజాం ఉల్ ముల్క్ హైదరాబాదును తన రాజధానిగా ఎంపిక చేసుకుని పాలించాడు. నిజాం వంశానికి చెందిన పాలకులు భారతదేశంలో అత్యంత ధనికులుగా గుర్తించబడ్డారు. నిజాం పాలనలో హైదరాబాద్ విద్య, వైద్యం, రవాణా రంగాలలో అభివృద్ధి చెందింది.
స్వాతంత్ర్య అనంతరం
1947లో భారతదేశ స్వాతంత్ర్యానంతరం, హైదరాబాద్ స్వతంత్ర దేశంగా కొనసాగాలన్న నిజాం కోరికను కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. 1948లో "పోలీస్ యాక్షన్" ద్వారా హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేశారు.ఆధునిక హైదరాబాద్ ఐటీ రంగంలో కీలకంగా ఎదిగింది. "సైబరాబాద్" అనే పేరుతో హైటెక్ సిటీ అభివృద్ధి చేయబడింది. ఇందులో మల్టీనేషనల్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు స్థాపించబడ్డాయి. హైదరాబాద్ తెలుగు, ఉర్దూ సాహిత్యానికి పేరెన్నిక గన్న నగరం.హైదరాబాద్ నగరం చరిత్ర, సంస్కృతి, సాంకేతికతను సమన్వయంగా కలగలిపిన ప్రత్యేక నగరం. ఇది ప్రపంచానికే
దిశానిర్దేశం చేస్తున్న ఆధునిక నగరంగా వెలుగొందుతోంది.
దేశమంటే మట్టి
కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అని
మహాకవి చెప్పారు.
హైదరాబాద్ నగరంలో అనేక మంది గొప్ప వ్యక్తులు జన్మించారు.
చరిత్రకారులలో
శ్రీ సురవరం ప్రతాపరెడ్డి ప్రముఖ చరిత్రకారుడు, జర్నలిస్టు, రచయిత. "గోల్కొండ పత్రిక"ను ప్రారంభించిన మహానుభావుడు.
ఫర్హాన్ అఖ్తర్ గారు హైదరాబాద్లో పుట్టినప్పటికీ ముంబైలో పెరిగారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, దర్శకుడు, నటుడు, గాయకుడు.
హైదరాబాద్ నగరంలో పుట్టిన మరియు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పలువురు గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారు వివిధ రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించి, దేశం మరియు ప్రపంచానికి గొప్ప కీర్తిని తీసుకొచ్చారు.
సాహిత్యం రంగంలో బహుభాషా ప్రతిభ
కనపరిచారు సరోజిని నాయుడు గారు.ఆవిడ
ప్రముఖ కవయిత్రి, భారత తొలి మహిళా గవర్నరుగా
పనిచేసారు.
ఆమెకు "నైటింగేల్ ఆఫ్ ఇండియా" అనే బిరుదు ఉంది. అనేక మంది శాస్త్రవేత్తలు ,విద్యావేత్తలు
ఇక్కడ జన్మించారు.
అందులో సత్య నాదెళ్ల
గారు ఒకరు. ఆయన
మైక్రోసాఫ్ట్ సి.ఇ.ఓ గా
పనిచేసారు. ఆయన
హైదరాబాద్లో పుట్టారు, అయన తన విద్యను ఇక్కడే ప్రారంభించారు.
అలాగే రాహుల్ వేణు గోపాల్ గారు స్వచ్ఛ భారత్కు తోడ్పడిన పర్యావరణ కార్యకర్త
అలాగే క్రీడారంగంలో
సానియా మీర్జా గొప్ప
టెన్నిస్ స్టార్ గా
పేరు పొందారు.
ఆమె స్వస్ధలం హైదరాబాదు.
మొహమ్మద్ అజహరుద్దీన్
గారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. ఆయన కూడా హైదరాబాద్లోనే పుట్టారు. అలాగే
వీవీఎస్ లక్ష్మణ్ గారు భారత క్రికెట్ జట్టు లెజెండరీ బ్యాట్స్మన్. హైదరాబాద్ ఆయన స్వస్థలం.
హైదరాబాద్ నగరం సాంస్కృతికంగా, విద్యా రంగంలో, కళల్లో, రాజకీయాల్లో కృషి చేసిన ఎంతో మంది ప్రతిభావంతులకు పుట్టినిల్లు.
సేకరణ
వెంకట భాను ప్రసాద్ చలసాని