రాఖి పౌర్ణమి సందర్భంగా నిర్వహించే అంశం *అన్నా చెల్లెలి అనురాగం* పై నా కవిత.
శీర్షిక
తోబుట్టువులు
కుటుంబానికి నాన్న
అస్తమిస్తున్న సూరీడు.
అదే కుటుంబానికి అన్నే
ఉదయిస్తున్న సూరీడు.
తండ్రి తరువాత అన్న
ఆ స్ధానం భర్తీ చేస్తాడు.
అన్నా అని చెల్లి పిలిస్తే,
నేనున్నానని వస్తాడు.
అన్న కన్ను అయితే,
ఆ కంటిపాప చెల్లెలే.
అన్నా చెల్లెళ్ల ప్రేమ,
ఇలలో సాటిలేనిది.
కష్టసుఖాల్లో కలిసి
మెలసి ఉండాలి.
మన అమ్మలోని అంశ
మన చెల్లెలే సుమా.
చెల్లి మనసు కష్టపెట్టి
బాగుపడలేరు ఎవ్వరూ.
కష్టంలో ఉన్న చెల్లి
కన్నీరు తుడిచేదే అన్న.
ఆస్తులు లేకున్నా సరే,
అన్న తోడుంటే చాలదా.
కష్టాలు ఎదురైనా అన్న వెంట ఉంటే చాలదా.
తరాలు మారినా
తరగదు ఆ ప్రేమ.
అయితే ఇప్పుడేమో రోజులు మారాయి.
డబ్బే ఈ ప్రపంచాన్ని
శాసిస్తోంది ఇప్పుడు.
బంధాలు, బంధుత్వాలు
అన్నీ బలహీన పడ్డాయి.
ఆస్తుల కోసం గొడవలు
మొదలయ్యాయి నేడు.
అన్నా చెల్లెళ్ల బంధం
బలహీన పడుతోంది.
ఆప్యాయతలు దూరం అయిపోతూ ఉన్నాయి.
మళ్ళీ పాత రోజులు
రావాలని కోరుకుందాం.
ప్రేమ ,ఆప్యాయతలు
పంచుకునే రోజులు
మళ్ళీ తిరిగి రావాలి.
మన మనుషులు మన
మనుషులుగా ఉండాలి.
కన్నీరు తుడిచే ఆ అన్న చెయ్యి స్పర్శతో చెల్లి కష్టాలు తొలగిపోయేను.
ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని