అంశం
దీపావళి కధల పోటీ
శీర్షిక
చీకట్లను తొలగించేద్దాం.
చుట్టూ చీకటిని చూసి భయపడవద్దు. దీపాలు
వెలిగించి చీకట్లను పారద్రోలి
జీవితాన్ని ధైర్యంగా, ఆనందంగా గడపవచ్చు
అని సందేశం ఇస్తోంది
దీపావళి పండగ. చుట్టూ
అంధకారం అలుముకున్న
సమయంలో వెలుతురు కోసం
ఎదురుచూపులు చూసే బదులు మానవ ప్రయత్నం
చేయమని దీపావళి పండగ
మనకు సందేశం ఇస్తోంది. ఇక
కధలోకి వెళితే చదువుకోలేదనే
బాధ రాజా మనసులో చాలా ఉండేది. రాజా చిన్నప్పుడు
వారి ఆర్ధిక పరిస్థితి అసలు
బాగాలేదు. తింటానికే సరిపడా
ఉండేది కాదు. ఏదో వానాకాలం చదువులు
చదివాడు. ఎప్పటికైనా
గొప్ప స్ధాయికి చేరుకోవాలి
అనేది రాజా ఆశ, ఆశయం.
ఆ ఆశయం కోసం అహర్నిశలు
కష్టపడి పనిచేసేవాడు. అలా పనిచేస్తే వచ్చిన డబ్బులు చాలా పొదుపుగా వాడుకొని మిగతావి దాచుకునేనాడు.
దాచుకున్న డబ్బులను
పెట్టుబడిగా పెట్టి వ్యాపారం
చేయటం మొదలుపెట్టాడు.
అతని వ్యాపారం మూడు
పువ్వులు, ఆరు కాయలుగా
అభివృద్ధి చెందింది. అతని
వ్యాపార సామ్రాజ్యం చక్కగా
విస్తరించింది. అతని సంస్థలో
చాలా మంది పనిచేసేవారు.
రాజా తన దగ్గర పనిచేసే వారి
పిల్లల ఆలనా పాలనా చూసేవాడు. రాజా తన
చిన్న వయసులో చదువుకోలేక
పోయాడు కాబట్టి అతనికి చదువు విలువ తెలుసు.
అందుకే తన దగ్గర పనిచేసే
వారి పిల్లలను చదివించే
బాధ్యత తీసుకున్నారు.
తమ పిల్లల బాగోగులు చూసే
రాజా అంటే అతని సిబ్బందికి
ఎంతో ఇష్టం. చాలా కష్టపడి
పనిచేసి సంస్ధను అభివృద్ధి
దిశగా పరుగులు పెట్టించారు.
ఒక చిన్న దీపం కూడా తన
చుట్టూ వెలుగులు నింపుతుంది అని రాజా
నిరూపించాడు. చీకట్లను పారద్రోలి వెలుతురు నింపాలి
అనేది రాజా ఆశయం. అది
సాధించినందుకు అతనికి
ఎంతో తృప్తిగా ఉంది. మనం కూడా అలాంటి ఒక ప్రయత్నం చేద్దాం.
ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని
అంశం
దీపావళి కథల పోటీ
శీర్షిక
వెలుగులు పంచాలి
రాత్రి తర్వాత పగలు, చీకటి తరువాత వెలుగు వస్తుందని ఎదురు చూసే బదులు ఆ చీకటిలోనే దీపం వెలిగించి చీకట్లను పారద్రోలి జీవితాన్ని
ధర్మబద్ధంగా మలుచుకోవడం
చాలా అవసరం. కష్టాల
కొలిమిలో కాలిపోతున్నా
మొక్కవోని ధైర్యంతో ధర్మాన్ని కాపాడుతూ ముందుకు సాగాలి. శ్రీరాముడు తండ్రి మాటను కాదనకుండా అడవి బాట పట్టాడు. శ్రీరాముడు, రావణుడు లంకకు తీసుకుని వెళ్ళిన తన భార్య
సీతాదేవిని తిరిగి తీసుకుని
వచ్చేందుకు రావణునితో యుద్ధం చేసి అతన్ని వధిస్తాడు. మనిషిగా పుట్టి,
ధర్మాన్ని రక్షించేందుకు అపరిమితమైన శక్తి కలిగిన
రావణునిపై విజయం సాధిస్తాడు. అలాగే
శ్రీకృష్ణుడు పుట్టడమే
చెరసాలలో పుట్టాడు.
ఆ తర్వాత నందుని
ఇంట తన తల్లిదండ్రులకు
దూరంగా పెరిగాడు. చిన్న
వయసులోనే శ్రీకృష్ణుణి
చంపేందుకు కంసుడు ఎందరో
రాక్షసులను పంపాడు. అయితే శ్రీకృష్ణుడు వారందరినీ
సంహరించాడు. ఆ తర్వాత
కంసుని సంహరించి తన
తల్లిదండ్రులను చెరసాల నుండి విడుదల చేసాడు.
సత్రాజిత్తు వేసిన నీలాపనిందను దూరం
చేసుకున్నాడు. పాండవుల
పక్షం వహించి ధర్మాన్ని
గెలిపించారు. అంతిమ విజయం ధర్మానిదే అనే
విషయం గ్రహించాలి.
ధర్మో రక్షతి రక్షితః అనే విషయం గ్రహిస్తే చింతలేకుండా
జీవితాన్ని గడిపేయవచ్చు.
సానుకూల దృక్పథం
ఉంటే ఏదైనా సాధించవచ్చు.
ఈ రచన నా స్వీయ రచన
వెంకట భాను ప్రసాద్ చలసాని
I am working as a teacher from past 25 years. I am google local guide also.
I uploaded many photos in Google. I wrote stories and poems in online magazines. I also work as LIC agent also.