శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు

తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన రాజకీయ నాయకుల్లో ఒకరు. ఆయన తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కూడా.
కల్వకుంట్ల చంద్రశేఖర రావు 1954 ఫిబ్రవరి 17న మేడక్ జిల్లా, సిద్దిపేట మండలంలోని చింతమడక గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి
శ్రీ కల్వకుంట్ల రంగారావు మరియు తల్లి వెంకటమ్మ. విద్యాభ్యాసం హైదరాబాద్‌లో పూర్తి చేసిన ఆయన, రాజకీయశాస్త్రం మరియు సాహిత్యంలో పట్టభద్రుడయ్యారు. విద్యార్థి దశ నుండే ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగిన ఆయన, యువకుడిగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.కే.సి.ఆర్. తన రాజకీయ జీవితాన్ని 1980లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభించారు. అయితే 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడి నుండి ఆయన పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. 1985లో సిద్దిపేట నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా నాలుగు సార్లు సిద్దిపేట ఎమ్మెల్యేగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు.2001లో తన రాజీనామా తర్వాత భారతీయ జనతా పార్టీ మద్దతుతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. తరువాత 2004లో టీఆర్ఎస్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ భాగస్వామిగా ఎన్నికల్లో పోటీ చేసింది. అనంతరం కే.సి.ఆర్. కేంద్ర క్యాబినెట్‌లో నౌకాయాన మరియు గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రిగా సేవలందించారు.
తెలంగాణ ఉద్యమం ఆయన జీవితంలో అత్యంత కీలక ఘట్టం. తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఆయన టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించారు. 2009లో జరిగిన ఆయన నిరాహారదీక్ష తెలంగాణ ఉద్యమానికి మైలురాయిగా నిలిచింది. ఈ దీక్షతో దేశమంతటా దృష్టి తెలంగాణ సమస్యపై కేంద్రీకృతమయ్యింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై చర్చలు ప్రారంభించింది. కొన్ని సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత, 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడింది.తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కే.సి.ఆర్. 2014 జూన్ 2న రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం, నీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగ అభివృద్ధి, రహదారుల నిర్మాణం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరిత హారమ్ వంటి పలు ప్రాజెక్టులను అమలు చేసింది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు త్రాగునీరు అందించేందుకు చేపట్టిన పథకం మిషన్ భగీరథ .దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పథకం మిషన్ భగీరథను ఆయనే ప్రారంభించి పూర్తి చేసారు.
మిషన్ కాకతీయ రాష్ట్రంలోని చెరువులు, నీటి నిల్వలను పునరుద్ధరించడానికి చేపట్టిన ప్రాజెక్ట్.
ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిన ఘనుడు
చంద్రశేఖర రావు గారు.
రైతు బంధు ద్వారా రైతులకు వ్యవసాయ భూమికి నేరుగా నగదు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రయోజనం కలిగించాడు ఆయన.
రైతు భీమా పధకం ద్వారా రైతు మరణించిన పక్షంలో అతని కుటుంబానికి 5 లక్షల రూపాయల భీమా ఇవ్వడం జరుగుతుంది.
హరిత హారం పధకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున వృక్షారోపణ కార్యక్రమాలు చేసారు.
2018లో అసెంబ్లీని ముందుగానే రద్దు చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి ఘన విజయం సాధించింది. కే.సి.ఆర్. రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా సాగింది.
2022లో టీఆర్ఎస్‌ను భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఆయన లక్ష్యం దేశ రాజకీయాల్లో మూడవ ప్రత్యామ్నాయంగా ఎదగడం. దేశవ్యాప్తంగా రైతుల సమస్యలపై దృష్టిసారిస్తూ, కొత్త రాజకీయ దిశలో అడుగులు వేసారు.
మొన్నటి ఎలక్షన్లలో ఓడిపోయినా ప్రతిపక్ష
నేత హోదాలో ప్రజల పక్షాన పోరాడుతూ
ఉన్నారు.ఒక రాజకీయ నాయకుడిగా కే.సి.ఆర్. పై కొన్ని విమర్శలూ ఉన్నాయి. కుటుంబ పాలన, అహంకార ధోరణి, విపక్షాలపై తీవ్ర విమర్శలు అనే విమర్శలు ఎదురయ్యాయి. ఆయన కుటుంబ సభ్యులు కీలక పదవుల్లో ఉండటాన్ని కొంతమంది వ్యతిరేకించారు. అయినప్పటికీ ఆయనకు నిరుద్యోగ యువత, రైతాంగం, గ్రామీణ ప్రజానీకం నుండి గట్టి మద్దతు లభించింది.
కే.సి.ఆర్.కు తన వ్యాఖ్యలు మరియు బలమైన ప్రసంగ శైలి ప్రత్యేకత. ప్రజలతో మాట్లాడే శైలి, తెలంగాణ సంస్కృతి పట్ల గౌరవం, భాషపై పట్టుదల వంటి లక్షణాలు ఆయనను మిగతా నాయకుల నుండి ప్రత్యేకంగా నిలిపాయి. ఆయన నమ్మే సిద్ధాంతం – “తెలంగాణ కోసం చేయని త్యాగం లేదంటూ” తన జీవితాన్ని ఉద్యమానికే అంకితం చేశారు.
కే.సి.ఆర్. తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు ను తన వారసుడిగా తీర్చిదిద్దుతున్నారు. కేటీఆర్ రాష్ట్ర ఐ.టి, పురపాలక శాఖ మంత్రి గా సేవలందించారు .ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత మాజీ ఎంపీ, మహిళా నాయకురాలిగా కూడా గుర్తింపు పొందారు.
కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి రాష్ట్ర స్థాయిలోనే కాక, దేశ రాజకీయాలలోనూ తనదైన ముద్రవేసిన నాయకుడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన చేసిన త్యాగాలు, ప్రజల పట్ల ఉన్న నిబద్ధత, అభివృద్ధి పథకాలపై చూపిన చొరవ ఆయన నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తాయి. భవిష్యత్తులో భారతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర మరింత ప్రాధాన్యతను పొందే అవకాశం ఉంది.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, ఉద్యమ నాయకత్వం, స్పష్టమైన దృష్టికోణం ఆయనను ప్రత్యేక నాయకునిగా నిలబెట్టాయి.తెలుగు భాషపై ఆయనకు ఉన్న ప్రేమ ఆయన ప్రసంగాల్లో, రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కవిత్వం, పద్య రచనల్లోనూ ఆయన తళుక్కున మెరిసిన సందర్భాలు ఉన్నాయి.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన నడిపిన ఉద్యమం శాంతియుత, ప్రజాప్రతినిధి మార్గాలలో సాగింది. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి అవగాహన కలిగించారు. 2009లో ఆయన చేపట్టిన ఉపవాస దీక్ష దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆయన దీక్షను బట్టి కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేయాల్సి వచ్చింది.2014 జూన్ 2న తెలంగాణ అధికారికంగా భారతదేశం 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఈ ఘట్టంలో ముఖ్యపాత్ర పోషించిన నేతగా కే.సీ.ఆర్ నిలిచారు. తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ పునర్నిర్మాణానికి అడుగులు వేశారు.కేసీఆర్ పాలనకు ప్రత్యేకమైన శైలి ఉడేది. క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగించడంలో ఆయన ముందుంటారు.
తెలంగాణలో అమలుచేసిన పలు ప్రధాన పథకాలు: దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే కాంక్షతో బి.ఆర్.ఎస్ ఏర్పడింది.
ప్రతి ప్రముఖ నేతలలాగే కేసీఆర్ గారిపై కూడా విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ పాలనకు ప్రాధాన్యత, ప్రజాప్రతినిధులతో తక్కువ సంప్రదింపులు, నిధుల వినియోగంలో సమతుల్యత కొరత వంటి విమర్శలు వచ్చాయి. అయితే ఆయన తక్షణ స్పందన, ప్రజల సమస్యలపై ఆయన దృష్టి ఈ విమర్శలను కొంతవరకు తక్కువ చేసింది.కేసీఆర్ గారు గొప్ప ప్రసంగకుడు, భాషపై అవగాహన కలిగిన నాయకుడు. భావోద్వేగాత్మక ప్రసంగాలతో ప్రజల మనసుల్లో చోటు దక్కించుకున్నారు. ఆయనకు విశ్వసనీయ మద్దతుదారులు ఉన్నారు. విజన్, నాయకత్వ నైపుణ్యం ఆయనను అసాధారణ నాయకుడిగా మార్చాయి.తెలంగాణ రాష్ట్ర సృష్టిలో కేసీఆర్ గారి పాత్ర అపూర్వం. కొత్త రాష్ట్రాన్ని నిర్మించడంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చూపిన దిశ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసింది. గ్రామీణాభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు ఆయన పాలనలో గణనీయంగా అభివృద్ధి చెందాయి.

సేకరణ
వెంకట భాను ప్రసాద్ చలసాని