అక్షరలిపిరచయితలు🌾
అంశం- చిత్రకవిత
శీర్షిక- బ్రతుకు పోరాటం.
కవితాసంఖ్య-9
డా.భరద్వాజ రావినూతల
కొత్తపట్నం
🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶
పట్టాల పక్కన బిక్షకుని చెయ్యి,
సమాజాన్ని భిక్షమడుగుతుందోయి..
మన సమాజ సత్యం చాటి.
గాజుపట్టుల్లో జీవనం పయనం,
బయట వేదన — లోపల హర్షం.
చిన్న ముక్క తిండి పంచినా,
ప్రేమ చూపే చూపులే సంతృప్తి గా.
నిశ్శబ్దంగా వేళ్ళాడు ఎదగని మాట,
అతని కళ్లలో ఊహల నాటకం.
కాలపు వాడిలి గాలి ఊదినా,
తన దారి మాత్రం అలానే మిగిలినా.
రెయిలు జిందగీకి మార్గదర్శి,
బిక్షకునికీ ఉండాలి భాగ్యదర్శి.
పట్టాల మీద పోయిన మానవత,
మన గుండెలో మిగలాలి కనికరమత.
ఒక చూపు చాలు, మారే దశ,
ఒక మాట చాలు, వెలిగే ఆశ.
అతని చేతిలో ఎదురు కాచే ఆశ,
మనమే అది తీర్చాల్సిన పాశ.
వెదజల్లే మాటకు కన్నీటి గళం,
మనసుకు తెలియాలి నిజమైన బలం.
🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶
ఇది నా స్వీయరచన
-డా.భరద్వాజ రావినూతల
కొత్తపట్నం
