ఈ రోజు అంశం
చిత్ర కవిత్వం
శీర్షిక
విద్యా సంపద
చదువు,సంస్కారం
పిల్లలకెంతో అవసరం.
అవి నేర్పించే గురువు
సమాజానికి అవసరం.
విద్యతో పాటే ఆటలు
ఆడటం ఎంతో అవసరం.
ఆరోగ్యంగా ఉండాలంటే
వ్యాయామం అవసరం.
నేటి బాలలే రేపటి పౌరులని అంటారు.
రేపటి పౌరులు మన
దేశానికెంతో అవసరం.
మంచి నడవడిక మన
సమాజానికి అవసరం.
అక్షరాస్యత పెంచాలి.
ఆరోగ్యాన్ని కాపాడాలి.
దేశ నిర్మాణం చెయ్యాలి.
దేశం అభివృద్ధి చెందాలి.
మంచిని మేల్కొలపాలి.
మంచి కాలం రానుంది.
అక్షరాస్యతను పెంచాలి.
పేదరికం నిర్మూలించాలి.
అవినీతిని పారద్రోలాలి.
మంచిని పెంచుతుండాలి.
క్రీడా పతకాల వేటలో
ప్రపంచం పరిగెడుతోంది.
మన భారత దేశం కూడా పతకాలన్నీ సాధించాలి.
యువత మేల్కొనాలి.
జాతి గౌరవం నిలపాలి.
దేశభక్తిని పెంపొందించే
కార్యక్రమాలు చెయ్యాలి.
బాలల మనసుల్లో మనం
దేశ భక్తిని బాగా నింపాలి.
అప్పుడే దేశానికి మేలు.
ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని