ఈ రోజు అంశం
చిత్ర కవిత్వం
శీర్షిక
పిల్లల సంరక్షణ
పిల్లలు దేవుని
ప్రతిరూపాలు.
వారి సంరక్షణ
పెద్దల బాధ్యత.
అమ్మ ఒడిలో
ఒదిగిపోతారు.
తండ్రి ఆప్యాయతకు
వారు మురిసిపోతారు.
ఇంటికి దీపం తల్లి ఐతే,
ఆమె కంటికి వెలుగే బిడ్డ.
చిన్న పిల్లలు ఉన్న ఇల్లే
ఇలలో స్వర్గంగా భాసిల్లు.
ఆ బిడ్డకు దివి నుండి
భువికి సుస్వాగతం
చెప్పేది తల్లిదండ్రులే.
మంచి బిడ్డ జన్మించాలంటే
తండ్రి మంచి అలవాట్లను
తప్పక కలిగి ఉండాలి.
వ్యసనాలకు బానిసైతే బిడ్డ ఆరోగ్యంగా పుట్టడు.
ఆ నిజాన్ని గ్రహించాలి.
ఆరోగ్యంగా జీవించాలి.
నేటి బాలలే రేపటి పౌరులని అంటారు. బాలలను చక్కగా
పెంచి పోషించాలి.
చక్కగా విద్యాబుద్ధులు
అన్నీ కూడా చెప్పించాలి.
కంటికి రెప్పలా కాపాడాలి.
వారి భవితకు పునాది
మంచిగా ఏర్పరచాలి.
చిన్న పిల్లలు ఉన్న ఇల్లే
ఆనందాలకు పుట్టిల్లు.
వారి నవ్వులే ఆనందానికి
హరివిల్లు అవుతాయి.
తల్లిని దైవంగా కొలిచేలా
చిన్న పిల్లలను పెంచాలి.
సమాజానికి మేలు చేసేలా
వారికి తర్ఫీదు ఇవ్వాలి.
దేశభక్తి అనేది పిల్లలకు ఉగ్గుపాలతో అందించాలి.
తల్లితండ్రుల సంరక్షణలో
పిల్లలు బాగా ఎదగాలి.
దేశానికి ఆ పిల్లలు తలమానికంగా నిలవాలి.
ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని
నేటి అంశం
యుద్ధం శరణం గచ్ఛామి.
శీర్షిక
తప్పదు సమరం.
తప్పదిక సమరం.
శతృవుకి బుద్ధి చెప్పాలంటే యుద్ధం చెయ్యాల్సిందే.
శాంతి వచనాలు ఇక
పని చెయ్యవు సోదరా.
మనపై అక్రమ దాడులు చేస్తోంది మన శతృదేశం.
శతృవుకి గుణపాఠం చెప్పే
రోజు ఇప్పుడిక వచ్చేసింది.
భయ పడకు నేస్తమా. ముందడుగు వేసెయ్యి.
దేశ మాత రక్షణకోసం
యుద్ధం చెయ్యాల్సిందే.
మీనమేషాలు లెక్కించకు.
శతృ దేశానికి గట్టిగా
గుణపాఠం చెప్పాల్సిందే.
కులమతాలకు అతీతంగా
కలిసికట్టుగా పోరాడుదాం.
ఐక్యతతో మన దేశ మాత
రక్షణ కొరకు పోరాడుదాం.
మన దేశభక్తిని చాటుదాం.
రణభేరి మ్రోగించి మన శతృవు పీచమణచుదాం.
ఉగ్ర మూకలను మనం
సమూలంగా తొలగిద్దాం.
ప్రపంచం అబ్బురపడేలా
దేశగౌరవాన్ని కాపాడేద్దాం.
భారతీయులం మనం
ఒక్కటేనని చాటేద్దాం.
యుద్దానికి సై అంటున్న
శతృవుని ఓడించేద్దాం.
భారత మాతకు జయం
అని గట్టిగా నినదిద్దాం.
ఈ రచన నా స్వీయ రచన
వెంకట భాను ప్రసాద్ చలసాని
ఈ రోజు అంశం
చిత్ర కవిత్వం
శీర్షిక
విద్యా సంపద
చదువు,సంస్కారం
పిల్లలకెంతో అవసరం.
అవి నేర్పించే గురువు
సమాజానికి అవసరం.
విద్యతో పాటే ఆటలు
ఆడటం ఎంతో అవసరం.
ఆరోగ్యంగా ఉండాలంటే
వ్యాయామం అవసరం.
నేటి బాలలే రేపటి పౌరులని అంటారు.
రేపటి పౌరులు మన
దేశానికెంతో అవసరం.
మంచి నడవడిక మన
సమాజానికి అవసరం.
అక్షరాస్యత పెంచాలి.
ఆరోగ్యాన్ని కాపాడాలి.
దేశ నిర్మాణం చెయ్యాలి.
దేశం అభివృద్ధి చెందాలి.
మంచిని మేల్కొలపాలి.
మంచి కాలం రానుంది.
అక్షరాస్యతను పెంచాలి.
పేదరికం నిర్మూలించాలి.
అవినీతిని పారద్రోలాలి.
మంచిని పెంచుతుండాలి.
క్రీడా పతకాల వేటలో
ప్రపంచం పరిగెడుతోంది.
మన భారత దేశం కూడా పతకాలన్నీ సాధించాలి.
యువత మేల్కొనాలి.
జాతి గౌరవం నిలపాలి.
దేశభక్తిని పెంపొందించే
కార్యక్రమాలు చెయ్యాలి.
బాలల మనసుల్లో మనం
దేశ భక్తిని బాగా నింపాలి.
అప్పుడే దేశానికి మేలు.
ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని