*అక్షరలిపి దీపావళి పోటీ కథలు కొరకు*
*అంశం :- ఐచ్చికం*
*తేది:- 28/10/2024*
*శీర్షిక :- నిజమైన దీపావళి..*
అనగనగా ఒక ఊరిలో టపాసులు దుకణంతో తన జీవితం గడుపుతున్నాడు. అతనికి ఎన్నో సమస్యల నుంచి పిల్లలు లేరు. ఆ దుకాణానికి కొంత దూరంలో టపాసులు తయారు చేసే ఒక ఫ్యాక్టరీ ఉంది.
ఆ ఫ్యాక్టరీ దాటితే కొన్ని గుడిసెలు కనిపిస్తాయి అక్కడ వాళ్ళు ఈ ఫ్యాక్టరీలో పని చేస్తారు.
పిల్లలతో సహా అందరూ ఆ ఫ్యాక్టరీలో పని చేస్తారు.
అక్కడ ఉన్న పిల్లలకి చదువుకోవాలనున్న ఆ ఫ్యాక్టరీ యజమాని మాత్రం ఒప్పుకోలేదు.
ఆరోజు దీపావళి ముందు రోజే కొంతమంది టపాసులు కొనుక్కొని వెళ్లారు. ఆ వాడలో ఉన్న పిల్లలందరికీ టపాసులు పేల్చి దీపావళి చేసుకోవాలని కోరికగా ఉంది కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఫ్యాక్టరీకి సెలవు కూడా ఇవ్వడు ఆ యజమాని.
దుకణంలో టపాసులు అయిపోయే అని ఆ ఫ్యాక్టరీ కి వచ్చి తీసుకెళ్తూ ఉండేవాడు దీపక్.
ఆరోజు దీపావళి పిల్లలందరూ సాయంత్రం మిగతా పిల్లలు టపాసులు పేలుస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు.
అదే సమయంలో ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయ్యి మంటలు చెలరేగుతాయి.
లోపల ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఆ మంటల్లో కాలి చనిపోతారు.
అది తెలియక పిల్లలు ఇంటి దగ్గర తల్లిదండ్రుల గురించి ఎదురు చూస్తూ ఉంటే...
బాపు బొమ్మ లాగా ఉన్న ఒక అమ్మాయి వచ్చి వాళ్ళని ఒక దగ్గరికి తీసుకొని వెళుతుంది.
దీపక్ భార్యకి లక్ష్మీదేవి అంటే మహాభక్తి. ఎప్పుడు పూజిస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడు దాకా తనకి సంతానం లేదు.
వాళ్ళింటికి తీసుకొని వెళ్లి పిల్లలందరికీ భోజనాలు పెట్టించి దగ్గరుండి టపాసులు పేలుస్తూ ఉండగా...
దీపక్ భార్య అయిన అర్చనకి చెప్పకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది.
తర్వాత అమ్మాయి కోసం వీధులు తిరిగిన కూడా దొరకదు.
అప్పుడే అర్చనకి ఆ పిల్లల్ని తన పిల్లలుగా పెంచుకోవాలి అని నిర్ణయం తీసుకుంది.
పాపం పసిపిల్లలు అభం శుభం తెలీదు. తల్లితండ్రులతో పని చేశారు ఆ తల్లితండ్రులు ఇప్పుడు భూమ్మీదే లేరని తెలిస్తే ఆ పిల్లలు ఏమైపోతారో అని చాలా బాధపడ్డాడు దీపక్.
ఆ మాట అర్చనకి చెప్పుకుండా తన మాటకి ఒప్పుకున్నాడు.
మరసటి రోజు ఆ పిల్లలందరిని దత్తత తీసుకొని కన్న బిడ్డల కంటే ఎక్కువ చూసుకోవడం మొదలుపెట్టారు.
ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నిజమైన దీపావళి వెల్లి విరుస్తుంది..
*మాధవి కాళ్ల..*
*హామీ పత్రం :-*
*ఈ కథ నా సొంతమని హామీ ఇస్తున్నాను..*