ఈ రోజు అంశం
చిత్ర కవిత్వం
శీర్షిక
చిరునవ్వుతో బ్రతికేద్దాం.
చిరునవ్వుతో బ్రతికేద్దాం.
కష్టాలెన్నో ఎదురైనా.
కన్నీరే ఉబికి వచ్చినా.
ధైర్యాన్ని కోల్పోయినా.
చిరునవ్వుతో బ్రతికేద్దాం.
ఆ చిరునవ్వే నీలోని ఆత్మవిశ్వాసం పెంచేను.
ఆ చిరునవ్వే నీలోని
పిరికితనం పోగొట్టేను.
నువ్వు ఏడిస్తే ఓదార్చే
వారు ఎందరో ఉంటారు.
నీకు ఇప్పుడు ఓదార్పు కాదు. ధైర్యం కావాలి.
ఆ ధైర్యం నూరిపోసే
మితృలు కావాలి.
ధైర్యానికి ధైర్యం
తోడైతే విజయం
నీకే సొంతమగును.
కన్నీరు పెట్టుకుంటే
లాభమేమీ లేదోయి.
చిరునవ్వునే నీ చుట్టం
అనుకో ఓ సోదరా.
నీ శతృవులను ఎదుర్కొనే
ధైర్యం అది నీకు ఇస్తుంది.
ప్రపంచాన్ని జయించే శక్తి
మీ చిరునవ్వుకే ఉందండీ.
చిరునవ్వు నవ్వేందుకు
వయసుతో పనేముంది.
చిరునవ్వు నవ్వి చూడు.
ప్రపంచం నిన్ను మెచ్చేను.
ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని
చిత్ర కధ
నాన్న ప్రేమ ఆకాశమంత
కృష్ణా జిల్లాలో ఉన్న చిన్న గ్రామం కూచిపూడి. కూచిపూడిలో నివసించే భానుకి అనే చిన్న కుర్రాడికి తన నాన్న రామకృష్ణ మీద చాలా ప్రేమ ఉండేది. కానీ ఆ ప్రేమను తన మనసులోనే దాచుకున్నాడు. బయటకు ప్రకటించలేదు.
రామకృష్ణ ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచరుగా పనిచేసేవాడు. మధ్యతరగతి కుటుంబం
కావటంతో ఎన్నో కష్టాలు అనుభవించాడు. పొద్దున్నే ఐదుగంటలకు లేచి ఆ తర్వాత తన కుమారుడు భానుని లేపి వ్యాహ్యాళికి తీసుకుని వెళ్ళేవాడు. అలా వెళుతూ వారిరువురూ చక్కగా అన్ని విషయాల గురించి మాట్లాడుకునే వారు.
రామకృష్ణ గారికి ప్రకృతిలో విహరిస్తూ ఉండటం
చాలా ఇష్టం.భానుకి మాత్రం అలా వెళ్ళటం ఇష్టం లేదు. చిన్నతనంలోనే తన నాన్నని అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకు నాన్న నన్నిలా
తిప్పుతున్నాడు అని మనసులో అనుకుంటూ ఉండేవాడు. అలా బయటకు వెళ్ళి వచ్చాక
భానుని ఒక గంట సేపు కూర్చోపెట్టి చదివించే
వారు రామకృష్ణ గారు. దాంతో ప్రతీసారీ క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడు భాను. అందరూ అతన్ని మెచ్చుకునేవారు . రామ కృష్ణగారు మాత్రం
తన కుమారుడితో "ఫస్ట్ వచ్చావు కదా, ఇంకా చదువు. ఇది చాలదు” అనేవారు. భానుకి చాలా బాధగా అనిపించేది. "తన తండ్రి ఒక్కసారి నన్ను పొగిడితే ఎంత బావుణ్ణు " అని మనసులో అనుకునేవాడు. అలా సంవత్సరాలు గడిచాయి. భాను గ్రాడ్యుయేట్ అయ్యాడు. తర్వాత సిటీకి వెళ్లాడు. అక్కడ అతనికి మంచి ఉద్యోగం వచ్చింది. జీవితం బిజీ అయ్యింది. నెలలో ఒకసారి మాత్రం తన తండ్రి దగ్గరకు వచ్చేవాడు. రామకృష్ణ గారు గ్రామం విడిచి తన కొడుకు వద్దకు వెళ్ళటానికి సిద్ధంగా లేరు. అయితే తన కొడుకుని చూసినప్పుడు ఆయన మొహంపై గర్వం కనపడుతుండేది. కానీ ఎప్పుడూ కొడుకును
పొగిడే వాడు కాదు. భానుకి తన తండ్రిని అడగాలనిపించింది కానీ మొహమాట పడి
అడిగేవాడు కాదు. ఒక రోజు నాన్న బయటకు
వెళ్ళిన సమయంలో ఆయన గదిలోకి వెళ్లి
ఆయన అల్మారా తెరిచిన భానుకి అందులో చిన్న డైరీ కనిపించింది. అందులో అన్నీ భాను గురించే ఉంది " భాను క్లాస్లో ఫస్ట్ వచ్చాడు. నాకెంతో గర్వంగా ఉంది. కానీ వాడికి చెప్పలేదు.
వాడెంతో గొప్పవాడవుతాడు.” అని వ్రాసారు రామకృష్ణ గారు. అలా నాన్న డైరీ చదువుతూ ఉన్న భానుకి కళ్ళ వెంబడి కన్నీరు వచ్చింది" అందులో ఇంకా ఇలా ఉంది“ఇవాళ భాను ఇంటర్వ్యూ కి బయలుదేరాడు. నాకు మంచి
పేరు తెస్తాడు. వాడికి తప్పకుండా మంచి
ఉద్యోగం వస్తుంది అని నా నమ్మకం.“ అలాగే ఇంకొక పేజీలో " నిన్న రాత్రి భాను ఏమీ తినకుండా నిద్రపోయాడు . ఉదయాన్నే
నేనే స్వయంగా వాడికి తినిపించాలి "అని
వ్రాసుకున్నారు రామకృష్ణ గారు.
ఆ డైరీ చదివిన రమేశ్ కళ్ళలో కన్నీళ్లు వరదలా
పొంగింది. తన తండ్రి తన పట్ల ప్రేమను
మనసులో దాచుకున్నాడని గుర్తించాడు.
తర్వాత రోజు నాన్నకు దగ్గరగా వెళ్లాడు. తొలిసారిగా ఆయన్ని కౌగిలించుకుని అన్నాడు:“నాన్నా, నాకు ఇప్పుడు మీ ప్రేమ అర్థమవుతోంది. మీ మౌనం వెనుక ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది.”రామకృష్ణ ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాడు. కానీ తర్వాత ఆయన చేతులు తన కొడుకు భాను భుజాలపై వేసి“ఇప్పుడే నా కొడుకు పెద్దవాడయ్యాడు అనిపిస్తోంది" అని అన్నాడు. ఆ కళ్ళలో భానుకి ఆనందభాష్పాలు
కనిపించాయి. తండ్రుల ప్రేమ మాతృ ప్రేమలాగ
బయటకు కనిపించదు. కానీ వారి మనసులో ఎంతో ప్రేమ ఉంటుంది.భాను తన నాన్న రామకృష్ణ గారికి తన పట్ల ఉన్న ప్రేమను అర్థం చేసుకున్న రోజు అతని జీవితంలో గొప్ప
ఆనందం కలిగింది. అయితే నాన్న ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా ఉంటారో అనే ఆలోచన అతన్ని
బాధ పెట్టింది . భాను తల్లి చాలాకాలం క్రితమే
మరణించారు. అప్పటి నుండి రామకృష్ణ ఒక్కడే
ఆ గ్రామంలో ఉంటున్నాడు. ఆయన తన ఊరు
వదిలి ఎక్కడికీ వెళ్ళదలుచుకోలేదు. కొంతకాలం
తర్వాత రామకృష్ణ ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది.వయసు మీద పడుతుంటే చిన్నచిన్న అనారోగ్య సమస్యలు మామూలే కదా. కానీ రామకృష్ణ తన కుమారుడితో ఎప్పటిలాగే “ఏం లేదు, ఆరోగ్యంగా ఉన్నాను” అన్నట్టే మాట్లాడేవాడు.ఒకసారి రాత్రి భానుకి కబురు వచ్చింది.“నాన్న గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరారు.”
వెంటనే గ్రామానికి బయలుదేరి వెళ్లాడు.
తన తండ్రిని ఆసుపత్రిలో చేర్చాడు.
తండ్రి ఆసుపత్రి పడకపై ఉన్న ఆయన ముఖంలో భానుకి ఒక ఆందోళన కనిపించింది. వెంటనే భాను అయన చెయ్యి పట్టుకున్నాడు.
“నాన్నా, మీకేం కాదు . నేనెప్పుడూ మీతోనే ఉంటాను” అని అన్నాడు.
రామకృష్ణ చిరునవ్వు నవ్వాడు.
రెండు రోజుల్లో ఆయన కోలుకున్నారు. డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి వచ్చిన తరువాత
భాను ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు.
"ఈ వయసులో నాన్న ఒంటరిగా ఉండడం నచ్చలేదు. ఇప్పుడు నా బాధ్యత ఆయనతో గడపడం. అదే ఆయనకు సంతోషాన్ని కలిగిస్తుంది" అని మనసులో అనుకున్నాడు.
జీతం తక్కువ అయినా సరే తన గ్రామానికి
దగ్గరగా ఉన్న ఊరిలో ఉద్యోగం సంపాదించి
ప్రతిరోజూ గ్రామం నుంచి ఆ పట్టణానికి
వెళ్ళి ఉద్యోగం చేసి తిరిగి సాయంత్రం తన గ్రామానికి వచ్చేసేవాడు. ప్రతి ఉదయం తన చిన్నతనంలో చేసినట్లు తండ్రిని తీసుకుని వ్యాహ్యాళికి వెళ్ళేవాడు. తండ్రితో ఎక్కువ సమయం గడిపేవాడు. ఉదయం నిద్రలేవగానే ఇద్దరూ కలిసి కాఫీ తాగడం. అలా వెళ్ళి చెరువు వద్ద కూర్చుని పాత సంగతులు మాట్లాడుతూ ఉండేవారు.ఒకరోజు భాను తన తండ్రితో మాట్లాడుతూ "నాన్నా, నేను చిన్నప్పుడు మీ ప్రేమను గుర్తించలేకపోయాను. మీ నిశ్శబ్దంలోనే నా ప్రపంచం ఉంది అని తెలిసినపుడు నేనెంతో
సంతోషించాను.”
రామకృష్ణ కళ్ళల్లో ఆనందం కనిపించింది
ఆయన భానుతో “నువ్వు గమనించకపోయినా సరే, నేను మాత్రం ప్రతి రోజు నిన్ను ప్రేమించాను. నాన్నల ప్రేమ బయటకు కనిపించదు బాబూ.
అది నివురు కప్పిన నిప్పులా ఉంటుంది" అన్నాడు. ఇద్దరూ ఆనందంగా ఒకరి చేతులు
ఒకరు పట్టుకుని అలా మాట్లాడుకుంటూ
వెళ్ళసాగారు. వారికి నీడగా ఒక మబ్బు
వారితో అలా ముందుకు వెళ్తోంది. తండ్రి
ప్రేమ అనంతం. ఆ విషయం పిల్లలు తప్పక
గ్రహించాలి.
ఈ రచన నా స్వీయ రచన
వెంకట భాను ప్రసాద్ చలసాని
I am working as a teacher from past 25 years. I am google local guide also.
I uploaded many photos in Google. I wrote stories and poems in online magazines. I also work as LIC agent also.