చిత్ర కవిత
రైలు ప్రాంగణం లో బస్సు స్టేషను లో వీధి వీధి లో ఎక్కడ చూసినా
అడుక్కునే వాల్లే!
దయ తలచి దాతలు దానం చేస్తే వారి బ్రతుకు కొన సాగుతుంది లేదా ఫ్లాట్ ఫారం లపై ఆకలి కేకల తో అల్లాడుతూ ఓ మూలన ముడుచు కుంటుంది..
అయ్యా! ధర్మం అమ్మా ధర్మం అని
గావు కేకలు ఆ జనం రద్దీలో దానం చేసే వారు కొందరైతే మాకేంటని తలలు తిప్పుకుని పోయేవారు మరి కొందరు.
బిక్షాటన వారి వృత్తి లేచింది
మెుదలు పడు కునే వరకు యాతన నరక యాతన ఈ రోజు కు ముద్ద దొరుకు తుందో లేదోనని ఆవేదన..
దొరికితే సంతోషం దొరకకపోతే కడుపు కోత ఆకలి మంట నీల్లే ఆహారం..
వయసు పెరిగినా మనిషి కరిగినా ఈ బిక్షాటన తప్పదు!!
-ఉమాదేవి ఎర్రం..
ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా!!
