అమ్జద్ హైదరాబాదీ (అమ్జద్ హుస్సేన్, 1 జనవరి 1888- 31 జనవరి 1961), తెలంగాణకు చెందిన ఉర్దూ, పర్షియన్ రుబాయి కవి. ఉర్దూ కవిత్వంలో అతడిని హకీమ్-అల్-షువారా అని కూడా అంటారు. ఇతని కలంపేరు అమ్జద్ హైదరాబాదీ.
అమ్జద్ హైదరాబాదీ 1888, జనవరి 1న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు దక్కన్లోని ఒక చిన్న కుటుంబంలో జన్మించాడు. హైదరాబాదు నిజాం పాలనకాలంలో 1908, సెప్టెంబరు 28న మూసీ నదికి వరదలు వచ్చాయి. చింతచెట్టు కొమ్మలకు వేలాడుతూ ప్రాణాలు దక్కించుకున్న 150 మందిలో అమ్జద్ ఒకడు. 1908లో మూసీ నది వరదలో తన కుటుంబం (అమ్జద్ తల్లి, భార్య, కుమార్తె) కొట్టుకుపోగా, అతని కుటుంబంలో అతను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. తరువాత తన బాధను అనుభవాన్ని వివరిస్తూ “ఖయామత్-ఎ-సోఘ్రా” (ది మైనర్ డూమ్స్డే) అనే పద్యం రాశాడు. అమ్జద్ రాసిన రుబాయిలో ఎక్కువభాగం అతని కుటుంబాన్ని కోల్పోయిన నిరాశ ప్రతిబింబిస్తుంది. ఆ విషాద సంఘటన 100వ వార్షికోత్సవం జ్ఞాపకార్థంగా, సత్యనారాయణ డానిష్ ఆ పద్యాన్ని చదివాడు.
అమ్జద్ రాసిన కవితలను వివిధ దేశాలలోని జరిగిన ఖవ్వాలీ కార్యక్రమాలలో వార్సీ బ్రదర్స్ కు చెందిన భారతీయ ఖవ్వాలి సంగీత బృందం క్రమం తప్పకుండా పఠించేవారు.
అమ్జద్ హైదరాబాదీ ఉర్దూ పుస్తకాలు
రుబయత్ అమ్జద్ హైదరాబాదీ
అదాబి ఇజ్లాస్ వో ముషేరా
హకీమ్ అల్ షురా అమ్జద్ హైదరాబాదీ
మాస్టర్ పీసేస్ ఆఫ్ ఉర్దూ రుబాయత్ (రచన:కెసి కందా)
1908లో ముసి నది వరదలో తన తల్లి, భార్య మరియు కుమార్తెతో సహా తన మొత్తం కుటుంబం కొట్టుకుపోవడాన్ని అతను చూశాడు. అతని కుటుంబంలో అతను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతని రచనలలో ఎక్కువ భాగం తన కుటుంబం కోల్పోయినందుకు అతని నిరాశను ప్రతిబింబిస్తాయి.
వార్సీ బ్రదర్స్, ఒక భారతీయ ఖవ్వాలీ సంగీత బృందం, వివిధ దేశాలలో అతని పద్యాలను క్రమం తప్పకుండా పాడేవారు.
స్థానికుల విజ్ఞప్తి మేరకు, GHMC, మహాకవికి నివాళిగా, ఈ ప్రాంతానికి
అమ్జాద్ రోడ్డు అని పేరు పెట్టింది. డబీర్పురా దర్వాజా సమీపంలో ఉర్దూ, తెలుగు మరియు ఇంగ్లీష్ అనే మూడు భాషలలో “అమ్జాద్ రోడ్డు” అనే పేరు చెక్కబడిన సిమెంట్ ఫలకాన్ని ఏర్పాటు చేశారు.
ఫిర్యాదు అందుకున్న తర్వాత, డబీర్పురా పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు.
ఇతడు 1961, జనవరి 31న హైదరాబాదులో మరణించాడు.
మాధవి కాళ్ల
సేకరణ