కాండూరు నరసింహాచార్యులు (1900, జూన్ 15 – 1972, జనవరి 24) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత, ఆయుర్వేద వైద్యుడు.
కాండూరు నరసింహాచార్యులు 1900, జూన్ 15న తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా లోని, వనపర్తిలో తిరువేంగడమ్మ, రామవాచార్యుల దంపతులకు జన్మించాడు. దురదృష్టవశాత్తు, తన ఆరేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. తండ్రి మరణంతో కుటుంబం పేదరికంలోకి నెట్టబడింది. తల్లి భిక్షాటన చేస్తూ ఇద్దరు కుమారులను పోషించింది. పెద్ద కుమారుడికి విద్య అబ్బలేదు, కానీ తల్లి నరసింహాచార్యులను విద్యావంతుడిని చేయాలని నిశ్చయించుకుంది. నరసింహాచార్యులు కూడా విద్యపై మక్కువతో 1915 నుండి 1928 వరకు ప్రొద్దుటూరు, మద్రాసు, మైసూరు, బెంగళూరులోని కళాశాలల్లో సంస్కృతం, ఆంధ్ర భాషలను అభ్యసించాడు.
నరసింహాచార్యులు 1926 నుండి 1955 వరకు కడప జిల్లా, జమ్మలమడుగు పి.ఆర్. బోర్డు హైస్కూలులో ప్రధానాంధ్ర పండితులుగా పనిచేశాడు.
నరసింహాచార్యులు అనేక గ్రంథాలు రచించాడు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:
ఇడ్లి మహా ప్రబంధము: ఇది వారి ముఖ్య రచనలలో ఒకటి.
హర్షుడు – భీష్ముడు: ఈ రెండు రచనలు విద్యార్థులకు ఉపవాచకాలుగా ఉండేవి.
రంగనాథ శతకము
కావ్య ప్రకాశ వివరణము
సాహిత్య విచార చంద్రిక
సందేశము
చంద్రా పీరుడు
కలభాషిణీ చరిత్ర
ప్రారంభ వ్యాకరణము
మహాశ్వేత-పరివర్తనము: ఇది అముద్రిత నవల.
నరసింహాచార్యులు తన 72 ఏళ్ల వయసులో 1972, జనవరి 24న జమ్మలమడుగులో మరణించారు.
మాధవి కాళ్ల
సేకరణ