కాశీయాత్ర ( ఐదవ రోజు )
తేది 24-2-2025 సోమవారం
ఉదయమే గంగా స్నానము చేసి, బోట్లలో పయణించి 64 ఘాట్లు తిరిగి చూశాము.బోటు నడిపే పిల్లలు ఇద్దరికి 20 సం.రాల లోపే వయసుంటుంది.ఘాట్ల పేర్లు ఒక్కొక్కటిగా తెలుపుతూ,వాటిని ఎవరు కట్టించారో వివరించి చెప్పారు. విశ్వనాథుని వైభవమంతా చూస్తుండగా, అక్కడ జరుగుతున్న శవదహనాల దృశ్యాలు వైరాగ్య భావాన్ని కలిగించాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఈరోజు కూడా దర్శనానికి వెళ్ళకుండా గంగ ఒడ్డున ఘాట్ల వద్ద ఉన్న నాగసాధువుల ఆశీర్వాదాలు తీసుకుంటూ బసకు వచ్చాము.గదిలో బెడ్ మీద ఉన్న గోవిందమ్మ కు తోడుగా ఆమె భర్త నాగేశ్వరరావు గారు ఉన్నారు
-కోట పెంటయ్య