జంధ్యాల(తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత)

జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (జనవరి 14, 1951 – జూన్ 19,2001 ) తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలుపేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందె వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం – నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం.

జంధ్యాల 1951 జనవరి 14 న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించాడు. బి.కామ్ వరకు చదువుకున్నాడు. చిన్నతనం నుండి నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవాడు. స్వయంగా నాటకాలు రచించాడు. ఆయన రాసిన నాటకాల్లో ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును ప్రముఖమైనవి. ఆయన నాటకాలు అనేక బహుమతులు అందుకున్నాయి.

1974లో జంధ్యాల సినిమా రంగ ప్రవేశం చేసాడు. శంకరాభరణం, సాగరసంగమం, అడవిరాముడు, వేటగాడు వంటి అనేక విజయవంతమైన సినిమాలకు మాటలు రాశాడు. ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా మారి, శ్రీవారికి ప్రేమలేఖ వంటి చిరస్మరణీయ చిత్రాన్ని సృజించాడు.

జంధ్యాల 2001 జూన్ 19 న హైదరాబాదులో గుండె పోటుతో మరణించాడు. ఆయనకు ఇద్దరు కూతుర్లు. వారి పేర్లు సాహితి, సంపద.

1976 లో దేవుడు చేసిన బొమ్మలు చిత్రం ద్వారా మాటల రచయితగా తన సినిమా జీవితం మొదలుపెట్టాడు. ఐదేళ్ళలో సుమారు 85 సినిమాలకు రచయితగా పనిచేయగా అందులో 80 శాతం సినిమాలు ఘనవిజయం సాధించడంతో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నాడు. తరువాతి కాలంలో దర్శకుడిగా అవతారమెత్తి, అనేక హాస్యచిత్రాలను రూపొందించాడు. ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల పేరుగాంచాడు. హాస్యబ్రహ్మ అని పేరుపొందాడు.

ఇంటిపేరుతోటే ప్రసిద్ధుడైన జంధ్యాలను మీ అసలు పేరు ఏమిటి అని అడిగితే ఆయన ఇలా అనేవాడు: “నేను రామానాయుడి గారి సినిమాకు పనిచేసేటపుడు నాపేరు జంధ్యాల రామానాయుడు, విశ్వనాథ్ గారి సినిమాకు పనిచేసేటపుడు నా పేరు జంధ్యాల విశ్వనాథ్…” అలా అనేవాడు తప్ప, తన అసలుపేరు ఎక్కడా చెప్పుకోలేదు. జంధ్యాల అసలు పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి.
హాస్యం గురించి ఆయన ఇలా అనేవాడు: “నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం”

జంధ్యాలకు లభించిన కొన్ని అవార్డులు:

  • 1983, “ఆనంద భైరవి” చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం దర్శకుడు జాతీయ అవార్డు
  • 1983, “ఆనంద భైరవి” చిత్రానికి ఉత్తమ దర్శకుడు నంది అవార్డు
  • 1987, “పడమటి సంధ్యారాగం” చిత్రానికి ఉత్తమ కథారచయిత అవార్డు
  • 1992, “ఆపద్బాంధవుడు” చిత్రానికి ఉత్తమ మాటల రచయిత అవార్డు

జంధ్యాల తన సినిమాల ద్వారా అనేకమంది నటులను సినిమా రంగానికి పరిచయం చేసాడు. వారిలో కొందరు:

బ్రహ్మానందం
నరేష్
ప్రదీప్
సుత్తి వీరభద్రరావు
సుత్తివేలు

వివాహ భోజనంబు చిత్రం నుంచి…

మట్టి పూసుకొని ఉన్నపుడు బ్రహ్మానందం సంభాషణ– (ఏడుపు గొంతుతో) ఈ చెమ్మంతా ఇగిరేలోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభో. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూ వాళ్ళు చూస్తే, వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళి పోతారు. జనమెవరయినా చూస్తే, ఇతర గ్రహాలనుండి వచ్చారనుకొని రాళ్ళుచ్చుక్కొడతారు… (ఆశగా ) ఇంక ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభో.

వేటగాడు చిత్రం నుంచి…

రావు గోపాలరావు, సత్యనారాయణతో -రాజా ప్రియురాలు రోజా మేజా బల్ల మీదికెక్కి కాజాలు తింటూ నీ వీపు మీద బాజాలు బాదుతోంటే నువ్వేంచేస్తున్నావురా కూజా” అన్నప్పుడు సత్యనారాయణ చిన్నబుచ్చుకున్న కోపంతో రావుగోపాలరావు ప్రాసల బలం ఎంతుందో చూపమంటాడు. అప్పుడు రావుగోపాలరావు – ” రాజుగారి పెద్ద కొడుకు బెస్టుగా ఫస్టు క్లాసులో పాసయ్యాడని, బావుండదని గెస్టుగా ఫీస్టుకి పిలిచి, హోస్టుగా నేనుండి సపర్యలు చేస్తోంటే, సుస్టుగా భోంచేసి, పొద్దున్నే లేచి మన పేస్టుతోనే పళ్లు తోంకుని, ఉడాయించాడు భ్రస్టు వెధవ” అన్నప్పుడు ఇదంతా విని రొప్పుతున్న సత్యనారాయణని చూసి – ” ఇంకా విసరమంటావా నా మాటల తూటాలు” అంటాడు.

రచయితగా…

డ్రైవర్ రాముడు (1979)
అల్లుడు పట్టిన భరతం (1980) (సంభాషణల రచయిత)
నారీ నారీ నడుమ మురారి
అడవి రాముడు
వేటగాడు (1979)

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *