జీవిత పోరాటంలో మనిషి మనుగడకు సాహిత్యం మార్గదర్శనం చేస్తుంది. కొంత సన్మార్గంలో సూచించే సాహిత్యమైతే, చాలావరకు పెడతోవ పట్టించే ద్వంద్వార్థ పూరిత విషతుల్య సాహిత్యం నేటి సినిమాల్లో రాజ్యమేలుతోంది. నైతిక విలువలు కోల్పోయిన సాహిత్యం కుహనా పండితులు లిఖిస్తున్నారు.సమాజంలో హానికరమైన విషబీజాలు నాటుతున్నారు.అందుకే జీవితం లోలోతుల వరకు స్పృశించే సుందరమైన జాగృత సాహిత్యం రావాలి. ప్రతి పదం కదం తొక్కుతూ జీవన లయలను గళమెత్తి పడాలి.
అపరాజిత్
సూర్యాపేట