సమాజానికి పట్టిన చెదపురుగులు సైబర్ నేరగాళ్లు,,,,,,,!
ముఖం అగుపడకుండా డార్క్ ముసుగులో
వీడసలు మనిషేనా ?
సైబర్ నేరగాళ్ల దుర్యోధన దుశ్శాసన దృతరాష్ట్ర పర్వం,,,,,,,
ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగాలు రాక, చేతిలో రూపాయి లేక అనుకోకుండా ఈ మేధావులు ఎంచుకున్న రంగం సైబర్ నేరవ్యవస్థ చీకటి సామ్రాజ్యం,,,,,,,,
ఈ నేరగాళ్లు రోజువారి టార్గెట్ లో భాగంగా సామాన్యుల నుండి ధనవంతులు,విద్యావంతులు దాకా వాళ్ళ మొబైల్ లేదా బ్యాంకు ఎకౌంట్ నంబర్లను హ్యాక్ చేసి డబ్బులు కాజేయడమే,,,,,,,,
వీటి కోసం పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని సైబర్ దార్శనికుల్ని రకరకాల పట్టణాలు, సిటీలలో ఎంపిక చేసుకుని చీకటి వ్యాపారం నడిపించే అత్యంత కీచక వ్యవస్థ,,,,,,,,
ఇవి ఈరోజుల్లో కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి, ఒకరికొకరి ముఖం తెలియని కూర్చున్న చోటే కుదేలు చేసే మాయాజాలం,,,,,,,,,
వీళ్ళ ఆచూకి తెలుసుకోవడం అత్యంత క్లిష్టమైన పని, మనకు మనమే బ్యాంకు ఎకౌంటు నంబర్ అత్యంత గోప్యంగా ఉంచుకోవాలి,,,,,,
అంతేకాకుండా సెల్ ఫోన్ నంబర్, పాన్ కార్డ్, ఆధార్ నంబర్లు ఎవరుకావాలన్నా ఇవ్వద్దు.దీనివల్ల వీళ్ళ బారినపడే అవకాశం ఉంది. ఈ సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి పోలీసులు, ప్రత్యేకంగా వ్యవస్థ ఉంది. అటువంటిది జరిగిన వెంటనే వీళ్లకు సమాచారం ఇవ్వాలి. లేనిదే రక్షణ కరువు,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట