Month: December 2025

మంచు కురిసే మనస్సు

మంచు కురిసే మనస్సు

మంచు కురిసే మనస్సు చెలీ బయట మంచు కురుస్తోంది చూడు,,,,,,,,మనం పలుకలేని భావాలేవో ఆ మంచు పొగలో అగుపిస్తున్నాయి కదా,,,,,,,,,,ఈ మంచు బిందువులు మానవుల బంధాలు అనుబంధాలు కరిగి నీరయ్యే కనుపాపలు పాడే విషాద గీతాలే కదా,,,,,,,,,,అవును ప్రియా ఈ మంచు పూవులు ,తుషార బిందువులు జీవనయాత్ర పర్యంతం పాడే గుబులు గీతాలు కళ్ళల్లోని అనుభవాల గూళ్ళు చూడలేనివి, వినలేనివి,,,,,,,,,ఆ యవ్వనంలోని సౌందర్యం ధ్రువప్రాంతాల్లో మంచు మనుష్యుల్లా నీరెండలో కరిగిపోతున్న మంచులా జీవితంలోంచి కదలిపోతున్న చీకటి నీడలు ,,,,,,,,,,,,,ఈ తెల్లవారుజామున చలి గాలులలో రాత్రి వేళ మనస్సు తీసిన స్వప్నాల లయలు కలిసిపోతూ పైకెగసిపోతూ నిష్క్రమిస్తున్నాయి,,,,,,,,,ఈ ఉదయం ఓ మనిషన్నవాడిని భావనాతీత దివ్యలోకాల్లోకి తీసుకెళ్లింది ప్రియా,,,,,,,,,ఈ వయస్సులో గతించిన నీలినీడలు నెమరువేస్తూ కాక ,ఊహల ఊయలలో తేలియాడుతూ జీవన సోయగాలలో నవ్య ఉషస్సులు చవిచూడాలి రా,,,,,,,,,,వయస్సుతో పనిలేకుండా మంచి సాహిత్యమున్న గీతాలను వింటూనో ,చదువుతూనో ,రాస్తూనో గడపితే గతించిపోయిన గందరగోళం ఆలోచనలు…
Read More
అగ్నిగోళాల హృదయం

అగ్నిగోళాల హృదయం

అక్షర సమూహంఅంశం ; చిత్రకవితశీర్షిక :అగ్నిగోళాల హృదయం,,,,!రచయిత అపరాజిత్ రెడ్డి ఈ జన్మ ఎత్తినందుకువిధి వక్రించి ఎన్ని అఖాతాలలోకూరుకుపోయి అగ్ని శిఖలలోజీవితం ఎన్ని వక్రగతుల పాలయ్యిందోఆ సూరీడు ఎన్ని మంటల్లో దగ్ధం చేశాడోఎన్ని దివారాత్రులు కళ్ళల్లోనా ప్రతిబింబాన్నే నేను చూసుకునిజనజీవనంలో కలువని ఎకాకినయ్యానోవసంతాలన్నీ గతించుతూకాలం కడలిలో కొట్టుకుపోయానోఉరుములు మెరుపుల జడివానల్లోఓదార్పు లేని కన్నీళ్లు రాని దుఃఖాలోనిషిరాత్రి నీడల్లో దేనికోసమో దేములాడనోమనస్సు పూసిన అక్షరాలు లిఖించనిమూఢ స్వప్నాలలో ముసుగుతన్నానోనికృష్ట మానవుల కళ్ళల్లో తెల్లారానోఅగమ్యగోచరంగా చరించికంటికి మింటికి ఎన్ని అగ్నిధారలయ్యాయోనా సైకత శిల్పాలెన్ని కూలిపోయాయోమనస్సు తన రక్షణ తంత్రులు తెగిపోయినిట్టనిలువునా చీలిపోయానోఅక్షరాల ఎండగాలులు వీచిలిఖించమని కలం కాగితంసుడిగాలుల కెరటాల్లో వచ్చిపడినీ ఎదుట నా అగ్నిపూల జీవితంపుంఖాను పుంఖాలుగా నా విధి తలరాతలు లిఖించమంటోంది నీకోసం,,,,,,!! అపరాజిత్సూర్యాపేటహామీపత్రం ఈ కవిత నా కలం సేత అని నా హామీ
Read More
అద్భుతమైన ఊహగా

అద్భుతమైన ఊహగా

అక్షర కొరకుఅంశం :⁠- చిత్ర కథతేది:⁠- 01/12/2025శీర్షిక:⁠- అద్భుతమైన ఊహగా… ఆరాధ్ చెట్టు కింద కూర్చున్న వ్యక్తి. ఆరాధ్ జీవితం ఎప్పుడూ ఒక పండు వెన్నెల రాత్రిలాగే ఉండేది? చుట్టూ అద్భుతమైన రంగులు, పక్షులు, చెట్లు ఉన్నా, అతడి మనసులో మాత్రం తీరని విరహం ఒక గొప్ప శూన్యం. చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నా, అతడి నీడ మాత్రం ఒంటరిగా, బాధగా కూర్చుని ఉండేది?అతడు దేనికోసం విరహంలో ఉన్నాడు? ఎవరి కోసం ఎదురుచూస్తున్నాడు? అతడు వెతుకుతున్నది, ప్రేమిస్తున్నది దివ్యను.దివ్య కేవలం ఒక మనిషి కాదు. ఆమె అతడి కవిత్వంలో నివసించే ఊహల రాణి, అతడి తపస్సుకి లభించిన అరుదైన వరం. ఆమె రాజ రవివర్మ గీసిన చిత్రంలోని అప్సరసలా, భూమికి ఆకాశానికి మధ్య తేలియాడుతూ ఉంటుంది.ఆరాధ్ ఒకప్పటి గొప్ప శిల్పి. అద్భుతమైన అందాన్ని, భావాన్ని రాళ్లలో చెక్కగలిగే శక్తి అతడి సొంతం.కానీ, ఒక రోజు అతడి గుండె ప్రేమ అనే లోతైన బాధను…
Read More
అక్షర కొరకుచిత్ర కవితరచన – ఉమాదేవి ఎర్రం

అక్షర కొరకుచిత్ర కవితరచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక - ప్రకృతి అందాలు పచ్చదనంతో కూడిన అందాలుపూల వనం లా మెరిసే చందాలుచందమామ ను తలపించే జ్ఞాపకాలుమది ఊసులలో నిదురించే తీపిదనాలు! ఆకాశ గగనాన పిచ్చుకల్లా విహంగినైవిహరించాలని అధ్బుతమైన కోరికలుకోరికలు గుర్రాలలా ప్రయాణిస్తుంటేమనసు ఊహల్లో ఊగిస లాడుతుంది! ఎంత హాయి బ్రతుకో పిచ్చుకలదిఏ బాధలూ ఉండవు దొరికి నపుడేతింటుంది నిద్ర వచ్చినపుడే పడుకుంటుందిరేపటికి దాచుకోవాలని ఆశ లేదు! అందమైన ఆకాశంలో ఆనందపు గంతులేప్రకృతి ఒడి లో సేద తీరే మనసులేమనిషికి ఉన్న స్వార్థం కొంతైనా లేదాజీవులకు ప్రకృతిలో మమేకమైన బ్రతుకులు! చందమామను అందుకుంటున్నాయేమెాననిపించే ఆకాశం లో చూపులుకిల కిలల రావాల తో చెట్టు పైన నివాసంఆకాశం వాటి స్వంతం వృక్షమూ వాటిదే! ఈ అందాలన్నీ చూస్తూ మానవులమనసు ప్రశాంతంగా మారే అధృష్టంప్రకృతి మనకిచ్చింది కదా రోజూప్రకృతిని తలుచుకుని థాంక్స్ చెప్పుకుందాం! ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా!
Read More
ప్రకృతి పరవశం

ప్రకృతి పరవశం

అక్షరకొరకు🌷అంశం- చిత్రకవితతేది1-12-25శీర్షిక- ప్రకృతి పరవశండా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰చెట్టు నీడలో కూర్చున్న నీడలా మనసు ముసురుకొని ఉంది,ఆకాశపు రంగుల్లో తన్నుకొనే నెమలిపింఛం కాంతిలా సాయంత్రం పొగమంచై ఉంది,చంద్రుడి పెద్ద వలయం హృదయాన్ని తాకే మౌన గీతంలా వెలుగుతోంది,గాలిలో ఎగిరే పక్షుల దూర నడకలు జ్ఞాపకాల ఊసులు మోస్తున్నాయి,మనసులో పడిన మబ్బులు మాటల్లో కన్పించకపోయినా బరువెక్కుతున్నాయి,నిశీథంలో కథల్లా పాడే నిశ్శబ్దం పాదాల వద్ద కూర్చుంది,ఎదుట ఉన్న ఆ వెలుగు దారి చూపినా లోపలికేస్తున్న చీకటి ఆలోచనలు,తొలకరి తాకిన హృదయం దూరాల్ని దాటలేక నిలిచిపోయింది,అస్పష్టమైన ఆకాశం కంటెలాగా కన్నీటి అంచుల్ని తాకుతోంది,పక్షుల పయనం మాట్లాడని మనసుల వెన్నంటే నడిచిపోతోంది,ఏకాంతం కొమ్మలా వంగి మనసరి మీద పడుతోంది,వెలుగుల రంగుల్లోనే దాగిన బాధలు గాలిలో పలకరిస్తున్నాయి,చంద్రుని వెలుగు దగ్గరైనా హృదయం మాత్రం దూరంలో మిగిలింది,సాయంత్రపు గులాబీ అంచులు ఆశల్ని నెమ్మదిగా రంగరించాయి,గుండెలో పుట్టిన కదలిక తుఫానా, లేక వీణ స్వరమా అన్నట్టుంది,ప్రకృతి గుండెలోపలే ఏదో మాట చెప్పినట్టు గుసగుసలాడుతోంది,నెమలిపింఛపు రంగులో…
Read More
గీతా జయంతి

గీతా జయంతి

మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి నవంబర్ 30 రాత్రి 9:29కు ప్రారంభమవుతుంది. డిసెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రకారం డిసెంబర్ 1న గీతా జయంతిని జరుపుకోవాలి. గీతా జయంతి రాముడు సీతా వివాహ ధర్మం, గౌరవం, శాశ్వత ప్రేమకు ప్రత్యేకంగా జరుపుకుంటారు. శ్రీమద్ భగవద్గీత జననానికి గీతా జయంతి ప్రతీక. కృష్ణుడిని పూజిస్తారు. గీతా జయంతి చాలా పవిత్రమైన రోజు. ఆ రోజున శ్రీకృష్ణుని ప్రత్యేకించి ఆరాధిస్తారు. భగవద్గీత పారాయణం చేస్తే ఎంతో మంచి జరుగుతుందని చాలామంది నమ్మకం. అలాగే గీతా జయంతి నాడు చేసే దానధర్మాలకు కూడా విశేష ఫలితాలు లభిస్తాయి. ఓం కృష్ణాయ నమః, ఓం శ్రీ కృష్ణ శరణం మమ అనే మంత్రాలను జపిస్తే మంచిది. ఈసారి గీతా జయంతి నాడు శివవాస యోగంతో పాటు అభిజిత్ ముహూర్తం కూడా ఉంది. ఈ యోగాల సమయంలో కృష్ణుడిని ఆరాధిస్తే, కృష్ణుడి అనుగ్రహంతో…
Read More
సరిహద్దు భద్రతా దళ ఏర్పాటు దినోత్సవం

సరిహద్దు భద్రతా దళ ఏర్పాటు దినోత్సవం

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( BSF ) భారతదేశంలో హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక కేంద్ర సాయుధ పోలీసు దళం . ఇది పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌లతో భారతదేశ సరిహద్దులను కాపాడే బాధ్యతను కలిగి ఉంది . ఇది 1965 ఇండో-పాక్ యుద్ధం తర్వాత భారతదేశ సరిహద్దుల భద్రతను మరియు సంబంధిత విషయాల కోసం ఏర్పడింది. 1965లో 25 బెటాలియన్లుగా ఉన్న BSF ఇప్పుడు 193 బెటాలియన్లకు పెరిగింది, దీనిలో 270,000 మంది సిబ్బంది ఉన్నారు, వీరిలో విస్తరిస్తున్న ఎయిర్ వింగ్, వాటర్ వింగ్ , ఆర్టిలరీ రెజిమెంట్ మరియు ప్రత్యేక యూనిట్లు ఉన్నాయి. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు భద్రతా దళం. BSFని భారత భూభాగాల రక్షణ యొక్క మొదటి శ్రేణిగా పిలుస్తారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన తర్వాత , సరిహద్దు భద్రతా దళం (BSF) భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో నిఘా మరియు దాడి సామర్థ్యాలను…
Read More
నాగాలాండ్ దినోత్సవం

నాగాలాండ్ దినోత్సవం

నాగాలాండ్ భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఒక రాష్ట్రం . దీనికి ఉత్తరాన అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమాన అస్సాం , దక్షిణాన మణిపూర్ మరియు తూర్పున మయన్మార్ (బర్మా) లోని సాగింగ్ ప్రాంతంలోని నాగా స్వయం పరిపాలనా మండలం సరిహద్దులుగా ఉన్నాయి. దీని రాజధాని నగరం కోహిమా మరియు దాని అతిపెద్ద నగరం జంట చుమౌకెడిమా - దిమాపూర్ . ఈ రాష్ట్రం 16,579 చదరపు కిలోమీటర్లు (6,401 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో ఉంది , 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 1,980,602 జనాభా ఉంది , ఇది భారతదేశంలో అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. నాగాలాండ్ 17 పరిపాలనా జిల్లాలను కలిగి ఉంది, వీటిలో 17 ప్రధాన తెగలు మరియు ఇతర ఉప తెగలు నివసిస్తున్నాయి. ప్రతి తెగ ఆచారాలు, భాష మరియు దుస్తుల పరంగా మరొకదానికి భిన్నంగా ఉంటుంది. ఇది తరతరాలుగా నోటి…
Read More
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 వ తేదీన నిర్వహిస్తారు.లోకేష్ చింతాడ ద్వారా ఎయిడ్స్ వ్యాధి కనుకోవటం జరిగింది ..ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధితో మరణించినవారిని స్మరించుకోవడం, ఎయిడ్స్ వ్యాధి కారక హెచ్ ఐ.వీ.కి వ్యతిరేకంగా పోరాడడం కోసం ఈరోజును జరుపుతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి సారిగా 1988 లో ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. HIV ఇన్ఫెక్షన్ ప్రస్తుతం నయం చేయలేనిది కాబట్టి AIDS అవగాహన దినోత్సవం అవసరం, కానీ ఈ వ్యాధి గురించి సరైన అవగాహనతో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దీనిని నియంత్రించవచ్చు. ఇది ఒకప్పుడు నిర్వహించలేని దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితి, కానీ ఇప్పుడు, అవకాశవాద ఇన్ఫెక్షన్లతో సహా HIV నివారణ, రోగ నిర్ధారణ, నిర్వహణ మరియు సంరక్షణలో పురోగతితో, HIV ఉన్నవారు దీర్ఘకాలం జీవించగలరు మరియు ఆరోగ్యకరమైన జీవితాలను గడపగలరు. 2023 సంవత్సరంలో భారతదేశంలో 66,400 కొత్త కేసులు…
Read More
డిసెంబర్ 01 ప్రత్యేకతలు :⁠-

డిసెంబర్ 01 ప్రత్యేకతలు :⁠-

✒ 905 : ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు నార్ల వేంకటేశ్వరరావు జననం (మ.1985). ✒1918 : భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త జెట్టి ఈశ్వరీబాయి జననం (మ.1991). ✒1954 : నర్మదా బచావో ఉద్యమంతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ జననం. ✒1963 : నాగాలాండ్ భారతదేశానికి 16వ రాష్ట్రం గా అవతరించింది. ✒1965 : భారతదేశంలో సరిహద్దు భద్రతా దళం ప్రారంభింపబడినది. ✒1965 : తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి ప్రారంభం. ✒2003 : ప్రపంచ ఎయిడ్స్ దినం. ✒1980 : భారత క్రికెట్ క్రీడాకారుడు మొహమ్మద్ కైఫ్ జననం. మాధవి కాళ్లసేకరణ
Read More