ఓగేటి అచ్యుతరామశాస్త్రి (పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త)
ఓగేటి అచ్యుతరామశాస్త్రి పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త. ఇతడు 1932, జనవరి 2న జన్మించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలోను, హైదరాబాదు విమోచన ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం చేశాడు. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత, హిందీ భాషలలో ఇతడికి విస్తృతమైన పరిచయం ఉంది. 1970లో సంస్కృత థియేటర్ అనే సంస్కృత నాటక ప్రయోగ సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఇతడు నాటక ప్రయోక్త, నటుడు, దర్శకుడు, గాయకుడు కూడా. రంగస్థలం మీద, ఆకాశవాణిలో ప్రసారమైన అనేక నాటకాలలో ఇతడు నాయక, ఉపనాయక పాత్రలను పోషించాడు. 1974లో ఇతడు సంస్కృత భారతీ అనే సంస్కృత పత్రికను స్థాపించి సంపాదకునిగా వ్యవహరించాడు. ఇది హైదరాబాదు నుండి వెలువడిన తొలి సంస్కృత పత్రిక. 1978లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రప్రభుత్వ పురస్కారం స్వీకరించాడు.
రచనలు
శంకరాచార్య (1958) – పద్యకృతి
బంధాబైరాగి (1959) – చారిత్రక నాటకం
సంస్కృత నాటక ప్రయోగరంగము (1975) – పరిశోధన గ్రంథము
స్నేహబంధనమ్ (1978) – సంస్కృతంలో వ్రాయబడిన సాంఘిక నాటకం
హిమకిరీటిని (1981) – కవితాసంకలనం.
బిరుదులు
సంస్కృత నాటకప్రయోగోద్ధారక
నటరాజరాజ
ఆశ్చర్య కుశలవక్త
మహోపాధ్యాయ
రాష్ట్రకవి
భాగ్యనగర భారతి మొదలైనవి.
మాధవి కాళ్ల