Blog

Your blog category

కట్టమంచి రామలింగారెడ్డి(సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత)

కట్టమంచి రామలింగారెడ్డి(సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత)

సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి (డిసెంబర్ 10, 1880 - ఫిబ్రవరి 24, 1951) ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది, ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఆంధ్రభాషాభిరంజని సంఘంలో చురుకైన పాత్ర పోషించాడు. బరోడా సంస్థానాధిపతి శాయాజీ రావు గైక్వాడ్‌ స్ఫూర్తితో అమెరికాలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడా కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌గా చేరాడు. 1909లో మైసూరులో విద్యాశాఖలో చేరి 1918 నుంచి 1921 వరకు విద్యాశాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా వ్యవహరించాడు. 1951లో అనారోగ్యంతో ఆయన మరణించాడు. ఈయన ఆజన్మాంతం బ్రహ్మచారిగా జీవించాడు. కవిత్వతత్వవిచారం, అర్థశాస్త్రం, ముసలమ్మ మరణము ఆయన రాసిన గ్రంథాల్లో పేరు గాంచినవి. ముసలమ్మ మరణము ఆంధ్రభాషాభిరంజని సంస్థ నిర్వహించిన పోటీలో బహుమాన కావ్యంగా నిలిచింది. అర్థ శాస్త్రంపై ఆయన రాసిన పుస్తకాలు ఆంధ్ర విజ్ఞానచంద్రికా గ్రంథమండలి వారు ప్రచురించారు. రామలింగారెడ్డి చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రామంలో 1880 డిసెంబరు 10న జన్మించాడు.…
Read More
అనంత్ పాయ్(భారతీయ కామిక్ రచయిత, అమర్ చిత్రకథ సృష్టికర్త)

అనంత్ పాయ్(భారతీయ కామిక్ రచయిత, అమర్ చిత్రకథ సృష్టికర్త)

అనంత్ పాయ్ (17 సెప్టెంబర్ 1929 – 24 ఫిబ్రవరి 2011), అంకుల్ పాయ్ గా ప్రసిద్ధి చెందారు , ఒక భారతీయ విద్యావేత్త మరియు భారతీయ కామిక్స్‌లో మార్గదర్శకుడు . అతను రెండు కామిక్ పుస్తక ధారావాహికల సృష్టికర్తగా అత్యంత ప్రసిద్ధి చెందాడు, అవి సాంప్రదాయ భారతీయ జానపద కథలు, పౌరాణిక కథలు మరియు చారిత్రక పాత్రల జీవిత చరిత్రలను తిరిగి చెప్పిన అమర్ చిత్ర కథ ; మరియు పిల్లల సంకలనం టింకిల్. పాయ్ 1929 సెప్టెంబర్ 17న బ్రిటిష్ ఇండియాలోని పూర్వపు మద్రాస్ ప్రెసిడెన్సీలోని కార్కలలో కొంకణి మాట్లాడే గౌడ సారస్వత్ బ్రాహ్మణ దంపతులు వెంకటరాయ మరియు సుశీలా పాయ్ దంపతులకు జన్మించారు. అతను రెండు సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు. తరువాత అతను 1944లో మరణించే వరకు తన తల్లి తరపు తాతగారి వద్ద పెరిగాడు, ఆ తర్వాత అతను బొంబాయి (ఇప్పుడు ముంబై…
Read More
సదా నంద

సదా నంద

సహృదయ,నిరాడంబర మనస్తత్వమే….మా సదా నందను బాలసాహిత్యం వైపు మళ్ళించింది……..!!🩷🩷🩷 పాకాలలలోఅన్న…..సదానంద చూసిన దృశ్యాలన్నీ ఆయన కుంచెల బొమ్మలైఆర్ట్ గ్యాలరీలోకి చేరాయి…….బడి అయ్యోరు కదారోజంతా పిల్లలతో మమేక మయ్యాక……..ఘటన లన్ని చందమామ కథలైపిల్లల పత్రికలలోకోతికొమ్మచ్చులు, బిల్లం గోడులో అయ్యాయి……రాజారాం,మునిసుందరం చంద్రలతో చెట్టా పట్టలేశాకఅవి సామాజిక కోణాల కథలు అయ్యాయి…….అకాడమీ లైనా, సాహితీ సంస్థలైన అతను వెదుక్కుంటూ పోలేదుఅవే………పాకాలలో రైలుదిగికలువకొలను పసిగట్టి కలువల సౌరభాన్నీ వాసనపట్టిసదానందను పట్టేశాయి…..!అన్నా!అన్నేళ్ల నీ స్నేహంలోనీ అమాయకపు ఆ…..ముఖం….బాగారాయి….రాస్తేఏదో ఒకరాయితగులుతుంద నేనీ శ్రీముఖం……నా కిప్పటికీ గుర్తే………!వదిన కొసరి పెట్టిన సంగటి ముద్దలు కూడా గుర్తే……!మీ ఇద్దరి ప్రేమలు కూడా కడా వరకు గుర్తే……;!!!🩷🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి9490125878
Read More
కాశీయాత్ర ( ఐదవ రోజు )

కాశీయాత్ర ( ఐదవ రోజు )

కాశీయాత్ర ( ఐదవ రోజు ) తేది 24-2-2025 సోమవారంఉదయమే గంగా స్నానము చేసి, బోట్లలో పయణించి 64 ఘాట్లు తిరిగి చూశాము.బోటు నడిపే పిల్లలు ఇద్దరికి 20 సం.రాల లోపే వయసుంటుంది.ఘాట్ల పేర్లు ఒక్కొక్కటిగా తెలుపుతూ,వాటిని ఎవరు కట్టించారో వివరించి చెప్పారు. విశ్వనాథుని వైభవమంతా చూస్తుండగా, అక్కడ జరుగుతున్న శవదహనాల దృశ్యాలు వైరాగ్య భావాన్ని కలిగించాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఈరోజు కూడా దర్శనానికి వెళ్ళకుండా గంగ ఒడ్డున ఘాట్ల వద్ద ఉన్న నాగసాధువుల ఆశీర్వాదాలు తీసుకుంటూ బసకు వచ్చాము.గదిలో బెడ్ మీద ఉన్న గోవిందమ్మ కు తోడుగా ఆమె భర్త నాగేశ్వరరావు గారు ఉన్నారు -కోట పెంటయ్య
Read More
విరిసే వెన్నెలలు

విరిసే వెన్నెలలు

మనస్సు చంద్రుని గుప్పున విరిసే వెన్నెలలు నక్షత్రాల చమక్కుల గూడు, ఓ గాలిగోపురం చుట్టూ ఎగురుతూ వాలుతూ రంగు రంగుల పూవుళ్ళా పక్షుల కోలాహలం, మనస్సు ఉల్లాసంగా తేలిపోయే వెల్లువవుతూ,కారుచీట్లలో మగ్గిన మనస్సు తేలికపడి ఉత్తేజితమై జీవనం మనోరంజకమవును.అపరాజిత్సూర్యాపేట
Read More
కాశీ యాత్ర. ( నాల్గవ రోజు )

కాశీ యాత్ర. ( నాల్గవ రోజు )

తేది 23-2-2025 ఆదివారంఉదయం 4-00గం.లకే గంగా స్నానానికి బయలు దేరాం. కాలి దెబ్బతో బెడ్ పై ఉన్న గోవిందమ్మ గారు గదిలోనే ఉండవలసి వచ్చింది. గంగా స్నానానంతరం ఒడ్డున ఉన్న రాజేశ్వరున్ని దర్శించుకుని, రద్దీవల్ల విశ్వనాథుని దర్శనమునకు పోలేక బసకు వచ్చాము.మాలో కొందరు విశ్వనాథుని దర్శనమునకు వెళ్ళారు.కొందరు షాపింగ్ చేద్దామని మహిళా మణులు బయటకు వెళ్ళారు. 🕉️🙏🕉️
Read More
నా పయనమెటో,,,,,,,,!

నా పయనమెటో,,,,,,,,!

నాకు మంచుకొండలు వెండికొండలు కడు దూరం,,,,,,,తుక తుక మండే ఎడారి జీవితంపాదాలు శరీరం బండబారి దిక్కు తోచని పయనం,,,,,,,ఈ మంటల ఇసుకతిన్నెలు నాకు పట్టుపరుపు లయ్యాయ్,,,,,,నా ప్రస్తానం మంటగాలులు కళ్ళు ఒళ్ళు నిండా ఇసుక దుబ్బ,,,,,,,కంటికి మింటికి కడగళ్ల చాకిరీ దిబ్బ,,,,,ముసురుకొస్తున్న ఎడారి ఇసుక తుఫానులే నడుస్తున్న జీవిత పథం,,,,,,,,ఈ పృద్వీపటలం బ్రతుకు తెరువుకు గొడ్డుదయింది మరి,,,,,,,ఈ ఎండలనే మంటల్లో నన్ను నేను ఎప్పుడో మరచిపోయాను,,,,,,ఈ కళ్ళు బైర్లుకమ్మే వెలుగుల్లో మనస్సు గాఢాంధకారం,,,,,ఇందులోంచి బయటపడేందుకు ఆలోచనలన్నీ ఎప్పుడో చచ్చి శల్యమయ్యాయ్,,,,,నిప్పులు పూసే ఎండలే నాకు లేతచిగుళ్ళ పచ్చదనాలు,,,,,ఈ ఎడారిలో అతి ఎత్తైన ఇసుక దిబ్బలే నాకు మహోన్నత శిఖరాలు,,,,,,ఇక్కడ అంతా నాకు రహదారులే,,,,,!మనిషన్నవాడు కానరాని మృగాలన్నవి లేని ఉటోపియా లాంటిది,,,,,,,ఇక్కడ నాకు తప్ప ఎవరికి ప్రవేశం లేని నిషిద్ధ స్థలం,,,,,,,,ఇక్కడే నన్ను నేను తెలుసుకున్న జ్ఞాన ధాత్రి,,,,,,,ఇక ఎవరితో నాకేం పని నిర్భయంగా స్వతంత్రంగా సంచరించే మహోన్నతున్ని,,,,,,,ఈ ఉషోదయాలు ఇక్కడి సాయంసంధ్యలు…
Read More
జాన్ కీట్స్(బ్రిటీష్ రచయిత)

జాన్ కీట్స్(బ్రిటీష్ రచయిత)

జాన్ కీట్స్ (31 అక్టోబర్ 1795 - 23 ఫిబ్రవరి 1821) లార్డ్ బైరాన్ మరియు పెర్సీ బైషే షెల్లీలతో పాటు రెండవ తరం రొమాంటిక్ కవులకు చెందిన ఆంగ్ల కవి. అతను 25 సంవత్సరాల వయస్సులో క్షయవ్యాధితో మరణించినప్పుడు అతని కవితలు నాలుగు సంవత్సరాల కన్నా తక్కువ కాలం ప్రచురణలో ఉన్నాయి. అతని జీవితకాలంలో అవి ఉదాసీనంగా స్వీకరించబడ్డాయి, కానీ అతని మరణం తర్వాత అతని కీర్తి వేగంగా పెరిగింది. శతాబ్దం చివరి నాటికి, అతను ఆంగ్ల సాహిత్యం యొక్క కానన్‌లో ఉంచబడ్డాడు, ప్రీ-రాఫెలైట్ బ్రదర్‌హుడ్ యొక్క అనేక మంది రచయితలను బలంగా ప్రభావితం చేశాడు ; 1888 నాటి ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా అతని " ఓడ్ టు ఎ నైటింగేల్ "ను "చివరి కళాఖండాలలో ఒకటి"గా అభివర్ణించింది. కీట్స్ "ఇంద్రియాలతో నిండిన" శైలిని కలిగి ఉన్నాడు, ముఖ్యంగా ఓడ్స్ సిరీస్‌లో . రొమాంటిక్స్‌లో మాదిరిగానే , అతను సహజ…
Read More
అన్నమయ్య(మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు) పదకవితా పితామహుడు)

అన్నమయ్య(మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు) పదకవితా పితామహుడు)

అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (1408, మే 9 - 1503, ఫిబ్రవరి 23 ) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అని బిరుదులు ఉన్నాయి. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి. కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా కొందరి అభిప్రాయం. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. అన్నమయ్య…
Read More
నువ్వు ఉన్నావంటే

నువ్వు ఉన్నావంటే

బ్రేకప్ కథల పోటీ కోసం నువ్వు ఉన్నావంటే రచన: జనని నువ్వు ఉన్నావంటే… ఇప్పుడు అంగీకారమే…నిన్ను గుర్తు చేసుకోవడం కూడా ఇప్పుడు అంగీకారమే… నీ జ్ఞాపకాలలోలోలోపల మగ్గుతూ జీవించడం కూడా ఇప్పుడు అంగీకారమే…దూరాలను భరించడం కూడా ఇప్పుడు అంగీకారమే…ఎంతైనా విరగిపోవడం కూడా అంగీకారమే…శ్వాసలు ఆగిపోవడం కూడా ఇప్పుడు అంగీకారమే… కానీ ఒక ఉపకారం నాపై చేయి…నా ఉపకారాల కింద,ప్రేమ అనే పేరుతో నలిగి జీవించడం మాత్రం అంగీకారం కాదు… నువ్వు ఎక్కడైనా సంతోషంగా ఉండాలి…కానీ నా జ్ఞాపకాలలో, నా శ్వాసల్లో, నా ఆలోచనల్లోనీ పేరు మాత్రమే నిండిపోయి ఉంది… నువ్వు చాలా గుర్తొస్తావు…అయినా ఆ విషయాన్ని బయటపెట్టలేదు… దూరం ఎంత ఉన్నా సరే…కలిసే ఆశ మాత్రం నిలకడగా ఉండాలి…
Read More