ముళ్ళపూడి వెంకటరమణ(తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత)
ముళ్ళపూడి వెంకటరమణ (జూన్ 28, 1931 - ఫిబ్రవరి 24, 2011) ఒక తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశాడు. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యాడు. ఇతను వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగుకు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు. ఆయన ఆత్మకథ కోతి కొమ్మచ్చి అనే పుస్తక రూపంలో వెలువడింది. బాపు మొట్టమొదటి సినిమా సాక్షి నుండి బంగారు పిచిక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళి పుస్తకం, మిష్టర్ పెళ్ళాం, రాధాగోపాలం వంటి సినిమాలకు రచయిత. 1995లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ నుండి శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం అందుకొన్నాడు. ముళ్ళపూడి వెంకటరమణ 1931 జూన్ 28 న ధవళేశ్వరంలో జన్మించాడు. ఇతని అసలుపేరు ముళ్ళపూడి వెంకటరావు. తండ్రి సింహాచలం గోదావరి…