Blog

Your blog category

రావెళ్ళ వెంకట రామారావు(తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు)

రావెళ్ళ వెంకట రామారావు(తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు)

రావెళ్ళ వెంకట రామారావు (జనవరి 31, 1927 - డిసెంబర్ 10, 2013) తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటు, తన రచనలు, పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచాడు. రావెళ్ల ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలో 1927, జనవరి 31 న రైతు కుంటుంబంలో లక్ష్మయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. భూమి కోసం, భుక్తి కోసం, నిజాం రాచరిక పాలన అంతం కోసం తుపాకి పట్టి దళకమాండర్‌గా పనిచేశారు.విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితులైన రావెళ్ల 1944 లో ఆంధ్రమహాసభలో చేరారు. 1947 ప్రాంతంలో నవభారత, స్వతంత్రభారత పత్రికలలో నైజాంపాలనను విమర్శిస్తూ అభ్యుదయ జానపదశైలిలో రచనలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో తొలిదశ కమాండర్‌గా పెన్నూ గన్నూ చేతబట్టి బరిలోకి దూకి పీడిత ప్రజల పక్షాన నిలిచి పోరాడారు. రహస్య జీవితం గడుపుతూ…
Read More
కందుకూరి రామభద్రరావు(తెలుగు రచయిత, కవి, అనువాదకుడు)

కందుకూరి రామభద్రరావు(తెలుగు రచయిత, కవి, అనువాదకుడు)

కందుకూరి రామభద్రరావు ( 1905 జనవరి 31 - 1976 అక్టోబరు 8) ప్రముఖ తెలుగు రచయిత, కవి, అనువాదకుడు. వీరు గోదావరీ నది తీరంలో రాజవరం గ్రామంలో జన్మించారు.వారి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని రాజవరం. వీరు పిఠాపురం మహారాజా కళాశాలలో పట్టభద్రులై ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఆత్రేయపురంలో మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలో సంస్థాపక ప్రధానోపాధ్యాయులుగా ఉత్తమ సంప్రదాయాలను నెలకొల్పారు. వీరు రాజవరం పంచాయితీకి మొదటి అధ్యక్షులు. వీరు కవిగా తరంగిని, వేదన, జయపతాక, కవితాలహరి మొదలైన గేయాలను, గేయమంజరి అనే గేయ కావ్యాన్ని, ఎందరో మహానుభావులు అనే వచన గ్రంథాన్ని రచించారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ చిత్ర నాటికను తెలుగు భాషలోకి అనువదించారు. వీరి స్వీయ కవితలను "Searching Strains"గా ఇంగ్లీషులోకి అనువదించారు. వీరు "Leaves from a diary" అనే ఆంగ్ల గ్రంథం రచించారు. రామభద్రరావుగారి తండ్రి కందుకూరి సూర్యనారాయణ ఉత్తమ సంస్కారం గల…
Read More
పవిత్రమైన రక్తసంబంధం

పవిత్రమైన రక్తసంబంధం

అనాది నుండి నవశకం దాకాఅతి పవిత్రమైనది సోదర సోదరి బంధంజనబాహుళ్యంలో ఇది నాలుకలపై కడలాడుతూకల్మష భూయిష్టమైనది సోదర సోదరీ సంబంధంజనం పెరగడం జంతు సంబంధాలుమనిషి జీవన లోలోతుల వరకు కూలిపోతున్న నవీనయుగంకట్టుబాట్లు నియమ నిబంధనలు ఏట్లో కొట్టుకుపోతున్నాయినీ గోతి నీవే తవ్వుకుంటున్న రాక్షస ఆనందంపెడదార్ల లోకంలో ఆదర్శంగా జీవించడమే గగణమైందిఒక కొమ్మకు పూసిన రెండు పూవుల్లా అన్నా చెల్లి కలివిడి పవిత్ర మానవతఅందుకోసం సోదరి సోదరుని చేతికి అలంకరించే రాఖీరాఖీ పౌర్ణమి పండుగ సహోదరత్వం కాపాడే పురాతనం నుండి ఆచరిస్తున్నపూచిన రంగు రంగుల హరివిల్లు సోదర సోదరీ బంధంసోదరి కోసం ఎన్ని త్యాగాలైనా జీవితాంతం చేసే సోదరుడునేడు ఈ జంతు సమాజంలో విరిగి ముక్కలైన పవిత్రతఇది కొందరికే వర్తిస్తుందిసూర్య చంద్రులు ప్రతి రోజు ఉదయిస్తున్నారు అంటేఆ కొందరి కోసమేఅందుకే నీవు మనిషివని మానవత్వం కాపాడడం కోసంరాఖీలాంటి రక్షాబంధన్ వెన్నెల వర్షం హృదయాలలోఈ పవిత్ర బంధం కల్మష భూయిష్టం కాకుండాజరుపుకోండి ఆయిస్సు పెంచి…
Read More
బండరాతి

బండరాతి

కష్టసుఖాలు కావడి మోతలు. రెండు సమపాళ్లలో ఉంటేనే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఏదెక్కువైనా జీవితం అధోగతి లేదా నిస్తేజం అవుతుంది.ఈ రెండు లేనిదే జీవితమే లేదు. బండరాతితో సమానం.అపరాజిత్సూర్యాపేట
Read More
కూలీజనం

కూలీజనం

డబ్బు కోసం కూలీజనం ఆకలి తీరేందుకు పడరాని పాట్లు పడుతూ బ్రతుకు పుటల్లో చిరునామా లేని పూరిగుడిసెలు నివాసాలు అణగి మనగి వుండే ఈ గరీబులు నీకు నిర్మించిన ఆకాశహార్మ్యాలు విప్లవిస్తే కూల్చేసేది వీళ్ళే సోదరా,,,,,,,అపరాజిత్సూర్యాపేట
Read More
ఆలోచనల సమతుల్యతతోనే మేథస్సు వృద్ధి

ఆలోచనల సమతుల్యతతోనే మేథస్సు వృద్ధి

క్రియాత్మక ఆలోచనలు ప్రియం అమృతంయావత్తు ప్రపంచం చరించేదిఆలోచనల సమతుల్యతే సంజీవనులుమనస్సు లోపలి మనిషివెలుగు వసంతాలు అవనికి జీవంతాత్విక సహేతుక ఆలోచనలేజిజ్ఞాసుల ఆలోచనల శ్రమలతోనే జగత్తుకు ఊపిరులుమేథస్సు ఉజ్వలంగా ప్రజ్వరిల్లితేనే జ్ఞానం ఉనికిఎన్నెన్నో శాస్త్రపరిశోధనలే నేటి నూతన పుంతల జగత్తుమనస్సు మూలాలలో జిజ్ఞాస ద్విగుణీకృతమయ్యిమనస్సులో జ్ఞాన అగ్ని జ్వలిస్తేనే నూతన ఆవిష్కరణలునిరంతరం గ్రంథ అధ్యయనంతోక్రమపద్ధతిలో వాడియైన ఆలోచనలు శాస్త్రపరిశోధనలకు నిలయాలుమనస్సు సంక్లిష్ట వ్యవస్థను ఉపయోగిస్తేనే వినూత్న రూపం దిద్దుకుంటుందిసామాజిక దృక్పథాన్ని కొత్తకోణంలో మార్పుకు దోహదం చేసేవారు తాత్వికులువెన్నపూస లాంటి మనస్సు నాడులతో అల్లుకుపోయిన సృజనశీలియైన జ్ఞానతృష్ణ,,,,,,,విజ్ఞానం సుదీర్ఘ కాలంగా తన సేవలు అందించడానికి ఆలోచనాపరులు శాస్త్రజ్ఞుల శ్రమల సాఫల్యత,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
ప్రకృతి కన్నెర్రజేస్తే

ప్రకృతి కన్నెర్రజేస్తే

మాను మాకు లేని ఈ భువినిభయంకరమైన ఈదురుగాలులతోనింగినిండా కారుమేఘాలు కమ్ముకునిఉరుములు మెరుపులు పిడుగులతోప్రకృతి విలయతాండవం చేస్తూనింగి నేలకు ఏకధారగా వర్షంకుంభవృష్టితో భువినిండా కుమ్మరిస్తూ కుమ్మేస్తూసముద్రాలన్నీ అల్లకల్లోలమై తోసుకొస్తూసునామీలు పెట్రేగుతూ విరుచుకుపడుతూభూతలంపైకి ఉగ్రరూపంతో తోసుకొస్తూమనుషులు తమ టెక్నాలజీ సైన్స్చీమలకన్నా హీనంగా కొట్టుకుపోతూ హాహాకారాలుఈ లోకం సమస్తం తుడిచిపెట్టుకుపోతూగర్జించే సింహంలా ప్రకృతి కన్నెర్ర చేస్తుంటేఈ ఉరుకులు పరుగుల జీవనయానంప్రకృతి భీభత్సంలో భూమిని కబళించివేస్తూమనిషన్నవాడి మేథస్సు కందని ప్రకృతి రహస్యంమనిషి ప్రకృతి సమతుల్యత కాపాడుకోకచెట్టుపుట్ట కబలిస్తూ విస్తరిస్తున్న జనాభఅడవుల స్థానంలో ఆకాశహార్మ్యాలు వెళుస్తూజంతువులను పక్షులను సర్వం భక్షిస్తూఇతర గ్రహాలపై జీవం జాడకై అన్వేషించే మనిషిఎంత మేథస్సు ఉంటేనేమితన ఉనికికే ప్రమాదం తెచ్చుకునే మూర్ఖుడు నరరూప రాక్షసుడు,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
నీవే నా వెన్నెల

నీవే నా వెన్నెల

అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :⁠- చిత్రంతేది:⁠- 30/01/2026 శీర్షిక:⁠- నీవే నా వెన్నెల ప్రియమైన నీకు… ఈ రాత్రి చంద్రుడు ఎంత సంపూర్ణంగా మెరిసిపోతున్నాడో, నా జీవితంలో నీవు అంతే సంపూర్ణంగా వెలిగిపోతున్నావు. చెట్ల నీడల మధ్యుగా మన అడుగులు పడుతున్నప్పుడు, కాలం కూడా మన వెంట నడుస్తున్నట్టే అనిపిస్తోంది. నీ చేతి వేడిమి నా గుండెకు ధైర్యం ఇస్తోంది; ఈ ప్రపంచంలో ఏ తుఫాను వచ్చినా, నీ పక్కన నడిస్తే చాలు అన్న నమ్మకం నాలో పుట్టిస్తోంది. నీవు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి రాత్రులు భయంకరంగా కాకుండా అందంగా మారాయి. నిశ్శబ్దం కూడా సంగీతంలా వినిపిస్తోంది. నీ నవ్వు నాకు ఉదయపు తొలి కిరణం , నీ మౌనం నాకు అర్థమయ్యే భాష. మాటలు లేకుండా కూడా మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడం , అది ప్రేమ కాదా మరి? మా ఇద్దరి చేతుల కలయికలాగే, మన మనసులు…
Read More
నాయని కృష్ణకుమారి(తెలుగు రచయిత్రి)

నాయని కృష్ణకుమారి(తెలుగు రచయిత్రి)

నాయని కృష్ణకుమారి (మార్చి 14, 1930 - జనవరి 30, 2016) తెలుగు రచయిత్రి. ఆమె కవి నాయని సుబ్బారావు కుమార్తె.నాయని కృష్ణకుమారి గుంటూరు జిల్లాలో 1930, మార్చి 14 న జన్మించారు. ఈమె తల్లిదండ్రులు హనుమాయమ్మ, నాయని సుబ్బారావు. ఈమెకు ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు.ఆమె అక్షరాలా బాల్యం నుంచి కవిత్త్వ తత్త్వం ఆకళించుకున్న కవయిత్రి. సుబ్బారావుగారు ప్రముఖసాహితీవేత్తలతో జరుపుతున్న చర్చలు వింటూ చిన్నతనంలోనే నలుగురిలో నిర్భయంగా మెలగడం, మాట్లాడడం నేర్చారు ఆమె. ఆమె పాఠశాల చదువు నరసరావుపేట, శ్రీకాకుళం లలో పూర్తిచేశారు. గుంటూరులో కాలేజీచదువు పూర్తి అయిన తరువాత 1948లో ఆమె తెలుగు ఎం.ఎ. చెయ్యడానికి విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఉన్న మూడేళ్లూ ఆమె సాహిత్యాభిలాషని తీర్చి దిద్దడానికి ఎంతగానో తోడ్పడినాయి. అంతకుముందే, ఆమె బి.యే. చదువుతున్న రోజులలో ఆంధ్రులచరిత్ర క్లాసులో రాసుకున్న నోట్సు ఆధారంగా “ఆంధ్రులకథ” అన్న పుస్తకం రాసి ప్రచురించారు. అప్పటికి ఆమె వయసు…
Read More
వడ్డెర చండీదాస్(తెలుగు నవలా రచయిత)

వడ్డెర చండీదాస్(తెలుగు నవలా రచయిత)

వడ్డెర చండీదాస్ (నవంబర్ 30, 1937 - జనవరి 30, 2005) ప్రముఖ తెలుగు నవలా రచయిత, తాత్వికుడు.వీరు 1937 నవంబర్ 30 న కృష్ణాజిల్లా, పామర్రు మండలం, పెరిశేపల్లి గ్రామములో వ్యసాయదారుల కుటుంబంలో జన్మించారు. వీరి అసలు పేరు డాక్టర్ చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు (సి. ఎస్. రావు). తన కలంపేరులో "వడ్డెర"ను పేద వృత్తికులమైన వడ్డెర ప్రజల నుండి, చండీదాస్ అన్న పేరును 15వ శతాబ్దపు విప్లవాత్మక బెంగాలీ కవి నుండి స్వీకరించాడని కథనం. చండీదాస్ తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయములో తత్త్వశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి విరమించారు. ఇతని నవలలో హిమజ్వాల, అనుక్షణికం, చీకట్లోంచి చీకటిలోకి, ప్రేమతో ప్రముఖమైనవి. చైతన్య స్రవంతి కథన రీతిని ఎంచుకుని రాసిన చండీదాస్‌ రచనలు విశేష ప్రజాదరణ పొందడమే కాకుండా సాహిత్యవేత్తల మన్ననలు కూడా పొందాయి. హిమజ్వాల ఇది వడ్డెర చండీదాస్ తొలి నవల. మంచులా చల్లబడిపోయిన తెలుగు పాఠకుల మనసులో మంటలు రగిలించిన…
Read More