Blog

Your blog category

సావిత్రిబాయి ఫూలే(భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి)

సావిత్రిబాయి ఫూలే(భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి)

సావిత్రిబాయి ఫూలే (1831 జనవరి 3– 1897 మార్చి 10) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు…
Read More
ప్రేమనిండిన హృదయం అనంత సంద్రం

ప్రేమనిండిన హృదయం అనంత సంద్రం

ప్రేమనిండిన హృదయం అనంత సంద్రం,,,,,,,,!! ప్రేమికులిరువురి స్వచ్ఛమైన ప్రేమవెన్నెలల్లిన హృదయాల కోవెలలలిత లలిత లాలిత్య కుసుమ కోమలం హృదయాలు,,,,,,,నిజమైన ప్రేమ గుభాళించే పూవుల్లా స్వచ్ఛమైనదిఆ ప్రేమ శారీరక సుఖాన్ని కోరదుఇరువురి హృదయాలు వికసించి పరిమళించే కమలంలా పవిత్రమైనది ప్రేమ,,,,,,శారీరక ఆకర్షణలు, కామం నిండిన కళ్ళల్లో ప్రేమలేల,,,,,,ప్రేమ హృదయంలో గూడుకట్టుకున్న మధురమైన స్వప్నాల కళానిలయం,,,,,,,,కొన్ని విషయాల పట్ల ఆకర్షణ త్యజిస్తేనే ప్రేమ అమృతం కురుస్తుంది,,,,,,,,,,హృదయంలో పన్నీటి జీవజలములు పారే సెలయేరు ప్రేమ,,,,,,,,,,హృదయంలో దివిలోని పారిజాతం పుష్పించి గుభాళించే మధురమైన భావన ప్రేమంటే,,,,,,,,,హృదయంలో కృష్ణవేణి తరంగాలలో సాగే మురళీరవం ప్రేమ,,,,,,,,,,హృదయంలో వీణుల కింపుగా కోయిలతీసే రాగం తేనీయలు ప్రేమంటే,,,,,,,,,సముద్రమంత లోతైన హృదయాలలో వీచే మలయమారుతాలలో ఎగిరే పక్షుల జంటల ఊసులు పక్వమైన ప్రేమ,,,,,,,,,,,ప్రేమ ఎప్పుడూ ఓటమి ఎరుగదు భువి నుండి దివిదాకా హృదయాలు పాడే సుమధుర గీతాంజలి,,,,,,,,,,ఆలోచనలకు అందని రూపంలో హృదయంలో నెలవైనది సిసలైన ప్రేమ,,,,,,,,,అందుకే నిజమైన ప్రేమ పెళ్ళికి చిరునామా కాదు,,,,,, అపరాజిత్సూర్యాపేటఈ…
Read More
ప్రేమ

ప్రేమ

ప్రేమ రెండు హృదయాల లయల్లో మనస్సు పొరలు విచ్చుకున్న రూపాల్లో ఉద్బవించిన ఘాటైన చేరువ. కళ్ళు పలికే మూగ బాధ.గుండెలు పలికే మధురానుభూతి.ఇరువురి మనస్సుల ఆకర్షణలో,ఇరువురి గుండెల్లో రూపుదిద్దుకున్న కళాఖండాల అద్భుత చిత్రీకరణ ప్రేమంటే,,,,,,!!అపరాజిత్సూర్యాపేట
Read More
ప్రేమాలయాలు

ప్రేమాలయాలు

ప్రేమాలయాలు రెండు హృదయాల మధ్య తీయని బాధాతప్త జ్ఞాపకాల లోగిళ్ళ సమ్మిళితం ప్రేమ ఒకే జీవితానుభవం,,,,,,,,,లక్షల పూవులు పుప్పొడి వెదజల్లుతూ ప్రియులకై తపియిస్తూ ఆ గుభాళించే సౌందర్యం ఆస్వాదించేందుకు అంతే మధురమైన ప్రేమానుభూతితో పూవుల హృదయాల నెరిగి ,మకరందం గ్రోలెందుకు పరిభ్రమించే తుమ్మెదల దివ్యానుభూతి,,,,,,,,,,,ప్రేమికుల ఇరువురి మనస్సులు పాడే మైమరపించే ఆత్మీయత జీవితం లోలోతుల వరకు చుంభించే ఆలింగనం వేదనసంవేదనల పూల మాలలల్లిక,,,,,,,,రెండు వేర్వేరు గ్రహాల నుండి ఈ భువికేతెంచి ప్రేమ ఊసులు బాసల దివ్యత్వం మీ బిగికౌగిలిలో జీవన్మరణ స్థితిలో సైతం వీడని ప్రగాఢమైన ఆత్మలు లీనమైన సౌందర్యం ప్రేమ,,,,,,,,,,అబ్బురపరిచే ఘాటు ప్రేమలో అణువణువు ఒకరినొకరు అర్పించుకునే మనస్సులు పూసిన మరుమల్లియలు ఇలలో రాధాకృష్ణుల హృదయాలు ప్రేమాలయాలు,,,,,,,,,,ప్రేమ జ్వరంలో హృదయాల్లో మధురమైన అలజడి, ఇరువురి మధ్య అబ్బురపరిచే అనురాగం ,మనస్సులు పడే సంవేదనలు గుండె గూడులో శతకోటి జ్యోతుల వెలుగుల ప్రేమానందాలు,,,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
చాగంటి సోమయాజులు(తెలుగు రచయిత)

చాగంటి సోమయాజులు(తెలుగు రచయిత)

చాగంటి సోమయాజులు (1915, జనవరి 15 - 1994 జనవరి 1) ప్రముఖ తెలుగు రచయిత. చాసోగా అందరికీ సుపరిచితుడు. ఆయన మానవతావాదిగా ప్రారంభమై, మార్క్సిస్టుగా మారి, కథల్లో ప్రగతిశీల విలువలు, పీడిత ప్రజల బాధలు, సమస్యలు గురించి విస్తృతంగా రచనలు చేశాడు. ఈయన మొట్ట మొదటి రచన చిన్నాజీ 1942లో భారతి అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత ఎన్నో కథలు, కవితలు రాశాడు. ఈయన రాసిన చాలా కథలు హిందీ, రష్యన్, కన్నడ, మరాఠి, మలయాళం, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. 1968లో చాసో కథలుగా పుస్తక రూపంలో చాసో కథా సంకలనం వెలువడింది. ఆయన 70వ జన్మదిన సందర్భంగా కొద్ది మంది ముఖ్యమైన రచయతల కథలు సంకలనం చేశాడు.ఈయన స్నేహితులైన శ్రీ శ్రీ, శ్రీరంగం నారాయణ బాబు, రోణంకి అప్పలస్వామి వంటి వారిని ప్రభావితం చేశాడు. 1915 జనవరి 17 న శ్రీకాకుళంలో కానుకొలను లక్ష్మీనారాయణ శర్మ, తులసమ్మ…
Read More
పానుగంటి లక్ష్మీ నరసింహరావు(ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించినవారు)

పానుగంటి లక్ష్మీ నరసింహరావు(ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించినవారు)

పానుగంటి లక్ష్మీ నరసింహారావు ( ఫిబ్రవరి 11,1865 - జనవరి 1, 1940) తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావును పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది. రచయితగా పేరుపడిన నరసింహరావు రక్తాక్షి సంవత్సరం మాఘ బహుళ పాడ్యమి నాడు అనగా 1865, నవంబర్ 2న రాజమండ్రి తాలూకా సీతానగరంలో జన్మించాడు. ద్యులు. శ్రీ లక్ష్మినరసింహము పంతులుగారి నాటకములలోని పద్యములు బండివానినుండి పండితునివఱకు బాడుకొని యానందించుచుందురు. నాటకరచనకంటె సాక్షివ్యాసములతో బానుగంటివారికి గొప్పపేరువచ్చింది. సాక్షి వ్యాసములకంటె నాటకరచనలో నరసింహరావు పంతులుగారిని రసవిదు లెల్ల మెచ్చుకొనిరి. పానుగంటివారి నాటకములకు కూచి నరసింహముగారు 'నాంది' వ్రాయుట యొక యాచారము. పంతులుగా రాంగ్లవిశేఖరుడగు 'షేక్‌స్పియరు' వ్రాసిన యన్నినాటకములు వ్రాయవలె నని సంకల్పించి యొకటిరెండించు మించులో దమ సంకల్పము పూరించుకొనిరి. వానిలో నయిదాఱు 'నాటకములకు--------వచ్చింది. 'రాధాకృష్ణ' వీరి…
Read More
వేణు సంకోజు (కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు)

వేణు సంకోజు (కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు)

వేణు సంకోజు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు. 1972 నుంచి కవితలు, కథలు, వ్యాసాలు, గ్రంథ రచనలు చేస్తున్నాడు. 1984లో నల్లగొండలో జయమిత్ర సాంస్కృతిక సాహిత్య వేదిక స్థాపించి వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. 12 పుస్తకాలు రాసిన వేణు, 2022లో తెలంగాణ ప్రభుత్వ దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నాడు. వేణు 1951, జనవరి 1న తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, చండూరు మండలంలోని చండూరు గ్రామంలో జన్మించాడు. తండ్రిపేరు వీరబ్రహ్మం, తల్లీ శాంభవి. వేణు రాజనీతి శాస్త్రంలో ఎంఏ, ఎంఫిల్, పీజీడీసీఈ, జర్నలిజంలో పీజీడీ సాధించాడు. 2008లో తెలుగులో కథా సాహిత్య పరిశోధన అనే అంశంమీద పరిశోధన చేసి ఎంఫిల్‌ పట్టాను పొందాడు.నల్లగొండ ప్రభుత్వ మహిళా కళాశాలలో పొలిటికల్‌ సైన్స్‌ అధ్యాపకుడిగా పనిచేశాడు. కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న సమయంలో 1982లో వేణు రచించిన మనిషిగా పూచే మట్టి అనే తొలి కవితా సంపుటిని 1995లో కాళోజీ…
Read More
షేక్‌ బడేసాహెబ్‌(తెలుగు రచయిత)

షేక్‌ బడేసాహెబ్‌(తెలుగు రచయిత)

బడే సాహెబ్‌ షేక్‌ తెలుగు భాషను రక్షించుకోవాడనికి 'మేధావుల బారి నుంచి తెలుగు భాషనే కాదు లిపిని కూడా కాపాడుకుందాం అనే ' వ్యాసాన్ని 'వార్త' దినపత్రికలో వ్రాశారు. అప్పటి నుండి తెలుగు నేర్చుకోవడము సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా వివిధ పత్రికల్లో ఇతను వ్రాసిన వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. బడే సాహెబ్‌ షేక్‌ కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో 1948 జనవరి 1 ఒకిటిన జన్మించారు. వీరి తల్లితండ్రులు: హసన్‌ బీ, ఖాశిం సాహెబ్‌. చదువు: బి.కాం. భారత తపాలాశాఖ విశ్రాంత ఉద్యోగి.చిన్నతనం నుండి తెలుగు భాష పట్ల మక్కువ ఎక్కువగా ఉన్న ఇతను 1991 నుండి తెలుగు భాషను రక్షించుకోవాడనికి నడుం కట్టి 'మేధావుల బారి నుంచి తెలుగు భాషనే కాదు లిపిని కూడా కాపాడుకుందాం' వ్యాసాన్ని 'వార్త' దినపత్రికలో రాశారు. అప్పటి నుండి తెలుగు నేర్చుకోవడము సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా వివిధ పత్రికల్లో ఇతను వ్రాసిన వ్యాసాలు…
Read More
తిరుమల శ్రీనివాసాచార్య(గీతాలు, సాహిత్యవ్యాస సంకలనాలు, రుబాయీల రచయిత)

తిరుమల శ్రీనివాసాచార్య(గీతాలు, సాహిత్యవ్యాస సంకలనాలు, రుబాయీల రచయిత)

తిరుమల శ్రీనివాసాచార్య 1938, జనవరి 1 న రాజన్న సిరిసిల్ల జిల్లా, యల్లారెడ్డిపేట్ మండలం, నారాయణపూర్ గ్రామంలో తిరుమల మనోహరాచార్యులు వేంకటమ్మ దంపతులకు జన్మించాడు. ఎం.ఏ. పట్టభద్రుడు. ఆంధ్రోపన్యాసకునిగా పనిచేసి 1995లో పదవీ విరమణ చేశాడు. రచనలు జీవనస్వరాలు (ఖండకావ్యము - 1971)గంగాతరంగాలు (లలితగీతాలు - 1992)కావ్యపుష్కరిణి (పద్యకవితా సంపుటి -2001)వ్యాసోల్లాసం (సాహిత్య వ్యాస సంపుటి -2002)ప్రపంచవిపంచి (పంచపదుల సంకలనం - 2004) పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు (1982)వానమామలై వరదాచార్య స్మారక పురస్కారం (1989)అభినవ పోతన సాహితీ సాంస్కృతిక సమాఖ్య వారి జీవన సాఫల్య పురస్కారం (2013)తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం (1996), (2013)ఆం.ప్ర. కళాశాల ఉత్తమ ఉపన్యాసక పురస్కారం'కలహంసి' బాబయ్య స్మారక పురస్కారం (1993)శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వారిచే మహాకవి దాశరథి స్మారక పురస్కారం (1997)అరుంధతి కళా సంస్థ వారిచే మహాకవి దాశరథి స్మారక పురస్కృతి (1998)రసమయి పురస్కారం (2000),(2005),(2011)రాయప్రోలు 'వంశీ-రత్న' స్వర్ణపతక పురస్కారం (2002)బి.లక్ష్మీకాంతరావు స్మారక పురస్కారం…
Read More
ముకురాల రామారెడ్డి(మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత)

ముకురాల రామారెడ్డి(మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత)

ముకురాల రామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. 1976లో ఆకాశవాణి, ఢిల్లీ వారిచే 'జాతీయకవి 'గా గుర్తింపబడి, సన్మానం అందుకున్నాడు. పద్యాలు, కవితలు, పాటలు, కథలు వ్యాసాలు వంటి అనేక సాహిత్య ప్రక్రియలలో తనదైన ముద్రవేసిన సాహితీపరుడు. ఇతడు పాలమూరు జిల్లా, కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో 1929 జనవరి 1వ తేదీన మంద రామలక్ష్మమ్మ, బాలకృష్ణారెడ్డి దంపతులకు జన్మించాడు గంగాపురం హనుమచ్చర్మ ఇతని గురువు. గ్రామంలోని కానిగి పాఠశాలలో ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. క్రమక్రమంగా పరీక్షలు ప్రైవేటుగా రాస్తూ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్రలో, తెలుగులో ఎం.ఏ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై, పి.హెచ్‌.డి. చేసి డాక్టరేటు పొందాడు. ప్రాథమిక పాఠశాలలో ఎలిమెంటరీ ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా, డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకునిగా, తెలుగు అకాడమిలో ఉప సంచాలకునిగా 17 సం||ల సుదీర్ఘకాలం పదవీ బాధ్యతలు ఆదర్శప్రాయంగా నిర్వహించి పదవీ విరమణ చేశాడు. 1947-48లో నిజాం…
Read More