Month: January 2026

వేణు సంకోజు (కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు)

వేణు సంకోజు (కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు)

వేణు సంకోజు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు. 1972 నుంచి కవితలు, కథలు, వ్యాసాలు, గ్రంథ రచనలు చేస్తున్నాడు. 1984లో నల్లగొండలో జయమిత్ర సాంస్కృతిక సాహిత్య వేదిక స్థాపించి వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. 12 పుస్తకాలు రాసిన వేణు, 2022లో తెలంగాణ ప్రభుత్వ దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నాడు. వేణు 1951, జనవరి 1న తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, చండూరు మండలంలోని చండూరు గ్రామంలో జన్మించాడు. తండ్రిపేరు వీరబ్రహ్మం, తల్లీ శాంభవి. వేణు రాజనీతి శాస్త్రంలో ఎంఏ, ఎంఫిల్, పీజీడీసీఈ, జర్నలిజంలో పీజీడీ సాధించాడు. 2008లో తెలుగులో కథా సాహిత్య పరిశోధన అనే అంశంమీద పరిశోధన చేసి ఎంఫిల్‌ పట్టాను పొందాడు.నల్లగొండ ప్రభుత్వ మహిళా కళాశాలలో పొలిటికల్‌ సైన్స్‌ అధ్యాపకుడిగా పనిచేశాడు. కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న సమయంలో 1982లో వేణు రచించిన మనిషిగా పూచే మట్టి అనే తొలి కవితా సంపుటిని 1995లో కాళోజీ…
Read More
షేక్‌ బడేసాహెబ్‌(తెలుగు రచయిత)

షేక్‌ బడేసాహెబ్‌(తెలుగు రచయిత)

బడే సాహెబ్‌ షేక్‌ తెలుగు భాషను రక్షించుకోవాడనికి 'మేధావుల బారి నుంచి తెలుగు భాషనే కాదు లిపిని కూడా కాపాడుకుందాం అనే ' వ్యాసాన్ని 'వార్త' దినపత్రికలో వ్రాశారు. అప్పటి నుండి తెలుగు నేర్చుకోవడము సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా వివిధ పత్రికల్లో ఇతను వ్రాసిన వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. బడే సాహెబ్‌ షేక్‌ కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో 1948 జనవరి 1 ఒకిటిన జన్మించారు. వీరి తల్లితండ్రులు: హసన్‌ బీ, ఖాశిం సాహెబ్‌. చదువు: బి.కాం. భారత తపాలాశాఖ విశ్రాంత ఉద్యోగి.చిన్నతనం నుండి తెలుగు భాష పట్ల మక్కువ ఎక్కువగా ఉన్న ఇతను 1991 నుండి తెలుగు భాషను రక్షించుకోవాడనికి నడుం కట్టి 'మేధావుల బారి నుంచి తెలుగు భాషనే కాదు లిపిని కూడా కాపాడుకుందాం' వ్యాసాన్ని 'వార్త' దినపత్రికలో రాశారు. అప్పటి నుండి తెలుగు నేర్చుకోవడము సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా వివిధ పత్రికల్లో ఇతను వ్రాసిన వ్యాసాలు…
Read More
తిరుమల శ్రీనివాసాచార్య(గీతాలు, సాహిత్యవ్యాస సంకలనాలు, రుబాయీల రచయిత)

తిరుమల శ్రీనివాసాచార్య(గీతాలు, సాహిత్యవ్యాస సంకలనాలు, రుబాయీల రచయిత)

తిరుమల శ్రీనివాసాచార్య 1938, జనవరి 1 న రాజన్న సిరిసిల్ల జిల్లా, యల్లారెడ్డిపేట్ మండలం, నారాయణపూర్ గ్రామంలో తిరుమల మనోహరాచార్యులు వేంకటమ్మ దంపతులకు జన్మించాడు. ఎం.ఏ. పట్టభద్రుడు. ఆంధ్రోపన్యాసకునిగా పనిచేసి 1995లో పదవీ విరమణ చేశాడు. రచనలు జీవనస్వరాలు (ఖండకావ్యము - 1971)గంగాతరంగాలు (లలితగీతాలు - 1992)కావ్యపుష్కరిణి (పద్యకవితా సంపుటి -2001)వ్యాసోల్లాసం (సాహిత్య వ్యాస సంపుటి -2002)ప్రపంచవిపంచి (పంచపదుల సంకలనం - 2004) పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు (1982)వానమామలై వరదాచార్య స్మారక పురస్కారం (1989)అభినవ పోతన సాహితీ సాంస్కృతిక సమాఖ్య వారి జీవన సాఫల్య పురస్కారం (2013)తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం (1996), (2013)ఆం.ప్ర. కళాశాల ఉత్తమ ఉపన్యాసక పురస్కారం'కలహంసి' బాబయ్య స్మారక పురస్కారం (1993)శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వారిచే మహాకవి దాశరథి స్మారక పురస్కారం (1997)అరుంధతి కళా సంస్థ వారిచే మహాకవి దాశరథి స్మారక పురస్కృతి (1998)రసమయి పురస్కారం (2000),(2005),(2011)రాయప్రోలు 'వంశీ-రత్న' స్వర్ణపతక పురస్కారం (2002)బి.లక్ష్మీకాంతరావు స్మారక పురస్కారం…
Read More
ముకురాల రామారెడ్డి(మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత)

ముకురాల రామారెడ్డి(మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత)

ముకురాల రామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. 1976లో ఆకాశవాణి, ఢిల్లీ వారిచే 'జాతీయకవి 'గా గుర్తింపబడి, సన్మానం అందుకున్నాడు. పద్యాలు, కవితలు, పాటలు, కథలు వ్యాసాలు వంటి అనేక సాహిత్య ప్రక్రియలలో తనదైన ముద్రవేసిన సాహితీపరుడు. ఇతడు పాలమూరు జిల్లా, కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో 1929 జనవరి 1వ తేదీన మంద రామలక్ష్మమ్మ, బాలకృష్ణారెడ్డి దంపతులకు జన్మించాడు గంగాపురం హనుమచ్చర్మ ఇతని గురువు. గ్రామంలోని కానిగి పాఠశాలలో ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. క్రమక్రమంగా పరీక్షలు ప్రైవేటుగా రాస్తూ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్రలో, తెలుగులో ఎం.ఏ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై, పి.హెచ్‌.డి. చేసి డాక్టరేటు పొందాడు. ప్రాథమిక పాఠశాలలో ఎలిమెంటరీ ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా, డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకునిగా, తెలుగు అకాడమిలో ఉప సంచాలకునిగా 17 సం||ల సుదీర్ఘకాలం పదవీ బాధ్యతలు ఆదర్శప్రాయంగా నిర్వహించి పదవీ విరమణ చేశాడు. 1947-48లో నిజాం…
Read More
ఎల్లాప్రగడ సీతాకుమారి(కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యురాలు)

ఎల్లాప్రగడ సీతాకుమారి(కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యురాలు)

ఎల్లాప్రగడ సీతాకుమారి కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు.ఆమె జనవరి 1 1911 న బాపట్లలో జన్మించారు. ఆమె హైదరాబాద్లో ఉంటూ ఆంధ్రుల అభ్యున్నతికి తోడ్పడ్డారు.సికింద్రాబాద్ కీస్ బాలికా విద్యాలయంలో చదివి విద్వాన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులై తెలుగు పండితురాలుగా ఉద్యోగం చేసారు. ఆమె తన భర్త నారాయణరావుతో కలిసి 1926లో హైదరాబాదుకు తరలి వచ్చారు. నారాయణరావు హైదరాబాదులో ”ఆంధ్రా బుక్‌ హౌజ్‌” పేరుతో తెలుగు పుస్తకాల దుకాణాన్ని నడిపేవారు. అప్పటినుంచి ఆమె జీవితం ఇక్కడి తెలంగాణా సాంస్కృతిక ఉద్యమాలతో మమేకమైంది.మద్రాసు యూనివర్సిటీ నుండి తెలుగు, సంస్కృత భాషలలో విద్వాన్ డిప్లోమా డిగ్రీలు పొందారు. 1946 నుండి 1956 వరకు సికింద్రాబాదు కీస్ హైస్కూల్లో ఉపాధ్యాయినిగా పనిచేసారు. సీతాకుమారి నిజామాంధ్ర మహాసభలలో చురుకుగా పాల్గొన్నారు. సీతాకుమారి నిజామాంధ్ర మహాసభలలో చురుకుగా పాల్గొన్నారు. ఆంధ్రమహిళా సభలను నిర్వహించారు. మూడవ, పదకొండవ ఆంధ్రమహిళా సభలకు అధ్యక్షతా స్థానాన్ని అలంకరించారు. జాతీయోద్యమ కాలంలో…
Read More
మహదేవ్ దేశాయ్ (భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత)

మహదేవ్ దేశాయ్ (భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత)

మహదేవ్ దేశాయ్ ( 1892 జనవరి 1– 1942 ఆగస్టు 15) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. ఆయన మహాత్మా గాంధీ యొక్క వ్యక్తిగత కార్యదర్శి. ఆయన గాంధీ యొక్క బోస్‌వెల్‌ గా, ప్లాటోగా, సోక్రటీసుగా, బుద్ధగా అభివర్ణింపబడేవారు. మహదేవ్ దేశాయ్ 1892 జనవరి 1 న గుజరాత్ లోని సూరత్ జిల్లాలో సారస్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి హరిభాయి దేశాయ్ ఒక ఉపాధ్యాయుడు. ఆయన తల్లి జన్మాబెన్. జమ్నాబెన్ మహదేవ్ ఏడుసంవత్సరా వయస్సులో మరణించింది. 13 సంవత్సరాల వయసులో మహాదేవ్ దుర్గాబెన్ ను వివాహమాడారు. ఆయన సూరత్ ఉన్నత పాఠశాల, ముంబయిలోని ఎల్ఫిన్‌స్టోన్ కాలేజిలో చదివారు. ఆయన బి.ఎ పట్టభద్రుడు. ఆ తరువాత ఎల్.ఎల్.బి. చేయుటకు వెళ్లారు. మహదేవ్ దేశాయ్ మొదటిసారి 1915 లో గాంధీని కలిసారు. ఆయన వ్రాసిన పుస్తకం (గుజరాతీ అనువాదం చేయబడిఒన జాన్ మోర్లీ రాసిన ఆంగ్ల పుస్తకం "ఆన్ కాంప్రమైజ్") ను…
Read More
అమ్జద్ హైదరాబాదీ(తెలంగాణకు చెందిన ఉర్దూ కవి)

అమ్జద్ హైదరాబాదీ(తెలంగాణకు చెందిన ఉర్దూ కవి)

అమ్జద్ హైదరాబాదీ (అమ్జద్ హుస్సేన్, 1 జనవరి 1888- 31 జనవరి 1961), తెలంగాణకు చెందిన ఉర్దూ, పర్షియన్ రుబాయి కవి. ఉర్దూ కవిత్వంలో అతడిని హకీమ్-అల్-షువారా అని కూడా అంటారు. ఇతని కలంపేరు అమ్జద్ హైదరాబాదీ. అమ్జద్ హైదరాబాదీ 1888, జనవరి 1న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు దక్కన్‌లోని ఒక చిన్న కుటుంబంలో జన్మించాడు. హైదరాబాదు నిజాం పాలనకాలంలో 1908, సెప్టెంబరు 28న మూసీ నదికి వరదలు వచ్చాయి. చింతచెట్టు కొమ్మలకు వేలాడుతూ ప్రాణాలు దక్కించుకున్న 150 మందిలో అమ్జద్ ఒకడు. 1908లో మూసీ నది వరదలో తన కుటుంబం (అమ్జద్ తల్లి, భార్య, కుమార్తె) కొట్టుకుపోగా, అతని కుటుంబంలో అతను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. తరువాత తన బాధను అనుభవాన్ని వివరిస్తూ "ఖయామత్-ఎ-సోఘ్రా" (ది మైనర్ డూమ్స్‌డే) అనే పద్యం రాశాడు. అమ్జద్ రాసిన రుబాయిలో ఎక్కువభాగం అతని కుటుంబాన్ని కోల్పోయిన నిరాశ ప్రతిబింబిస్తుంది. ఆ విషాద…
Read More
సుప్రభాత సుమాంజలి

సుప్రభాత సుమాంజలి

సుప్రభాత సుమాంజలి ✍🏼 ఈ నూతన వత్సరo శుభ, మంగళ , దివ్య, భవ్య శోభలతో .. సుమ గంధాలతో .. చిలకరించిన మకరంద గుబాళింపులతో. . పరిమళ ప్రజ్వలనలతో .. నిత్య నూతననవ యవ్వన ఉషోదయ కాంతుల సమాహారం తో..రమ్య రమణీయ మనోహర వికసిత రంజితమై, సాక్షాత్ ఆ సృష్టి కర్త ఆశీస్సులు మీ వెన్నంటి.. తేజో, తేజోపేత, తేజోమయ ,తేజస్సులు మీహృదయపు అంచును స్పృశిస్తూ.. మిమ్మల్ని స్పర్శిస్తూ.. ఆయురారోగ్య , అష్టైశ్వర్యాలు మీ ఇంటమెండుగా ఆ దేవ దేవుడు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిప్రసాదించాలని నా ముకుళితహస్తాలను జోడిస్తూ… ప్రార్థిస్తూ 👏🏽 మీ కోటేశ్వరరావు ఉప్పాల
Read More
సంతోషాలతో సందేశమా

సంతోషాలతో సందేశమా

సంతోషాలతో సందేశమా…!!! బడాయిలతోనో లడాయిలతోనోమక్కవతో మజాతో గడిచిన రోజులుఆత్మ స్ఫురణకు అర్థమైనా కాకపోయినానీ బతుకుతో నడిచిన సాక్ష్యాధారాలు…!!రంగుదేలుతు పొంగులతో మునిగిపోతూఅద్దమై కనబడినా అడగని సమయాలు…తీపిగుర్తులను మూటగట్టుకు పోతున్నవనివిషాదమా ఒసగిని సంతోషాలతో సందేశమా కాలమో కాలంచెప్పని మౌనమోనాతో నేను చెప్పుకొన్న మనస్సు మాట…తిరిగే నేలకు శ్రీకారంగా వచ్చీపోయేవసంతాలు ఋతువులా రాగాలు నిత్యాలేతప్పని క్షణాలు మనతో ఆస్వాధింపైనా…!!అదే నూతన సంవత్సర శుభాకాంక్షలతోఅందరికి పండగ వాతావరణం కావాలని… గతంతో నేర్చినవన్నీ జ్ఞాపకాలేసుఖదుఃఖాలు మంచిచెడులు అనుభవాలేనీ వంతుగా వర్తమానాన్ని ఒడిసి పట్టుకో…!!కోరికలను కోరింతల జాడ్యాన్ని ఆవలించకుకొలతబడని కోణాలను మెడన దాల్చకు…సమయపాలనకు నీదొక చేయి కావాలనిప్రగతి బాటలను నడపాలని కోరుకొంటూ… కొత్త మలుపొచ్చిందని మత్తులోకంలోఎత్తిన కోటలకు రంగులను పూసుకోనక…కేవలం నీవేకాదు నీతో సమాజముందనిదాని బాగోగులకై నీవు పరితపించాలని…!!మనిషిగా మానవత్వాన్ని మొలిపించాలనివెలుగులా ప్రభవై సారధిగా ప్రయాణమై…భావితరాల సమగ్రతకు సాధికారితలకురూపమై నీ దేశరక్షణకు పహారా కాయాలి… (నూతన సంవత్సర శుభాకాంక్షలతో) దేరంగుల భైరవ (కర్నూలు)9100688396
Read More
అక్షరలిపి

అక్షరలిపి

అక్షరలిపి సంస్ధ వారు2025 సంవత్సరం కొన్నివిజయాలు రుచి చూసారు.భవ్యగారికి 2025 సంవత్సరంలో అంటేఈ సంవత్సరం సన్మానంజరిగింది. భవ్యగారు ఒకపుస్తకం కూడా జయప్రదంగా ప్రచురించారు. మిగతాసభ్యులు కూడా తమరచనల ద్వారా మిగతాసభ్యులను ప్రభావితంచేసారు. కొన్ని అనుకోనిసంఘటనలు కూడాజరిగినా మొత్తానికిఅక్షరలిపి ధైర్యంగాముందడుగు వేస్తోంది.2026 వ సంవత్సరంలోకూడా అక్షరలిపి సంస్ధమరిన్ని విజయాలుసాధిస్తుందనే నమ్మకంఉంది. అందరు సభ్యులుఆయిరారోగ్య ఐశ్వర్యాలతోహాయిగా ఉండాలి అనిఆశిస్తున్నాను. వెంకట భాను ప్రసాద్ చలసాని
Read More