Blog

Your blog category

ఆత్మవిశ్వాసంతో

ఆత్మవిశ్వాసంతో

అక్షర అంతర్జాతీయ మహిళా దినోత్సవం పోటీ కొరకుఅంశం :⁠- నేటి తరం ఆడపిల్లలు వారి మనస్తత్వంతేది:⁠- 01/03/2026శీర్షిక:⁠- ఆత్మవిశ్వాసంతో… చరిత్రలో మహిళలు ఎదుర్కొన్న వివక్ష,అన్యాయాలను గుర్తు చేసుకుంటూ,భవిష్యత్తులో సమాన అవకాశాల సమాజాన్ని నిర్మించాలనే సంకల్పానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది. ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం వరకు మహిళలు కుటుంబం, సమాజం, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. తల్లి, కుమార్తె, భార్య, సోదరి వంటి పాత్రలతోపాటు విద్యార్థిని, ఉపాధ్యాయురాలు, శాస్త్రవేత్త, వైద్యురాలు, కార్మికురాలు, నాయకురాలు వంటి అనేక రూపాల్లో మహిళ తన ప్రతిభను చాటుకుంది. అయినప్పటికీ, అనేక సందర్భాల్లో ఆమెకు సమాన హక్కులు దక్కకపోవడం, విద్య, ఉపాధి, నిర్ణయాధికారం వంటి రంగాల్లో వెనుకబడటం కనిపించింది. ఈ అసమానతలపై చర్చకు వేదికగా నిలిచింది మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం ఉత్సవం మాత్రమే కాదు! అది ఒక ఉద్యమ భావన. మహిళలపై జరుగుతున్న హింస, బాల్య వివాహాలు, లింగ వివక్ష, వేతన అసమానత…
Read More
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026: ‘Give to Gain’ – పంచితే పెరుగుతాం!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026: ‘Give to Gain’ – పంచితే పెరుగుతాం!

ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజు కేవలం శుభాకాంక్షలు చెప్పుకోవడానికి మాత్రమే కాదు – మహిళల సాధనలను గుర్తుచేసుకోవడం, లింగ సమానత్వం కోసం పోరాడటం, వారి హక్కులు, సాధికారతపై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. 2026 థీమ్: Give to Gainఈ ఏడాది థీమ్ చాలా ప్రత్యేకం – "పంచితే పెరుగుతాం!" అని అర్థం. మహిళలు ముందుకు రావాలంటే, విద్య, నైపుణ్యాలు, అవకాశాలు, సపోర్ట్ – ఇవన్నీ పంచాలి. ఒకరు ఇచ్చిన చిన్న సహాయం మరొకరి జీవితాన్ని మార్చగలదు. ఉదాహరణకు: ఒక ఔత్సాహిక మహిళకు చిన్న మొత్తం మద్దతు ఇస్తే ఆమె వ్యాపారం పెరిగి ఎందరికో ఉపాధి కల్పిస్తుంది. యువతికి నైపుణ్య శిక్షణ ఇస్తే ఆమె స్వావలంబన పొందుతుంది. అనుభవసంపన్న మహిళలు తమ జ్ఞానాన్ని షేర్ చేస్తే తరతరాలు బలపడతాయి. ఈ థీమ్ మనకు గుర్తుచేస్తుంది – మహిళల పురోగతి అంటే…
Read More
నేటి తరం ఆడపిల్లలు వారి మనస్తత్వం

నేటి తరం ఆడపిల్లలు వారి మనస్తత్వం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్షర పోటి కొరకు నా రచన అంశం : నేటి తరం ఆడపిల్లలు వారి మనస్తత్వం నేటి ఆడపిల్లలు చాలా బాగా ఆలోచిస్తున్నారు.వారి చదువు, ఉద్యోగం,లాంటి విషయాలలో చాలా క్లారిటీగా ఉంటున్నారు.బాగా చదువుకుంటూ అదే సమయంలో ఏం చదువుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి , ఎలాంటి కోర్సులు చేయాలి వాటి వలన ఎంత మంచి కంపెనీ లో ఉద్యోగం కొట్టాలి అని అహర్నిశలు కష్టపడి చదువుతూ తమ కెరీర్ ను ఎంచుకుంటున్నారు .దానికి తల్లిదండ్రులు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు.వారికి తగిన విధంగా చేసుకునే తమ జీవితాన్ని మలుచుకునే అవకాశాలు ఇస్తున్నారు.మగవారికన్నా ఆడపిల్లలు అన్ని విషయాలలో ముందు ఉంటున్నారు అని అనడంలో సందేహం లేదు. కానీ ఇక్కడే మరొక విషయం కూడా ఉంది అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు కొందరు ఆడపిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛ ను దుర్వినియోగం చేస్తూన్నారు అని అనడంలో కూడా సందేహం…
Read More
పూవులల్లిన రేయి,,,,

పూవులల్లిన రేయి,,,,

ఈ నా జీవితం ఒక కన్నీటి వ్యధవెన్నెల కురిసే నీ ప్రేమ అమృత ధారకలలు పూసిన పూదోటలో రాత్రి పూసే పుష్పానివినీ మోములో ఎవరూ కాంచని నిగూఢ పౌర్ణమి ఆకృతులునీ మనస్సు వెన్నెల దుప్పటి కప్పుకున్న సముద్రంనా హేయమైన కలం నిన్ను స్తుతించలేని అక్షరాలునీవు లేవెందుకోయని గృహం చుట్టూర గుసగుసలాడుతున్న పూవులునీవు లేని రేయి నిప్పులు కురిసే వెన్నెలలుఆకాశంలో నక్షత్రాలను మాలలల్లుతున్న జాబిలి మనకోసంనీ ధ్యాసలో ఎంతకూ తెలవారని రేయినీ చెంత నా దుఃఖిత గాధలన్నీ విప్పాలని తహతహఅదిగో ఆకాశమంతా కూలిపడుతోంది చివరణ మనమిరువరమే మిగిలేది,,,,ఊహల కలలన్నీ ఉరిపోసుకున్నా నా అక్షరాలే నాకు జీవం పోస్తాయిఅగ్నిపుష్పించిన నా జీవితానికి నీ కలం అక్షరాలే సంజీవనీ పుష్పాలుఈ నిద్రలు కరువైన రాత్రులలో నీ అక్షరాలు అనురాగ మల్లియలుఊహల ఉల్లాసంలో తేలియాడే మది పూసిన గీతాలునా మదిలోని అక్షరాలన్నీ అల్లినా ఏదో వెలితి నీవు చదువవేమోయని,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
తార

తార

రేపు ఈ జీవితమనే ఆటలో నేను ఉంటానో లేదో తెలియదు కానీ…..ఆకాశంలో తారల వలే ….ఈ ప్రపంచం సాగిపోతూనే ఉంటుంది …..కాలక్రమేనా నువ్వు వారు నన్ను మర్చిపోయినా …..నా ప్రేమ ,నా స్మృతులు మాత్రం నీలోనే ఒక భాగమే ఎప్పటికీ సజీవంగా ఉంటాయి….……..జననీ
Read More
నేటి మహిళ!

నేటి మహిళ!

ఓ మహిళాతెలుగు వాకిల్లలో కళ్లాపి జల్లిముగ్గులు పెడుతూ తూరుపు తెలవారగాఈ నిలువు దోపిడీ సమాజంలో,,,,,,,!వరి నాట్లల్లో,,,,,కుప్పనూర్పిళ్లలోపత్తి చేలల్లో,,,,,,మిరప తోటల్లోపంట ఏదైనా నీవై!మగవాళ్ళతో సమానంగా దినసరి కూలీవైపనికి సమాన కూలీ పైకం పొందలేకకురిసే బ్రతుకు జడివానలో ముద్దై!ఇక బస్తీల్లో కాలేజీ చదువుల్లో సరస్వతివైఅబ్బాయిల కంటే గొప్పగా చదివిఇంజనీరింగ్,మెడిసిన్,సైన్స్,ఆర్ట్స్ఇది అది అనకుండా అన్ని రంగాలలో మేటివై!గవర్నమెంటు ఉద్యోగాల్లేకప్రయివేటు టీచర్,,,,,,ప్రయివేటు లెక్చరర్సాఫ్టువేరు ఇంజనీర్,,,,,,మెడికల్ ప్రాక్టీషనర్ప్రయివేటు అన్నిరంగాలలో,,,,,,,,,,,,,!ఆడవాళ్లని చూడకుండావెట్టిచాకిరీ చేయించుకునే యాజమన్యంనీ నిస్వార్థ సేవకు అందేది తృణమో ఫణమో!మాయలోళ్ల సినిమాల్లో,టీవీల్లోనిన్ను అసభ్యంగా చూపించే నైజం!వెర్రి మొర్రి కుర్రకారునిన్ను అవమానించి అభాసుపాలు చేస్తే!!?సహనంలో అవణిని మించిన అవణివి!క్రీడల్లో మేటివైదేశ పతాకాన్ని వినువీధిలో ఎగరేశావ్!నాటి భారత కోకిల సరోజినీనాయుడునిన్న మొన్నటి ప్రధాని ఇందిరా ప్రియదర్శినివినీల ఆకాశంలో సేదతీరిన కల్పనా చావ్లాభారతరత్న సంగీత చూడామణీ ఎం ఎస్ సుబ్బలక్ష్మిమహిళా,,,,,,,,భరతమాత సిగాలోఎన్నెన్ని కీర్తి పతాకాలో గదా!!మహిళా,,,,,నీ హృదయ వేణువుకు ఎన్ని గాయాలో గదామహిళా,,,,,ధరిత్రి నిండా నీవే!ఆ వినీల గగనంలో చూడచక్కని చందమామకురిపించే చల్లని…
Read More
క్లారా కెర్న్ బేలిస్(అమెరికన్ రచయిత్రి, విద్యావేత్త)

క్లారా కెర్న్ బేలిస్(అమెరికన్ రచయిత్రి, విద్యావేత్త)

క్లారా కెర్న్ బేలిస్ (మార్చి 5, 1848 - మార్చి 1, 1948) ఒక అమెరికన్ రచయిత్రి మరియు విద్యావేత్త.క్లారా మేరీ కెర్న్ మిచిగాన్‌లోని కలమజూ సమీపంలోని తన కుటుంబ పొలంలో మనస్సే కెర్న్ (1809–1892) మరియు కరోలిన్ హెర్లాన్ కెర్న్ దంపతుల కుమార్తెగా జన్మించారు. ఆమె 1871లో మిచిగాన్‌లోని హిల్స్‌డేల్ కళాశాల నుండి పట్టభద్రురాలైన మొదటి మహిళ . తరువాత ఆమె 1874లో అదే పాఠశాల నుండి మాస్టర్స్ డిగ్రీని పొందింది. బేలిస్ ఇల్లినాయిస్ కాంగ్రెస్ ఆఫ్ మదర్స్ యొక్క విద్యా కమిటీకి అధిపతి. ఆ పాత్రలో, ఆమె అన్ని పిల్లలకు శారీరక శిక్షణ మరియు మాన్యువల్ నైపుణ్యాల అవసరాన్ని నొక్కి చెప్పింది, "ఒక పిల్లవాడు శారీరక శ్రమను నీచంగా మరియు అనాలోచితంగా భావించే విధంగా పెంచబడినప్పుడు, అతను సరైన తీర్పు శక్తిని కోల్పోతాడు; అతను అవాస్తవ ప్రపంచంలో నివసిస్తున్నాడు, అక్కడ అన్ని విషయాలు కల్పిత విలువలను కలిగి ఉంటాయి…
Read More
వెలమల సిమ్మన్న(బహు గ్రంథకర్త, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత, భాషా శాస్త్రవేత్త, విమర్శకులు)

వెలమల సిమ్మన్న(బహు గ్రంథకర్త, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత, భాషా శాస్త్రవేత్త, విమర్శకులు)

ఆచార్య వెలమల సిమ్మన్న బహు గ్రంథకర్త, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత, సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త, ప్రముఖ విమర్శకులు, ఉత్తమ పరిశోధకులు, ఆదర్శ అధ్యపకులు, నిరంతర నిర్విరామ సాహితీ కృషీవలుడు ఆచార్య వెలమల సిమ్మన్న గారు. సిమ్మన్న గారు శ్రీకాకుళం జిల్లా, జాలుమూరు మండలం, తిమడం గ్రామంలో మర్చి 1వ తేది 1955 సం||లో శ్రీమతి వి.ఆరుద్రమ్మ, డాక్టర్ వి. కృష్ణమూర్తి పుణ్య దంపతులకు జన్మించారు. వీరు ప్రాథమిక విద్య, ఉత్తమ విద్య తిమడం గ్రామంలో పూర్తి చేసారు. ఇంటర్ విద్యను నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ, డిగ్రీ విద్యను విజయనగరం ఎం.ఆర్. కళాశాలలోనూ, ఎం.ఎ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోను విద్యను అభ్యసించి, అంతటితో ఆగక డాక్టరేట్ పట్టాను కూడా పొందారు. ఆంధ్ర విశ్వ కళా పరిశాత్తు, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో తెలుగు శాఖలో అధ్యాపక ధర్మం నిర్వహిస్తూ, విద్యార్థుల మస్తిష్క క్షేత్రాల్లో మరువలేని అక్షరబీజాలు వెదజాల్లూతూ, ఉత్తమ ఫలాలు…
Read More
ఖండవల్లి లక్ష్మీరంజనం(సాహిత్యవేత్త, పరిశోధకులు)

ఖండవల్లి లక్ష్మీరంజనం(సాహిత్యవేత్త, పరిశోధకులు)

ఖండవల్లి లక్ష్మీరంజనం (1908 మార్చి 1- 1986 జూన్ 18) సుప్రసిద్ధ సాహిత్యవేత్త, పరిశోధకులు.ఇతను తూర్పు గోదావరి జిల్లా బెల్లంపూడి గ్రామంలోని మాతామహులైన కోరాడ నరసింహులు ఇంటివద్ద 1908 మార్చి 1న జన్మించాడు. సూర్యనారాయణ, సీతమ్మ వీరి తల్లిదండ్రులు. తండ్రి ఉద్యోగ రీత్యా వరంగల్లుకు వచ్చారు. ఇతని మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యలు మట్టెవాడలోను, హనుమకొండలోను పూర్తయ్యాయి. తరువాత ఉన్నత విద్యకై హైదరాబాదు వచ్చి 1928లో నిజాం కళాశాలలో తెలుగు, సంస్కృతం, ప్రాచీన భారత చరిత్రలలో బి.ఎ. పట్టా పొందారు. తరువాత సిటీ కళాశాలలో అధ్యాపకులుగా చేరి 1936లో తెలుగు, సంస్కృతాలలో ఎం.ఎ. పరీక్షలో మద్రాసు ప్రెసిడెన్సీలో సర్వ ప్రథములుగా ఉత్తీర్ణులయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అధ్యాపకులుగా చేరి, తరువాత 1946లో ఆ శాఖకు అధ్యక్షులై, 1964లో పదవీ విరమణ చేశారు. ఇతని కాలంలో తెలుగు శాఖ బాగా అభివృద్ధి చెంది, తెలుగు ఎం.ఎ. చదివే విద్యార్ధుల సంఖ్య పెరిగి,…
Read More
కాశీ యాత్ర ( పదవ రోజు )

కాశీ యాత్ర ( పదవ రోజు )

తేది 01 -3 -2025 శనివారం .ఉదయమే లేచి అందరం వేడనీళ్ళ స్నానాలు చేసి లగేజీలన్ని సర్దుకున్నాము. గాయపడ్డ గోవిందమ్మ గారి కాలి నొప్పి చాలావరకు తగ్గిపోయినది.ఊతకర్ర సాయంతో మంచిగా నడువగలుగతున్నది. 12 గం.లకు తిరుపతి అన్నసత్రమునకు వీడ్కోలు పలుకుతూ హరిహర మహదేవ శంభో శంకర. జై గణేశ్ మహారాజ్ కీ జై అనుకుంటూ బయటకు వచ్చాము అప్పటికి ప్రారంభ స్టేషన్ " ఆరా " నుండి మా ట్రైన్ బయలు దేరిందని లీడరు వీరభద్రం గారు తెలిపారు. ఆటోలలో లగేజీలన్ని సర్దుకొని కాశీ స్టేషన్ కు బయలుదేరాము. స్టేషన్ లోనే అన్నం పార్సల్స్ తెప్పించుకొని అందరం భోజనాలు చేశాము. 4-30 కావస్తున్నది 1 వ నం. ప్లాట్ ఫారమునకు రైలు రాబోతుందని అనౌన్స్ చేస్తున్నారు. 5 గం.లకు రైలు వచ్చింది.మా రిజర్వేషన్ భోగీలలో లగేజీలతో జాగ్రత్తగా ఎక్కాము.తెల్లవారి అనగా మార్చి 2 వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గం.లకు…
Read More