b radhika story

బంధం

బంధం సృష్టిలో ప్రతీ ప్రాణికి  ఏదో రూపంలో, ఎవరితో ఒకరితో బంధం ఏర్పడుతుంది. అన్ని ప్రాణులకన్నా, మానవ జన్మకు ఎక్కువ బంధాలు కలిగి వున్నాయి. మనిషి ప్రకృతితో, పశువులతో, పక్షులతో,  మనుషులతో, జంతువులతో, జలచరాలతో కూడా బంధం ఏర్పరచుకున్నాడు. కానీ, మనిషికి అంత్యంత అమూల్యమైన బంధమైన తనతో తాను బంధం చేసుకోవడంలో నేటి మానవుడు విఫలమవుతున్నాడు. మనిషిగా అన్నీ బంధాలతో అన్యోన్యంగా వుండే ముందు, తన అంతరంగంతో, తన ఆత్మతో బంధం ఏర్పరచుకోవాలి. అప్పుడే, మానవుడు ఎన్ని బంధాలనైనా కలుపోగలుగుతాడు. కలిసి జీవించగలుగుతాడు.  స్వార్ధానికి చోటు లేని, త్యాగానికి చిరునామాగా నిలిచి, వాస్తవంలో బతకాలనే ఆలోచనలతో, పరిస్థితులను సానుకూల దృక్పథంతో తీసుకునే బాధ్యత గలిన వ్యక్తులు, తనతో తాను బంధం కలిగిన మనసున్న మనుషులు తృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. -బి రాధిక
Read More

సంక్రాంతి జ్ఞాపకాలు

సంక్రాంతి జ్ఞాపకాలు నాన్నగారు సెంట్రల్ గవర్నమెంటులో యువకులకు ప్రత్యేకంగా హ్యుమానిటీస్ విభాగంలో పని చెయ్యటం వల్ల జనవరి 12న స్వామి వివేకానంద వారి పుట్టినరోజు వేడుకలు జిల్లాలో కొన్నిప్రాంతాల్లో పాల్గొని భోగి రేపనగా సాయంత్రానికి అమ్మమ్మ ఇంటికి చేరేవాళ్ళం. కబుర్లతో అర్ధరాత్రి దాటి పోయేది. తెల్లారితే భోగి, తెల్లారుజాము నాలుగు అవుతుంటేనే, అందరినీ నిద్ర లేపేసేవారు. వేడినీళ్ళు, కుంకుడికాయలతో తలస్నానం. స్నానానలు అయ్యాక పొయ్యలో బూడిద, విభూదిలాగ బొట్టు పెట్టుకునే వాళ్ళం. అప్పటికే పెద్దమ్మవాళ్ళ అమ్మాయిలు (అక్కలు) మాకోసం భోగి పిడకలు చేసి వుంచేవారు. ఇంటికి, నాలుగిళ్ళలవతల వినాయకుడి గుడి ముందు భోగి మంట వేసేవారు. అక్కడికి వెళ్ళి వేసేవాళ్ళం. అమ్మమ్మ సున్నుండలు, పాకుండలు, అరిసెలు జాడిల్లో సర్ది వుంచేది. స్నానం, బొట్టు పెట్టుకున్నాక పిండివంటలు తినేవాళ్ళం. పెసరపప్పు వేసి పులగం చేసేవారు. బెల్లం, నెయ్యి, పచ్చి పులుసుతో తినేవాళ్ళం ముగ్గులు అక్కలు వేస్తే, చూసే వాళ్ళం. సంక్రాంతి రెండో రోజు పెద్ద పండగ. ఆరోజు…
Read More