ఎవరు పార్ట్ 12
ఎవరు పార్ట్ 12 కనుమూరి “అసలు ఎం జరిగింది? కాస్త వివరంగా చెప్పండి.” పోతన వివరించటం మొదలు పెట్టారు “నారాయణ భూపతి గారు చనిపోయిన తర్వాత, ఆయన పెద్ద కుమారుడు ముక్తానంద భూపతి ఎస్టేట్ చూసుకోవటానికి వచ్చారు. ఆయన వచ్చి ఇక్కడ పద్ధతులు చాలా మార్చారు. భూపతిగా కాకుండా మాములు మనిషిగా అందరితో కలిసి ఉండటం, అడిగిన వారికీ సాయం చేయటం, అప్పటి వరకు భూపతి సైన్యంగా ఉండే కాపలా జనాలని, తన వాటాలో పొలాలు దానం చేసి రైతులను చేయటం, ఇలా చాలానే చేసారు.. వచ్చిన వారంలోనే ఊరిలో ఉత్సాహం, సంతోషం నింపారు. కానీ ఆయనను, వాళ్ళ తండ్రి గారు ఒక అమ్మాయిని తీస్కుని వచ్చారు అనే అపవాదు తీవ్రంగా కలత చెందేలా చేసింది. ఒక రోజు కంగారుగా అతిధి గృహం లోకి వచ్చి నాతో.... “పోతన, తండ్రి గారు పెద్ద తప్పే చేసారు. ఆ అడివి జాతి అమూల్యంగా…