raheempasha

జనగణమన

జనగణమన స్వాతంత్ర్యమా నీవెక్కడ స్వారాజ్యమా నీ జాడెక్కడ ఆకాశమంత వెతికి వెతికి వేసారాను..... లోకమంతా కాళ్ళు అరిగేలా తిరిగాను..... కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశాను..... ఎక్కడ చూసిన హింసే ఎటు చూసిన అసత్యమే ఎంత వెతికిన అదర్మమే అన్యాయమే..... చెడు చూడకు చెడు వినకు చెడు కనకు అనేవి చెప్పుకోవడానికే మిగిలాయి..... కాని నేడు సమాజం చెడు చూస్తోంది చెడు వింటోంది చెడు కంటోంది హత్యలు అత్యాచారాలు అన్యాయాలు అవినీతులు దోపిడీలు కుల చిచ్చులు మత ఉచ్చులు మరణ శాశనాలు మారణ హోమాలు ఆడది అర్థరాత్రి నడి రోడ్డు పై ఒంటరిగా సంచరించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యమని నీవు చెప్పిన మాటలు ... నీటి మీద రాతల్లా మిగిలాయి అహింసతో తెచ్చి పెట్టిన స్వాతంత్య్రం.... ఉప్పుసత్యగ్రహం చేపట్టి సాధించిన స్వరాజ్యం.... నేడు కానరావడం లేదు ఓ మహాత్మా..... మీ కల ఛిద్రమైంది మీ కాంక్ష వసివాడింది మీ ఆశయం మసక బారింది మూడు…
Read More

త్రివర్ణం

త్రివర్ణం దివినుండి భువికి దిగివచ్చిన ధ్రువతారలో నిరంతరం ప్రకాశించే సూర్యచంద్రులో ఏ కఠోర శ్రమలో ఈ మట్టిలో వెలసిన పరిమళాలో దేవుడు పంపిన ఆయుధాలో ఉద్యమ వీరులో ఉదయ కిరణాలో భారత మాత ముద్దు బిడ్డలో భారత మాత ఉక్కు పిడికిళ్లో మహనీయులో త్యాగమూర్తులో సామాన్యులో అనితర సాధ్యులో పోరాట వీరులో గెలుపు బాటలో దేశం కోసం దేశ స్వాతంత్య్రం కోసం స్వతంత్ర పోరాటంలో పోరాడి రక్తం చిందించి అశువులు బాసి తెల్ల దొరల నుండి విముక్తి కల్పించి దేశానికి స్వాత్రంత్ర్యాన్ని అందించారు దేశ నడిబొడ్డున ఎర్రకోట పై త్రివర్ణ పతాకమై ఎగిరారు భూగోళమంతా చరిత వినిపించేలా ధ్వనింపచేశారు విశ్వమంతా విజయాన్ని ఎలుగెత్తి చాటారు ప్రాణాలను పనంగాపెట్టి రక్తాన్ని ధారపోసి హింసను పాతిపెట్టి అహింసను బయటకు తీసి స్వతంత్రాన్ని సాధించారు త్రివర్ణ జెండాను ఎగరవేశారు ప్రతి భారతీయుని గుండెలో కొలువై ఉన్నారు ఏడుపదులు దాటిన పండుగ దేశమంతా వేడుకై మెరువగా నేల…
Read More

ప్రశ్నించిన కలం

ప్రశ్నించిన కలం ఆకాశాన్ని కాగితంలా మలుచుకుని..... నిత్యం కష్టించే పేదల కష్టాన్ని..... శ్రామికుల చెమట చుక్కలను..... ఇంకులా చేసుకుని.... పెన్నును గన్నుగా.... అక్షరాలను తూటాలా మార్చుకుని.... పేద వారిపై, కర్షకుల పై, శ్రామికుల పై..... జరుగుతున్న దోపిడీని తన కవిత్వంతో ప్రశ్నించి..... ఘోరాలను ఎదిరించగ ముందుకు అడుగేసి.... బలహీన వర్గాలలో చైతన్యం కలిగించి.... వారిని తనతో కదిలించి..... అడుగడుగునా నేనున్నానంటూ.... కదం తొక్కి... మార్పు దిశగా నిరంతరం పయనించిన అక్షర సూరీడు.... ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజాకవి... సాహిత్య లోకానికి మార్గదర్శకుడిగా నిలిచిన.... మహా కవి.... శ్రీ శ్రీ - రహీంపాషా
Read More