విధి
విధి సంక్రాంతి సెలవులకు సుకన్య హాస్టల్ నుండి ఇంటికి వచ్చింది. ఒకరోజు తన స్నేహితులతో కలిసి చెరువు గట్టు చూడడానికి వెళ్తుంది... తిరిగి వచ్చేటప్పటికి అమ్మమ్మ విచారంగా పెరట్లో కూర్చొనుంటుంది. అమ్మ వంటింట్లో వంట చేస్తూ వుంటుంది. "ఏమిటి గలగల మాట్లాడే అమ్మమ్మ ఈరోజు ఇంత విచారంగా వుంది అనుకుంటూ, ఏమే ముసలి మీ ఆయన గుర్తొచ్చాడా? అలా ఉన్నావు" అని అంటుంది ముందు నీకు పెళ్లి చేయాలి సుకన్య అంటూ వంటింట్లో నుంచి అమ్మ పకోడీలు తీసుకొచ్చింది. వాటిని తింటూ అమ్మమ్మా కరోనా సమయంలో మన పక్కింటి కానిస్టేబుల్ సుబ్బయ్య వారి కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. పాపం ఆ పసిబిడ్డలు ఎలా ఉన్నారో అంటుంది. అవును! ఆ పిల్లలు ఎక్కడున్నారు అమ్మమ్మా. అసలు ఆ కానిస్టేబుల్ నర్సాపురం స్టేషన్లో పనిచేసేటపుడు ఒక్కరోజు కూడా డ్యూటీ కి సెలవు వేసేవాడు కాదు, ఎవరికి ఏ హానీ చేసేవాడు కాదు. సుబ్బయ్య…