Month: February 2026

అట్లూరి పుండరీకాక్షయ్య

అట్లూరి పుండరీకాక్షయ్య

అట్లూరి పుండరీకాక్షయ్య అట్లూరి పుండరీకాక్షయ్య (ఆగష్టు 19, 1925 - ఫిబ్రవరి 2, 2012), తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. ఎన్.టి.ఆర్ తో కలిసి "నేషనల్ ఆర్ట్ థియేటర్" స్థాపించి నాటకాలు వేసిన అనుభవం ఆయనకుంది. మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన, మా వారి మంచితనం లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. మహమ్మద్ రఫీని తెలుగు శ్రోతలకు దగ్గరైంది ఈయన సినిమాల ద్వారానే. కర్తవ్యం సినిమాలో విలన్ గా నటుడిగా తెరమీదకు వచ్చాడు. ఆయన కృష్ణా జిల్లా కైకలూరు దగ్గరున్న మెకాసా కలవపూడిలో ఆగస్టు 19, 1925లో పుట్టాడు. ఐదవ తరగతి వరకు అక్కడే చదివాడు. తరువాత వాళ్ళ తండ్రి బెజవాడకు మకాం మార్చడంతో నాన్నకు సహాయంగా ఉండాలని 8వ తరగతితో చదువు ఆపేశాడు. ప్రహ్లాద సినిమాలో మొట్టమొదటిసారిగా నటించాడు. తరువాత వాళ్ళ మామయ్య రైస్ మిల్లులో అకౌంట్లను చూసే పనిలో కుదురుకుని అప్పుడప్పుడు నాటకాలు…
Read More
ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి

ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి

ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి (1860-1916) ప్రముఖ కవి, పండితులు. వీరు ఆరామద్రావిడ శాఖీయులు, ఆశ్వలాయన సూత్రులు, ఆత్రేయస గోత్రులు. వీరి జన్మస్థానము:కాకరపర్రు (తణుకు తాలూకా), నివాసస్థానము:ఖండవల్లి. రాజమహేంద్రవరమున నుద్యోగము. వీరి తల్లి: వేంకమాంబ. తండ్రి: వేంకటశాస్త్రి. జననము: 1860 సం. నిర్యాణము: 2-2-1916 స. వ్యాసమూర్తి శాస్త్రి గారు కాకరపర్రు గ్రామంలో తన మాతామహుల ఇంట సౌమ్య నామ సంవత్సరం సా.శ.1860లో ఒక శుభముహూర్తాన ఆకుండి వేంకటశాస్త్రి, వేంకమాంబ దంపతులకు జన్మించారు. వీరు తమ తండ్రి వద్ద అమరము, ఆంధ్రనామ సంగ్రహము, రఘువంశము, భట్టి కావ్యము, వరదరాజుల లఘు కౌముది మొదలైన గ్రంథాలను చదివారు. వేదుల సోమనాథశాస్త్రి వద్ద నాటకాలంకార సాహిత్య గ్రంథాలను చదివారు. ఆణివిళ్ల శంభుశాస్త్రి వద్ద కారికావళి, ముక్తావళులను అభ్యసించారు. నివటూరి సోమనాథశాస్త్రి దగ్గర సిద్ధాంత కౌముది, తత్త్వ బోధినులను; ఆదిభట్ట రామమూర్తి శాస్త్రి వద్ద ఉపనిషత్ భాష్యాన్ని, బ్రహ్మసూత్ర భాష్యాన్ని, ఆనందగిరిని, రామానంద…
Read More
జె.భాగ్యలక్ష్మి

జె.భాగ్యలక్ష్మి

జె.భాగ్యలక్ష్మి జె.భాగ్యలక్ష్మి ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి. ఈమె చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 ఫిబ్రవరి 2 న జన్మించింది. దేశ రాజధాని ఢిల్లీలో స్థిరపడింది. ఈమె ఆంగ్లసాహిత్యం అధ్యయనం చేసి కమ్యూనికేషన్‌లో శిక్షణ పొందింది. అడ్వాన్స్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ రిలేషన్స్, బుక్ పబ్లిషింగ్ విషయాలలో దేశ విదేశాల డిప్లొమాలను సంపాదించింది. జర్నలిస్టుగా పేరుపొందింది. ఈమె ఇండియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీస్ (ఐ.ఐ.ఎస్) ఆఫీసరుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలో మీడియా డైరెక్టరుగా, కేంద్ర సమాచార,ప్రచార మంత్రిత్వశాఖ వారి పత్రిక యోజనకు ఛీఫ్ ఎడిటర్‌గా, పబ్లికేషన్స్ డివిజన్ ఎడిటర్‌గా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్‌కమ్యూనికేషన్స్ ప్రచురణల శాఖకు అధిపతిగా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా వివిధ హోదాలలో పనిచేసింది. ఇండియన్ అండ్ ఫారిన్ రివ్యూ, కమ్యూనికేటర్ వంటి పత్రికలకు సంపాదకురాలిగా పనిచేసింది. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, మీడియా సలహాదారుగా, మాస్ కమ్యూనికేషన్ సంస్థలలో గెస్ట్ ఫాకల్టీగా పనిచేస్తోంది. ఈమె ప్రభుత్వ పత్రినిధిగా, జర్నలిస్టుగా వివిధ…
Read More
ఎస్. వి. రామారావు

ఎస్. వి. రామారావు

ఎస్. వి. రామారావు ఎస్. వి. రామారావు ప్రముఖ తెలుగు సినీ రచయిత.(02 ఫిబ్రవరి 1940) ఎస్. వి. రామారావు తెలుగు సినిమా చరిత్రకారుడు. ఎస్.వి.రామారావు ఫిబ్రవరి 2 1940 న కామేశ్వరమ్మ, చంద్రమౌళి దంపతులకు జన్మించారు. తండ్రి ఉద్యోగి, రంగస్థల నటుడు.తండ్రి ద్వారా నాటకరంగం పట్ల ఆసక్తిని అందుపుచ్చుకున్న ఆయన ఉన్నత పాఠశాలలో ఉండగానే "తారుమారు" అనే నాటకాన్ని రచించి, స్కూల్ మేట్స్ తో కలసి ప్రదర్శించారు.అప్పటి నుండి నాటకం ఆయన జీవితంలో ఒక భాగంగా మారింది.చిన్నతనంలో తన తల్లి కామేశ్వరమ్మతోపాటు సినిమాలు చూసేవారు. ఊహ వచ్చినప్పటి నుండి ఆ సినిమా కథ, కథనం పాత్రల చిత్రీకరణ పై చర్చించేవారు. ఆ విధంగా ఆయనకు నాటకం, సినిమా రెండు కళ్ళులా మారాయి. 1960 సంవత్సరంలో ఏలూరు సర్ సి.ఆర్.రెడ్డి కళాశాల నుండి పట్టా పొందారు. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ, మురళీమోహన్, క్రాంతి కుమార్ వంటి సినిమా నటులు ఆయన…
Read More
కుష్వంత్ సింగ్

కుష్వంత్ సింగ్

కుష్వంత్ సింగ్ కుష్వంత్ సింగ్ (ఫిబ్రవరి 2 1915 – మార్చి 20 2014) భారతీయ రచయిత, న్యాయవాది, రాజకీయవేత్త, జర్నలిస్టు.ఇండో-ఆగ్లియన్ రచయితగా కుష్వంత్ సింగ్ విశిష్ట లౌకిక వాదిగా సుపరిచితులు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరుగుతున్న సమయంలో వాటి నుంచి తప్పించుకునేందుకు భారతీయ వీఐపీలకు పోలీసులు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు సూచించారు. కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని చెప్పారు. సిక్కుల చరిత్ర, సాహిత్యం లాంటి అనేక అంశాలపై అద్భుతమైన రచనలు చేసిన కుష్వంత్ సింగ్, సునిశితమైన హాస్యానికి పెట్టింది పేరు. తన హాస్యం, కవిత్వం పై ప్రేమ మూలంగా ఆయన యోగన పత్రికకు సంపాదకులుగానూ, "ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా", "ద నేషనల్ హెరాల్డ్",, "హిందూస్థాన్ టైమ్స్" లకు సంపాదకత్వం వహించారు. కుష్వంత్ సింగ్ పంజాబ్‌లో స్వర్ణ దేవాలయంనుంచి తిరుగుబాటుకు నాయకత్వం వహించిన జర్నేల్ సింగ్ భిందర్‌వాలేను తన రచనలతో నేరుగా ఢీకొన్నప్పటికీ 1984లో ఆపరేషన్…
Read More
కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి

కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి

కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి (1863 ఫిబ్రవరి 2 - 1940 అక్టోబరు 29) తెలుగు రచయిత, పాత్రికేయుడు. తెలంగాణ్యబ్రాహ్మణులు. గౌతమసగోత్రులు, ఆపస్తంబసూత్రులు. వీరి తండ్రి: బ్రహ్మావధాని, తల్లి: సుబ్బమ్మ. వీరు తూర్పు గోదావరి మండలం లోని పలివెల గ్రామంలో ఫిబ్రవరి 2, 1863లో జన్మించారు. ఎక్కువకాలం కాకినాడలో గడిపారు. 1883 లో బ్రహ్మయ్య శాస్త్రి గారు ‘’ఆర్యమతబోధిని‘’ అనే సభను స్థాపించి కాకినాడలో ప్రసిద్ధ వ్యక్తులైనారు. కృత్తివెంటి పేర్రాజు, నాళం పద్మనాభం మొదలైన పెద్దలు శాస్త్రి గారి మతాభిమానానికి కార్యదీక్షకు మెచ్చి చేయూతనిచ్చారు. ఈ సభకు అనుబంధంగా ‘’వివేకానంద పుస్తక భాండాగారం‘’ అనే గ్రంథాలయన్నీ స్థాపించారు. మొదట్లో జగన్నాధపురం లో ఉన్న ఈ లైబ్రరీని ఆ తర్వాతి కాలంలో పెద్దవీధిలో ఉన్న ‘’పురం వారి సత్రం’’ లోకి మార్చారు. కుర్చీలు బల్లలు సేకరించి ఉపయోగించారు. సుమారు 15 వార్తాపత్రికలను తెప్పించేవారు. ఇక్కడే శాస్త్రిగారు హిందూమతం పై గొప్ప ఉపన్యాసాలిచ్చేవారు. ప్రసిద్ధులను…
Read More
జీవితం చెరల సాలోచనలు

జీవితం చెరల సాలోచనలు

జీవితం చెరల సాలోచనలు ఎగదన్నుకొస్తున్న సుదీర్ఘమైన ఆలోచనలుఅలసిపోయిన జీవితం ఆఖరు పోరాటం దాకానును వెచ్చని కౌగిలిలో నాలో నేను ముడుచుకుంటూపొగలు చిమ్ముతూ ఆలోచనలు నన్ను ఎగాదిగా చూస్తూవయస్సు ముదిరిన యవ్వనం మనస్సు లోయల్లోకి తొంగిచూస్తూ బావురుమంటూ,,,,,,ఆలోచనల వయస్సు పెరుగుతూ మనస్సు ముడుచుకుపోతూ ఏది శాశ్వతం చివరకు,,,,,,అనుభవాల సంద్రంలో ఆలోచనలు చెరల కెరటాలు ఎగిసిఎగిసి అలసిసొలసి ఆగిపోతున్న అలజడులు జీవితం పొరలు,,,,,,నింగిదాకా నిలువెత్తు గాయాలు జాలిగా కన్నీళ్లు దిగమింగుకుని ఓదార్చుకుంటూ నిద్రిస్తున్నాయి,,,,,,కల్లలైన కలలు నిప్పుల సెగలు కాలం గుండెల్లో కన్నీళ్లు ఒలికి ఆరిపోతూ ఆగిపోయేదెప్పుడో,,,,,,,నడివయస్సు నట్టేటిపై పడవకు రంధ్రం చూడక మునిగిపోతూ అనుభవాల గుణపాఠంతో అప్రమత్తమయినా తీరం చేరుకుంటానా,,,, ఏమో !!ఆశలు అడియాశలైన జీవితం కొట్టుకుపోతూ ఈ అరవైలో రోగాల రొంపి మాత్రలు ముల్లెలైన వైద్యుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ జీవితం కొనసాగింపులో జవాబీదారుని నేనే,,,,,,,కోరలు తెరుచుకున్న చరవాణిపై అక్షరాలు నింపుకున్న వేలుతో సున్నితంగా మీటుతూ జీవితం చెరల దృశ్యాలను అక్షరీకరిస్తున్నా నీ…
Read More
నీ ప్రేమతో నిండిన హృదయం

నీ ప్రేమతో నిండిన హృదయం

నీ ప్రేమతో నిండిన హృదయం నా ప్రియమైనవాడా…! నా హృదయం మళ్లీ నీ జ్ఞాపకాలతో నిండిపోతుంది. సాయంకాలపు నారింజ రంగు ఆకాశం, దూరంగా నిలిచిన చెట్టు, నిశ్శబ్దంగా ఒదిగిపోయిన ఇద్దరి రూపాలు , అన్నీ కలసి మన ప్రేమకథను చెప్పుతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ దృశ్యంలో కనిపించే ఆ ఇద్దరూ మనమేనేమో అని ఒక్క క్షణం అనిపించింది. కాలం ఆగిపోయి, ప్రపంచం మన చుట్టూ మాయమైపోయినట్టు ఉంది. నిన్ను తొలిసారి చూసిన రోజు ఇంకా గుర్తుంది. అప్పటి నుంచి నా జీవితానికి ఒక అర్థం వచ్చింది. నీ నవ్వు నా ఉదయాన్ని వెలిగించింది, నీ మాట నా మనసుకు ధైర్యం ఇచ్చింది.ఆకాశంలా నా హృదయం కూడా నీ ప్రేమతో రంగులద్దుకుంది. నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు నాకు భయం తెలియదు, ఒంటరితనం తెలియదు. నీ కౌగిలిలో ఉంటే ఈ లోకంలోని బాధలన్నీ దూరమైపోతాయి. ఒకరినొకరు హత్తుకున్న విధానం చూస్తుంటే మన మధ్య ఉన్న అనుబంధం…
Read More
విస్లావా సింబోర్స్‌కా (కవయిత్రి, అనువాదకురాలు. నోబెల్ బహుమతి గ్రహీత)

విస్లావా సింబోర్స్‌కా (కవయిత్రి, అనువాదకురాలు. నోబెల్ బహుమతి గ్రహీత)

విస్లావా సింబోర్స్‌కా (కవయిత్రి, అనువాదకురాలు. నోబెల్ బహుమతి గ్రహీత) మరియా విస్లావా అన్నా స్జింబోర్స్కా(2 జూలై 1923 – 1 ఫిబ్రవరి 2012) ఒక పోలిష్ కవయిత్రి, వ్యాసకర్త, అనువాదకురాలు మరియు 1996 సాహిత్య నోబెల్ బహుమతి గ్రహీత. ప్రోవెంట్ (ఇప్పుడు పశ్చిమ-మధ్య పోలాండ్‌లోని కోర్నిక్‌లో భాగం )లో జన్మించిన ఆమె తన జీవితాంతం వరకు క్రాకోవ్‌లో నివసించింది. పోలాండ్‌లో, స్జింబోర్స్కా పుస్తకాలు ప్రముఖ గద్య రచయితలతో పోటీ పడుతూ అమ్మకాలను చేరుకున్నాయి, అయినప్పటికీ ఆమె "సమ్ లైక్ పోయెట్రీ" ("నీక్టోర్జీ లుబియా పోయెజ్జె") అనే కవితను రాసింది, అది "బహుశా" వెయ్యి మందిలో ఇద్దరు కవిత్వాన్ని ఇష్టపడతారు. "మానవ వాస్తవికత యొక్క శకలాలుగా చారిత్రక మరియు జీవ సందర్భాన్ని వెలుగులోకి తీసుకురావడానికి వ్యంగ్య ఖచ్చితత్వంతో అనుమతించే కవిత్వానికి" స్జింబోర్స్కాకు 1996 సాహిత్య నోబెల్ బహుమతి లభించింది. ఫలితంగా ఆమె అంతర్జాతీయంగా బాగా ప్రసిద్ధి చెందింది. ఆమె రచనలు అనేక యూరోపియన్…
Read More
వెల్చేరు నారాయణరావు (తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు)

వెల్చేరు నారాయణరావు (తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు)

వెల్చేరు నారాయణరావు (తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు) వెల్చేరు నారాయణరావు ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు. బ్రిటిషు యుగంలో భారతీయ సాహిత్యం, ముఖ్యంగా తెలుగు సాహిత్యం పాశ్చాత్య సాహిత్య పరిశోధన వల్ల ఎలాంటి ప్రథలకు లోనైందో పరిశోధించి సమగ్రమైన అధ్యయనంతో ఆ లోపాలను సరిచేసే ప్రయత్నాలు చేస్తున్న విశిష్ట పరిశోధకుడు. ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో బి.ఎ., ఆంధ్రవిశ్వకళా పరిషత్తులో ఎం.ఎ. పూర్తిచేసిన అనంతరం వెల్చేరు నారాయణరావు 1970లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లింగ్విస్టిక్స్ లో డిప్లొమా అందుకున్నాడు. అనంతరం 1971లో అమెరికాలోని విస్కామన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ లో ఉపన్యాసకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. 1974లో ఆంధ్రవిశ్వకళాపరిషత్తు నుంచి తెలుగులో కవితా విప్లవాల స్వరూపం అంశంపై చేసిన పరిశోధనకు గాను పి.హెచ్.డి. పట్టా అందుకున్నాకా విస్కామన్సిన్ విశ్వవిద్యాలయంలోనే 1975లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, 1981లో అసోసియేట్ ప్రొఫెసర్ గా అనంతరం…
Read More