విధి లిఖితం!
విధి లిఖితం! మనమొకటి తలిస్తే.. భగవంతుడు మరొకటి తలుస్తాడట.. దానినే విధి లిఖితం అంటారు.. సరిగ్గా అలాంటి సంఘటనే ఓ ఊరిలో జరిగింది.. కాలుష్యానికి దూరంగా.. ప్రకృతి అందాలకు నిలయంగా.. చుట్టూ పచ్చని పంటచేలు.. కమ్మని మట్టివాసనతో.. ఆ ఊరు నిజంగా పేరుకు తగ్గట్టుగానే చిన్నపాటి 'రామ'రాజ్యం. ఎన్నికలప్పుడు తప్ప ఇక్కడ రాజకీయ పార్టీలు కనపడవు.. కులాలు.. మతాల ప్రసక్తే రాదు. ఉన్నంతలో కలిసిమెలసి, ఒకరికొకరంటూ ఊరంతా ఒకే కుటుంబంగా బతుకుతుంటారు. అలాంటి మంచి మనుషులున్న ఆ ఊరిలో ఓ భూ స్వామి ఉన్నాడు. రాముడిలా ఆ పల్లె ప్రజలకు అండగా ఉండేవాడు.. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉన్నా.. ఇసుమంతైనా ఆ దర్పాన్ని ప్రదర్శించడు.. ఊరంతా అతని వెంట ఉన్నా అ పొగరును నెత్తికెక్కించుకోలేదు. పూరి గుడిసె నుంచి డాబా ఇల్లు వరకూ అందులో ఉన్నవారెవరైనా ఆయనకు ఆయన భార్యకు సమానమే.. ఎవరు ఏ శుభకార్యానికి పిలిచినా ఇద్దరూ…