ఆత్మచిత్రం – డా.కేదారనాధ్ సింగ్ కవితలు
ఆత్మచిత్రం - డా.కేదారనాధ్ సింగ్ కవితలు ఒక కవి ఆత్మను పట్టుకోవాలంటే అతని అక్షరాలే కాదు, అతని తిరుగాడిన నేల పరిమళం, నడయాడిన మనుషుల వాసన కూడా ముఖ్యం. అప్పుడు కానీ ఆ కవి అవగతం కాడు. సరిగ్గా కిల్లాడ సత్యనారాయణ గారు ఆ పనిచేశారు. సుప్రసిద్థ హిందీ కవి, జ్ఞానపీఠాన్నందుకున్న డా.కేదారనాథ్ సింగ్ కవిత్వం ఆయన్ని కుదురుగా కూచోనివలేదు. ఉత్తరప్రదేశ్ లోని వారి స్వగ్రామం చకియా దర్శించేలా చేసింది. ఆయన పేరు చెబితే చాలు ఆ గ్రామ పులకించిపోవటం చూశారు. అలా కేదారనాథ్ సింగ్ సాహిత్యం మొత్తాన్ని ఆవాహన చేసుకున్నారు.. కేదారనాథ్ కవిత్వంలోని మనుషులను, మూగజీవాలను గుర్తుపట్టారు.ఆయనకు భోజ్ పురి భాషంటే ప్రాణమని గుర్తించారు. హిందీ నా దేశం భోజ్ పురి నా ఇల్లు ఇంటినుండి బయటకి వస్తే దేశంలోకి వెళ్లి పోతాను "మాతృభాష" కవితలో ఆయన పంక్తులు గుర్తు చేస్తారు. కేదారనాథ్ సింగ్ కవిత్వం లోంచి వంద రసగుళికలను…