aksharalipi gods and devotion

సాయి చరితము 

సాయి చరితము  పల్లవి మావెంటే ఉండు సాయి మా సర్వము నీవే సాయి మాదైవము నీవే సాయి తనివితీరని రూపము నీది సాయి చరణం మా గమనములోన గగనము నీవేనయ్యా బతుకే గండము అని భావిస్తే అండగ తోడుంటావు తోబుట్టువుగా వెంటే ఉండే మమతల కోవెల నీవు నీ నామమునే నిత్యము తలచి ధన్యులమైతిమి మేము చరణం నీ చరితమునే చదివిన మాకు సంతసమంతా కొలువైయుండును నీ దర్శనమే చేసిన చాలును ఊపిరాడని క్షణములు తొలుగును వేడుకచేసే ఉదయకిరణములు వెంటే వచ్చును సాయి చీకటినిండిన జీవితమ్మున వెన్నెల సోనలు కురియును కాదా సాయి - సి.యస్.రాంబాబు
Read More

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి ఎంతగ వేడితే అంతటి కరుణను చూపేవాడవు నీవు నమ్మకముంటే దారిని చూపే స్వామివి నీవే కాదా చరణం బాటను విడచి బాధ్యత మరచి ఐహిక సుఖమే ఒకటే చాలని తలచితిమయ్యా తప్పేనయ్యా తప్పదు నీకు మార్గము చూపగ చరణం తనివేతీరదు ఆకలి ఉండదు నిను దర్శించిన మాకు నీ నామముతో బతుకే మారును నీ చిరునవ్వును ఎదలో నింపి సాగెదమయ్యా మేము చరణం బంధాలన్నీ ఛేదించుకుని నిను వెతికెదము మేము సాయము చేసి మార్గము చూపి కరుణించవయా స్వామి - సీ.యస్.రాంబాబు
Read More

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి నీ చరణములే కోరితిమయ్యా నీ శరణమునే వేడితిమయ్యా మా వేదనయే తెలిసిన నీవు మార్గము చూపి కాపాడవయా చరణం నిను చూసినచో అలుపేలేదు నీ తలపొకటే చాలును మాకు అది కలిగించును ఎంతో హాయి మా నీడవు నీవే అండవు నీవే చరణం ఏడుకొండలను చూసినచాలు బతుకే మారును ఆ వేడుకతోటి కలియుగమందున అంతా మాయే నీ చూపొకటే సత్యము స్వామీ చరణం కాలినడకన నిను చేరాలని కోరిక కలిగెను తీర్చవ స్వామీ తప్పులు ఎన్నో చేసిన మాకు నిను దర్శించుటయే విరుగుడు స్వామీ చరణం కలలోనైనా కనిపించవయా మనసుకు కలుగును ఎంతో శాంతి గోవిందాయని పిలిచెదమయ్యా మా గుండెలలో నిలవాలనుచు - సి. యస్ రాంబాబు
Read More

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి లోకబాంధవుడవుగా వినవయ్య మా మొరను పెదవేదో పలికింది మనవేదో చేసింది చరణం కలియుగ దైవమని నిను కొలిచేమయా పిలుపే వినమని నిను తలిచేమయా చరణం నీడగ నీవుంటే తోడుగ వెంటుంటే పండగ ప్రతిరోజూ పాటగ ప్రతిక్షణము చరణం కమ్మని నీ నవ్వు వెచ్చగ నీచూపు మముతాకితే చాలు ముత్యాలు రాలునుగ చరణం మాటలు రావంట మమతే నీవంట లేదంట ఏతంటా పండునిక బతుకంటా - సి. యస్ రాంబాబు
Read More

క్రిస్టమస్

క్రిస్టమస్ నకిలీపురం నుండి నా చెల్లెలు "నీ కూతురిని చూడాలనిపించింది తీసుకునిరా అన్నయ్యా అని కబురుపెడితే”. నేను, నా ముద్దుల కూతురు ఇద్దరము వెళ్ళాము. బస్టాండు నుండి ఒక కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళాలి వాళ్ళింటికి. పాపని భుజాలమీద ఎక్కించుకొని బయలుదేరాను. వీది నిండా లైట్లు, భక్తి పాటలు, ప్రార్థనలతో హోరెత్తుతోంది. పాప ఆ పండుగను చూసి ఎంతో ఆతృతగా ప్రశ్నలు అడుగుతోంది. ఎండ ఎక్కువుగా ఉండటం వల్ల నేను ఏమీ చెప్పలేక పోయా. అక్కడున్న ఐస్క్రీమ్, బాంబే మిఠాయి తింటూ శాంటాక్లాస్, క్రిస్మస్ ట్రీ, మొదలగువాటిని ఆస్వాదిస్తూ నిద్రపోయింది. ఇంటికి వచ్చి అందర్నీ పలకరించి, చుట్టాలు ఇంటికి పోయివచ్చినా గానీ పాప ఇంకా లేవలేదు. టైమ్ 5 గంటలయింది పాపని నిద్ర లేపి స్నానం చేయించి, వంటా వార్పు కార్యక్రమాలు చేసేటప్పటికి 7:30 నిమిషాలయింది మా చెల్లికి. ఇంట్లో వాళ్ళతో కలిసి భోజనం చేసి ఆరుబయట నులక మంచ మేసుకొనో…
Read More

సిరులమేను.. పైడితల్లి సిరిమాను

సిరులమేను.. పైడితల్లి సిరిమాను ఉత్తరాంధ్ర ఇలవేల్పు.. అమ్మలగన్న అమ్మ పైడితల్లి అమ్మవారి పేరిట ప్రతి ఏటా జరుపుకునే అమ్మవారి సిరిమానోత్సవం దేశంలోనే ఎక్కడా జరగని కనీవినీ ఎరుగని సంబరం. ఈ జాతర విశేషాలను స్మరించుకున్న ప్రతిసారి భక్తితో తనువు పులకిస్తుంది. అమ్మకు అచేతనంగానే మనసు నమస్కరిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా నెలరోజుల‌ ఈ జాతరలో ఈనెల 11న సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది... విజయనగరం రైల్వేస్టేషన్‌కి సమీపంలో పైడిమాంబ అమ్మవారి ఆలయం వనంగుడి ఉంది. వనం అంటే అడవి కనుక దీన్ని వనంగుడి అన్నారు. దీన్ని అమ్మపుట్టినిల్లుగా భావిస్తారు. ఊరి మధ్యలో చదురుగుడి ఉంది. దీన్ని మెట్టినింటిగా కొలుస్తారు. చదురుగుడిలో అమ్మవారికి ఇరువైపులా ఘటాలుంటాయి. దీనిలోని నీటిని అమ్మవారి తీర్థంగా భక్తులు పుచ్చుకుంటారు. ఈ గుడిలోనే రావి, వేప చెట్ల సంగమ వృక్షం ఉంది. దీని మొదట్లో పోతురాజు పూజలందుకుంటూ ఉంటాడు. ఉత్తరాంధ్ర కల్పవల్లి: విజయనగరంలో అమ్మవారు వెలిసిన…
Read More

కురుక్షేత్ర యుద్ధం లో 50లక్షల మందికి వంట చేసింది ఎవరు?

కురుక్షేత్ర యుద్ధం లో 50లక్షల మందికి వంట చేసింది ఎవరు? ఇంట్లో మనం నలుగురికి లేదా 5గురికి వంట చేయగలం. అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని. మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోండి. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి 50 లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు. అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి, రెండవది బలరాముడు. ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి. దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది. ఉడిపిరాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు…
Read More