శివరాత్రి వైకుంఠ ఏకాదశి పొద్దున్నే పనులన్నీ చేసుకుని, అందరం ఉపవాసం కాబట్టి పిల్లలకు మాత్రం ఉప్మా చేసేసి, బాక్స్ లలో పెట్టేసి నేను కూడా తయారయ్యి, బడికి బయలుదేరాను. ఎప్పటిలా క్లాస్ లన్ని చెప్పేసేసి, లంచ్ లేదు కాబట్టి నేను రాయకుండా వదిలేసిన అసైన్ మెంట్స్ రాసుకున్నా, సాయంత్రం బడి అయ్యాక, ఇంటికి వచ్చేసి, కాళ్ళు చేతులు కడుక్కుని ట్యూషన్ కి వచ్చిన పిల్లలని కూర్చోబెట్టి నేను మా పిల్లలకు హోం వర్క్ చేయించడం మొదలు పెట్టాను. అదయ్యేసరికి రాత్రి ఎనిమిదిన్నర అవడంతో మాకు టిఫిన్, అలాగే పిల్లల కోసం ఏదైనా చేయాలని అనుకున్నా, అందరికీ కలిపి సేమ్యా ఉప్మా చేశాను. పిల్లలకు పెట్టాను. నేను మళ్ళీ దేవుడికి దీపం పెట్టేసి అమ్మకు, నాకు ఉప్మా పెట్టాలని అనుకునే సమయంలో హఠాత్తుగా మణికొండ లో ఉండే మా పెద్ద తమ్ముడు వచ్చాడు. రావడం తోనే ఏం చేస్తున్నారు అంటే ఉపవాసం కదా…